తొక్కిసలాటలో మృతుల కుటుంబాలకు పరిహారం పెంపు

నైతిక బాధ్యత వహిస్తూ పదవులకు రాజీనామా చేసిన కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కెఎస్‌సిఎ) కార్యదర్శి కోశాధికారి ఎ శంకర్, ఇఎస్ జైరామ్..;

Update: 2025-06-08 08:38 GMT
Click the Play button to listen to article

బెంగళూరు(Bangalore)లో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారాన్ని రూ.25 లక్షలకు పెంచింది. తొలుత రాష్ర్ట ప్రభుత్వం రూ. 10 లక్షలు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక 11 మంది మృతికి నైతిక బాధ్యత వహిస్తూ, కర్ణాటక రాష్ట్ర క్రికెట్ సంఘం (కెఎస్‌సిఎ) కార్యదర్శి కోశాధికారి ఎ శంకర్, ఇఎస్ జైరామ్ తమ పదవులకు రాజీనామా చేశారు. గురువారం రాత్రి తమ రిసిగ్నేషన్ లెటర్లను KSCA అధ్యక్షుడికి సమర్పించినట్లు వారు సంయుక్త ప్రకటన విడుదల చేశారు.

ఐపీఎల్‌(IPL)లో ఆర్‌సీబీ (Royal challengers Bangalore) విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బెంగళూరు చిన్న స్వామి స్టేడియంలో విజయోత్సవ సంబరాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. సుమారు 3 లక్షల మంది స్టేడియం వద్దకు చేరుకున్నారు. మెయిన్ గేటు తెరవకముందే స్టేడియంకు ఉన్న మరో చిన్నగేటు వద్ద తొక్కిసలాట జరిగింది.

కొహ్లీపై కేసు నమోదు చేయాలి..

ఇటు కన్నడ సంస్థ నైజా హొరతగారర వేదికెం సభ్యుడు, కార్యకర్త ఏఎం వెంకటేష్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే FIR ఇంకా నమోదు కాలేదు. తొక్కిసలాటకు సంబంధించి కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌లోనూ మరో రెండు కేసులు నమోదయ్యాయి. తొక్కిసలాటకు కారణమైన కొహ్లీ.. కనీసం పశ్చాత్తాప పడకుండా విషాదం జరిగిన మరునాడే లండన్ వెళ్లిపోవడాన్ని చాలామంది తప్పుబడుతున్నారు. కొహ్లీని అరెస్టు చేయాలంటూ #ArrestKohli అనే హ్యాష్‌ట్యాగ్‌తో సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.

ఘటన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలు..

▶ ఆర్‌సిబి ఉన్నతాధికారులలో నలుగురికి 14 రోజుల జైలు శిక్ష

▶ సీఎం సిద్ధరామయ్య తన రాజకీయ కార్యదర్శిని తొలగించారు

▶ ఇంటెలిజెన్స్ హెడ్ హేమంత్ నింబాల్కర్ బదిలీ

▶ RCB, KSCA లపై కేసుల నమోదు

▶ కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన బిజెపి ప్రతినిధి బృందం.. ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంపై ఫిర్యాదు 

Tags:    

Similar News