బస్తర్ కోసం యుద్ధం పార్ట్3: పట్టించుకోని కొండల్లో అనుమతి లేని ప్రయాణం
బసవరాజ్ మరణానికి దారితీసిన పరిస్థితులు ఏంటీ?;
మే 21వ తేదీ ఉదయం, నారాయణపూర్ లోని అబుడ్ మడ్ ప్రాంతంలో తూర్పు భాగంలో ఒక ప్రధాన భద్రతా ఆపరేషన్ జరుగుతోంది. ఇందులో చత్తీస్ గఢ్ పోలీస్ జిల్లా రిజర్వ్ గార్డ్(డీఆర్జీ) బృందానికి నాయకత్వం వహిస్తున్న ఓ సైనికుడి గుండెలో ఒక కొండ నుంచి పేలిన తూటా దూసుకుపోయింది.
దశాబ్ధాలుగా ‘మాధ్’ అనేది బస్తర్ ప్రాంతంలో ఒక నిషేధిత కొండల శ్రేణిగా ఉంది. ఇక్కడ అబూజ్మాడియాస్ గిరిజన తెగలోని చిన్న చిన్న గ్రామాలు అక్కడ అక్కడ విసిరేసినట్లు ఉన్నాయి. ఇది చాలాకాలం మావోయిస్టులకు పెట్టని కోటలా బలంగా ఉంది.
కాల్పుల్లో డీఆర్జీ యోధుడు మరణించాడు. కానీ దంతేవాడ, బీజాపూర్, నారాయణపూర్ జిల్లాల ట్రై జంక్షన్ లోని బోటర్ గ్రామ అడవుల అంతర్భాగంలో రెండు రోజుల పాటు కొనసాగిన వేట తరువాత విజయం సాధించింది.
ఈ ప్రాంతం దాదాపు 4 వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ ఎప్పుడూ ఎలాంటి సర్వే జరగలేదు. అలాంటి ప్రాంతంలో ఇది ఉంది. ఇక్కడ ఐదు గంటల పాటు జరిగిన భారీ కాల్పుల్లో భద్రతా దళాలు వారు తాము వెతుకుతున్న లక్ష్యాన్ని మట్టుబెట్టాయి.
నిషేధిత సీపీఐ మావోయిస్టుల ప్రధాన కార్యదర్శి 74 ఏళ్ల బసవరాజు, అలియాస్ నంబాల కేశవరావు, ఆయన రక్షణ కల్పించే 26 మంది మొత్తం బృందం తుడిచిపెట్టుకుపోయారు.
మరుసటి రోజు ఉదయం మావోయిస్టులు విడుదల చేసిన ప్రకటనలో బసవరాజు కాకుండా 27 మంది మరణించినట్లు తెలిపింది. ఇది వారి గుండె మీద జరిగిన అతిపెద్ద దాడి.
బసవరాజు బృందంలోని ఐదుగురు లేదా ఆరుగురు సభ్యులు ఆ ఉదయం తమ క్యాడర్ లోని ఒకరి మృతదేహాన్ని తీసుకుని పారిపోయారని భద్రతా అధికారులు తెలిపారు.
ఒక కలయిక..
‘‘మేము ఆపరేషన్ ను దాదాపుగా విడిచిపెట్టాము’’ అని హరిశంకర ప్రసాద్ ధ్రువ్(31) ఫెడరల్ తో చెప్పారు. ఇటీవల మధ్యాహ్నం తన బృందం మూడు రోజుల పాటు ఎదుర్కొన్న కఠిన ఆపరేషన్ వివరాలు చెప్పారు. ఆయన ఉన్న బృందానికి ‘‘ఈగల్స్’’ అని నామకరణం చేశారు.
వారు సెర్చ్ ఆపరేషన్ లో చాలా ముందు ఉన్నారు. ‘‘బసవరాజు సెంట్రీ మాపై కాల్పులు జరపకపోతే ఆ కొండ ప్రాంతంలో వెలుగు తక్కువగా ఉన్నందున మేము వారిని గుర్తించి ఉండకపోయే వాళ్లము’’ అన్నారు. గత రెండు రోజులుగా మేము వెతికిన ప్రాంతం కాకుండా వేరే దగ్గరికి వెళ్లాలని అనుకున్నాం. ఇదో యాధృచ్చిక ఎన్ కౌంటర్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందిన బీటేక్ గ్రాడ్యూయేట్ అయిన బసవరాజు ఇది ప్రాణాంతక యుద్దంగా మారింది. ఇది నక్సలిజం చరిత్రలో ఒక కీలక ఘట్టం, గతంలో అతను రెండుసార్లు పోలీసులకు దొరినట్లే దొరికి సన్నిహితంగా మెలిగి తప్పించుకున్నాడని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. (ఫొటో)
గల్గామ్ భద్రతా శిబిరం నుంచి సాంకేతిక బృందం డ్రోన్ ఎగరవేయడానికి తగిన ఆదేశాలు ఇస్తున్న దృశ్యం
అపారమైన మేధస్సు, కఠినమైన శిక్షణ
నక్సలిజం చరిత్రలో వారి అగ్ర నాయకడు ఒకరు హతం కావడం ఇదే ప్రథమం. బస్తర్ యుద్ధంలో అదృష్టం తిరగబడింది. భద్రతా కోణం నుంచి చూస్తే బస్తర్ నిర్వచించబడిన వామపక్ష తీవ్రవాదం(ఎల్ డబ్ల్యూఈ) ప్రాంతాలన్నింటిని నిర్మూలించడం కష్టతరమైనది.
2013 లో 45 రోజుల అనేక రాష్ట్రాల ఉమ్మడి ఆపరేషన్ లో దళాలు మొదటిసారి నక్సల్స్ కోట అయిన అబూజ్ మడ్ లోకి అడుగుపెట్టారు. తొలిసారిగా ప్రపంచంలోని ఇతర ప్రాంతాల నుంచి తెగకు చెందిన అనేక చిన్న గ్రామాలను కనుగొన్నాయి.
అందువల్ల ఈ ఆపరేషన్ భద్రతా దళాలకు మావోయిస్టు కార్యకర్తల గురించి కచ్చితమైన, వాస్తవమైన సమాచారం అందిందని కూడా తెలియజేస్తుంది. ఇదంతా భారీ కొండప్రాంతాలు, ఎప్పుడూ సర్వే చేయలేదు.
అయినప్పటికీ వారికి మాత్రం నిఘా సమాచారం మాత్రం అందుతూనే ఉంది. ఇక్కడ ఐదు సంవత్సరాల క్రితం వరకూ భద్రతా దళాల ఉనికే లేదు. అబూజ్ మడ్ వంటి విశాలమైన ప్రాంతంలో మావోయిస్టులపై కచ్చితమైన సమాచారం లేకుండా దట్టమైన అటవీ ప్రాంతంలో వారు తప్పించుకోవడానికి అనేక అవకాశాలు ఉన్నప్పటికి వల విసిరి చేపలు పట్టినట్లు పట్టుకున్నారంటే కారణం కచ్చితంగా రియల్ టైమ్ ఇంటలిజెన్స్ అందుతుండటమే.
నిఘా సమాచారానికి తోడు లొంగిపోయిన మావోయిస్టులు, మాజీ స్పెషల్ పోలీస్ అధికారులు(ఎస్పీఓ), స్థానికంగా నియమించబడిన సిబ్బంది దశాబ్దం క్రితం కంటే నేడు గెరిల్లా వ్యూహాలలో బాగా శిక్షణ పొందారు.
అందుకే మావోల వ్యూహాలను ముందుగానే పసిగట్టి వాటికి విరుగుడు తెస్తున్నారు. ఎన్ కౌంటర్ సమయంలో వారిని చుట్టుముట్టి అణచివేసి బయటకు తీసుకువస్తున్నారు.
టెలిఫోన్ ఇంటర్ సెప్ట్ లు, డ్రోన్ ఫుటేజీలు స్థానిక నిఘా సమాచారం, లొంగిపోయిన నక్సల్ కేడర్ల నుంచి వచ్చిన కీలక సమాచారం అత్యున్నత స్థాయిలో ముందస్తు విశ్లేషణకు వెన్నెముకగా నిలిచిందని తన పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ నిఘా అధికారి ‘ ది ఫెడరల్’ తో చెప్పారు.
క్లిష్ట పరిస్థితుల్లో కఠినమైన ఆపరేషన్
కొండలలో ఈ భాగంలో చాలాసార్లు సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామని ధ్రువ్ అన్నారు. అలాగే ఆరు నెలల్లో భద్రతా దళాలు అనేక ఆపరేషన్లు నిర్వహించాయి. అయితే ఈసారి మాకు అదృష్టం కలిగిందన్నారు.
మే 19న వేడిగా, తేమగా ఉన్న సమయంలో ఒక్కొక్క చదరపు కిలోమీటర్ చొప్పున విశాలమైన ప్రాంతాన్ని శోధిస్తూ పాదచారుల గస్తీ ప్రారంభించామని ధ్రువ్ చెప్పారు. 41 డిగ్రీల సెల్సియస్ ఎండలో కూడా దంతేవాడ, బీజాపూర్ జిల్లాల నుంచి బృందాలు కొండలకు దక్షిణం, నైరుతి నుంచి చుట్టుముట్టడం ప్రారంభించాయి.
నారాయణపూర్ నుంచి వచ్చిన డీఆర్జీ బస్తర్ ఫైటర్స్, కేంద్రపారామిలిటరీ దళాల కంపెనీలు ఓర్చా తహసీల్ స్థలానికి దక్షిణంగా ఉన్న తూర్పు అంచుల నుంచి లోపలికి చొచ్చుకువచ్చాయి.
‘‘మొదటి ఘర్షణ కొండల దిగువన ప్రాంతంలో జరిగింది’’ అని గిరిజనుడైన ధ్రువ్ గుర్తు చేసుకున్నాడు. ఆ కాల్పుల్లో బహుశా ఎటువంటి నష్టం జరగలేదని చెప్పాడు. తరవాత రోజు భారీ స్థాయిలో వర్షం కురవడంతో ఈ ప్రాంతం ప్రశాంతంగా మారింది.
కానీ మా కదలికలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ‘‘మేము తడిసిపోయాము. రెండు రోజుల పాటు సైనికుల బృందం అప్పటికే తాత్కాలికంగా వేసిన క్యాంపులో ఉండగా, మరికొంతమంది లోతుకు వెళ్లి భారీ గుట్టలను శోధించారు.
‘‘ఈ సమయంలో మాకు దోమలు, ఎలుగుబంట్లు, తేనేటీగలు మాకు తోడుగా ఉన్నాయి’’ అని అతను చమత్కరించాడు. మాధ్ అనేది నదులు, వాగులు, ఎత్తుపల్లాలు కలిగిన కొండలు, గట్లు, దట్టమైన అడవులతో నిండిన భూభాగం అని ఆయన వివరించాడు.
‘‘పాతా హి నహి చల్తా ఆప్కే పచాస్ మీటర్ పర్ కోయి చుపా హువా హై’’ ( మీకు 50 మీటర్ల దూరంలో ఎవరైనా దాక్కున్నా మీకు తెలియదు)
గతంలో కాకుండా ఇటీవల కార్యకలాపాలు అత్యంత సమన్వయంతో, ఆధునాతనంగా ఉన్నాయి. దళాలు సాధారణంగా కొండలలో చిక్కుకున్న స్థానిక గిరిజనుల గ్రామాల చుట్టూ తిరిగేవి. ‘‘రాత్రులు, మా బృందం నడుస్తుంది. పగటిపూట మేము విశ్రాంతి తీసుకుంటాము. ఆయుధాలతో పాటు వారి వీపులపై మోస్తున్నప్పుడూ ఆహారం, ఔషధ సామగ్రి చాలా ఉన్నాయి’’
మూడు రోజుల ఆపరేషన్ ముగిసే సమయానికి మోస్ట్ వాంటేడ్ మావోయిస్టు నాయకులలో ఒకరైన బసవరాజును బలగాలు మట్టుబెట్టాయి. జాతీయ దర్యాప్తుసంస్థ (ఎన్ఐఏ) ప్రకటించిన రూ. 1.5 కోట్ల బహుమతిని అందుకున్నాడు.
అవపల్లి- గల్గన్ రహదారి వెంబడి పొలాలు, వెనక భాగంలో కర్రెగుట్టలు
బసవరాజు గురించి..
మీడియా నివేదికల ప్రకారం..బసవరాజు లేదా గగన్న అనే మారుపేరుతో పిలువబడే నంబాల కేశవరావు నేటీ ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లాకు చెందినవాడు. తెలంగాణలోని వరంగల్ లో గల ప్రాంతీయ ఇంజనీరింగ్ కళాశాల( ఆర్ఈసీ, ప్రస్తుతం నిట్) నుంచి టెక్నాలజీలో బ్యాచిలర్స్ పూర్తి చేశాడు.
సంపన్న బ్రాహ్మణ కుటుంబానికి చెందిన ఆయన కళాశాల రోజుల్లోనే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్(ఆర్ఎస్యూ) లో చేరిన తరువాత రాడికల్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. ఆర్ఎస్ఎస్ విద్యార్థి విభాగంతో క్యాంపస్ ఘర్షణలో ఒక విద్యార్థిని హత్య చేసిన కేసులో(1979) జైలుకు వెళ్లారు.
1980 లో బెయిల్ పై బయటకు వచ్చి అజ్ఞాతంలోకి వెళ్లారు. తన తొలి దశలో ఆంధ్ర- ఒడిశా సరిహద్దులోని గిరిజన, రైతు ఉద్యమాలకు నాయకత్వం వహించారు. అతి త్వరగానే పాత పీపుల్స్ వార్ గ్రూప్ పరిధిలోకి ఆయుధాలు చేపట్టే విభాగంలోకి వెళ్లారు.
రెండు దశాబ్ధాలుగా సీపీఐ(మావోయిస్టులు) లో అంచెలంచెలుగా ఎదిగి, సీపీఐ మొదటి ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణ రావు తరువాత ఫిబ్రవరి 2004 లో కోరాపుట్ జిల్లా పోలీస్ ఆయుధశాలను సాహసోపేతంగా దోచుకోవడంలో సహ అనేక సైనిక చర్యలకు నాయకత్వం వహించాడు.
కేంద్ర సైనిక కమిషన్ అధిపతిగా, తరువాత ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తిరుగుబాటుదారులు ఛత్తీస్ గఢ్ లో తమ దాడులు పెంచారు.
ఆజానుబాహుడు, ధృడంగా ఉండే బసవరాజు లోతైన స్వరంతో గంభీరమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నాడని లొంగిపోయిన మావోయిస్టులు చెప్పేమాట. ఆయన 9ఎంఎం పిస్టల్, ఏకే-47, కమ్యూనికేషన్ పరికరాలను నిరంతరం అట్టిపెట్టుకునే వారు. చాలా చురుకుగా వ్యవహరించేవారని అంటున్నారు.
చివరి ఆశ్రయం.. కర్రె గుట్టలు..
ఏప్రిల్ 21 నుంచి మే 11 వరకూ బీజాపూర్ లోని కర్రెగుట్ట కొండలలో జరిగిన ఆపరేషన్ చాలా కష్టమైనది. వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర, పారామిలిటరీ దళాల నుంచి దాదాపు పదివేల మంది భద్రతా సిబ్బందిని ఛత్తీస్ గఢ్ - తెలంగాణ సరిహద్దు చివరన ఉత్తరం నుంచి దక్షిణం వరకూ ఉన్న 60 కిలోమీటర్ల పొడవు, 20 కిలోమీటర్ల వెడల్పు గల కఠినమైన భూభాగంలోకి ప్రవేశించారు.
ఇవి నాలుగు వరుసలలో ఉన్నాయి. ఎత్తైన శిఖరాలు కొన్ని 800 మీటర్ల పొడవైన చెట్లు, దట్టమైన పొదలతో ఉంటాయి. ఎదుటి మనిషి ఉన్న గుర్తించడం కష్టమైన ప్రాంతంలో బలగాలకు అనేక సవాళ్లు ఎదురయ్యాయి.
నారాయణపూర్ లోని అబూజ్ మడ్ తో పాటు బీజాపూర్ లోని కర్రేగట్టలు నిషేధిత మావోయిస్టులకు చివరి ప్రధాన ఆశ్రయం. ఏ మాత్రం నివాసయోగ్యం కాని భూభాగం, భద్రతా దళాలకు శాశ్వత స్థావరాలకు ఏర్పాటుకు ఇబ్బంది కలిగించాయి. అలాగే ఈ ప్రాంతాలు సులభంగా దాక్కునే ప్రదేశాలను అందిస్తాయి.
మావోయిస్టు అగ్రశ్రేణి నాయకులకు కూడా రెండు కొండ ప్రాంతాలు దీర్ఘకాలికంగా దాక్కుకునేందుకు అనుకునేవి కావు. ఎందుకంటే ఆహారం, నీరు, సమాచారం కోసం బయటకు రావాల్సిందే.
‘‘మేము ఎదుర్కోవాలో సిద్దం కావడానికి, ఊహించడానికి మాకు నెలలు పట్టింది’’ అని బీజాపూర్ ఎస్పీ జితేంద్ర యాదవ్ ‘ది ఫెడరల్’ తో ఒక ఇంటర్వ్యూ సందర్బంగా చెప్పారు. ‘‘చివరకు మాకు దీన్ని అమలు చేయడానికి ఒక నెల సమయం పట్టింది’’ అని ఆయన అన్నారు.
చత్తీస్ గఢ్ లోని బీజాపూర్ ను మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాను కలిపి భోపాల్ పట్టణం వంతెన నుంచి ఇంద్రాయణి నదీ దృశ్యం
అజేయమైనది కాదు..
మోదక్ పాల్-పుజారికాంకర్ రోడ్డులోని కొండలకు తూర్పున 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న గల్గన్ అనే గ్రామం, భద్రతా సిబ్బంది బృందాలకు రేషన్, పరికరాలు, ఇతర సామగ్రిని రవాణా చేస్తూ గాయపడిన సిబ్బందిని తరలించడానికి హెలికాప్టర్ ల్యాండ్ బేస్ గా తరువాత ఫార్వార్డ్ ఆపరేషనల్ బేస్ గా మారింది. భద్రతా దళాల కార్యకలాపాలను పర్యవేక్షించడానికి బీజాపూర్ లోనే 24/7 వార్ రూమ్ ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
ఆపరేషన్ కు ముందు భద్రతా దళాలు ఎప్పుడూ కొండల్లోకి ప్రవేశించలేదు. అక్కడక్కడా సహజ సొరంగాలు, భారీ గుహలు ఉన్నాయి. బస్తర్ అంతటా ఏ ప్రదేశం ఎంత కష్టతరమైన, దుర్భేద్యమైన మావోయిస్టులకు సురక్షితంగా లేకపోవడం వలన ఆపరేషన్ చూసి ఆందోళనకు గురయ్యారని యాదవ్ అన్నారు.
భద్రతా అధికారుల ప్రకారం కర్రెగుట్టలో మావోయిస్టుల పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి బలమైన ఉనికి ఉంది. బెటాలియన్ వన్ లోని వారికి బాగా శిక్షణ పొందిన సైనిక కంపెనీలు చాలా వరకూ దీనిని విశ్రాంతి, శిక్షణ స్థలంగా కూడా ఉపయోగిస్తాయి. కర్రెగుట్టలో ఆయుధ తయారీ సౌకర్యాలను కూడా గుర్తించామని యాదవ్ తెలిపారు.
దక్షిణ ప్రాంతమైన డోర్నపాల్, జాగర్గుండ, బాసగూడ, అవపల్లి తూర్పు పడమర ప్రాంతమైన సుక్మా, దంతేవాడ, బీజాపూర్ జిల్లాల భాగాలను చుట్టుముట్టాము. ఇవి ఇప్పటికి సున్నితమైనవి.
మావోయిస్టు ఉద్యమానికి బలమైన ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ మైదానాలలో ఇప్పుడు పెరుగుతున్న భద్రతా శిబిరాలను మీరు చూస్తున్నారు. దీనివల్ల మావోయిస్టుల కదలికలు పరిమితంగా మారాయి. అలాగే కఠినంగా ఉన్నాయి.
మావోయిస్టుల ఉద్యమానికి బలమైన ప్రాంతాలుగా పిలవబడుతున్న ప్రాంతాలు
ఎలా కదులుతున్నాయి..
జగదల్ పూర్ ఉత్తర- దక్షిణ అక్షం నుంచి పశ్చిమ దిశ అయిన కొంకాకు దళాలు కదులుతున్నాయని మావోయిస్టుల ప్రభావం, ఆధిపత్య ప్రాంతాలను తగ్గించడానికి ప్రాంతాలను క్లియర్ చేయడం వాటిని పట్టుకోవడం అనేక ప్రాంతాలను శోధించడం జరుగుతుందని ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(బస్తర్ రేంజ్) సుందర్ రాజు పట్టిలింగం అన్నారు. ఈ దశకు చేరడానికి వారికి దాదాపు 15 సంవత్సరాలు పట్టిందని వివరించారు.
మోదక్ పాల్- ఆవపల్లి స్ట్రేచ్ ( మ్యాప్ లో ఉత్తరం నుంచి దక్షిణం వరకూ) సీఆర్పీఎఫ్ దళాలు ప్రాణ నష్టాన్ని చూశాయి. తిరుగుబాటుదారులు అడవుల్లోకి పారిపోవడంతో వ్యూహాత్మక పాత్ర పోషిస్తున్న టార్పెర్లు వంటి చిన్ననదులతో నిండి ఉంది.
‘‘ఈ నదులలో మావోయిస్టులు తప్పించుకోవడానికి ఉపయోగించే మార్గాలు ఉన్నాయి’’ అని కీలకమైన అవపల్లి ప్రాంత సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ తిలేశ్వర్ యాదవ్ అన్నారు.
‘‘బెటాలియన్ వన్ ప్రధాన కంపెనీలు పనిచేసే కీలక ప్రాంతం కూడా ఇదే. ఈరోజు బార్సే దేవా అనే డివిజనల్ కమిటీ సభ్యుడు నాయకత్వం వహిస్తున్న ఒక ప్రాంతం. మరోక వాంటేడ్ కేడర్ మాద్వి హిద్మా ఇటీవల వారి పార్టీ కేంద్ర కమిటీకి పదోన్నతి పొందారు’’ అని ఆయన చెప్పారు. ‘‘మా దళాలు ఇంకా వారితో ముఖాముఖి పోటీ చేయలేదు’’
కర్రెగుట్టల దిగువన నంబీ గ్రామంలో హత్యకు గురైన గిరిజనుల సాంప్రదాయ స్మారక చిహ్నాలు
ఐఈడీల ప్రమాదం..
ఈ కేడర్లు రిమోట్ ల ద్వారా నియంత్రించబడే వాటి నుంచి వైర్ సెన్సార్ ల వరకూ సాధారణ మాన్యువల్ పేలుడు పదార్థాల వరకూ అన్ని రకాల ఐఈడీలో నిపుణులు అని అతను చెప్పాడు.
కర్రె గుట్టలలో ఆపరేషన్ జరిగిన దాదాపు అన్ని రోజులలోనూ భద్రతా దళాలు ఐఈడీ సవాల్ ను ఎదుర్కొన్నాయి. ‘‘ప్రతి రోజు మేము ఐఈడీ పేలుళ్లలో ప్రాణ నష్టం చవి చూశాము.
మొత్తం మీద 18 మంది సిబ్బంది గాయపడ్డారు. చాలా కష్టంతో వారిని తరలించాల్సి వచ్చింది’’ అని యాదవ్ వెల్లడించారు. కర్రెగుట్టలో ఐఈడీలను స్థానికంగా తయారు చేస్తున్నారు.
మా సిబ్బంది కొండలను జల్లెడపట్టి 21 రోజుల్లో వాటిలో దాదాపు 450 ఐఈడీలను కనుగొని నిర్వీర్యం చేశారు. 600 కంటే ఎక్కువ ఐఈడీలు ఇప్పటికి అక్కడే ఉన్నాయని మేము అంచనా వేస్తున్నాము’’
ఆపరేషన్ ముగిసిన తరువాత కూడా మే చివరలో తెండు ఆకులను సేకరించడానికి కర్రెగుట్టలలోకి వెళ్లిన ముగ్గురు గ్రామస్తులు ప్రమాదవశాత్తూ మాన్యువల్ ఐఈడీలపై కాలువేసి మరణించారు.
అబూజ్ మడ్ ఇతర సున్నిత ప్రాంతాల విషయంలో ఇదే జరిగింది. జూన్ 9 న చత్తీస్ గఢ్- ఆంధ్ర సరిహద్దులోని కొంటా- ఎర్రబోర్ రహదారి పై జరిగిన ఐఈడీ పేలుడులో సుక్మా అదనపు ఎస్పీ ఆకాశరావు గిరిఫుంజే మరణించగా ఇద్దరు పోలీస్ అధికారులు గాయపడ్డారు.
గల్గాన్ లోని ఒక సీఆర్పీఎఫ్ కమాండర్ పేరు చెప్పకూడదని అడుగుతూ ఒప్పుకున్నట్లుగా ‘‘మీరు నిజంగా జాగ్రత్తగా ఉండి, అక్కడ బూబీ ట్రాప్ గా అమర్చబడిన ఐఈడీ సంకేతాలను గుర్తించగలిగితే తప్ప సజీవంగా బయటపడటం కష్టం’’.
పార్ట్ 4, త్వరలో వస్తుంది: మావోయిస్టుల తదుపరి దశ ఏమిటీ?