కోల్‌కతా నుంచి బెంగళూరుకు రామేశ్వరం కేఫ్ నిందితులు..

ఎట్టకేలకు బెంగళూరు రామేశ్వరం కేఫ్‌లో పేలుళ్లకు పాల్పడిన నిందితులు దొరికారు. కోల్‌కతాలో పట్టుబడిని ఇద్దరు నిందితులను కోర్టు అనుమతితో బెంగళూరుకు తీసుకువచ్చారు.

Update: 2024-04-13 06:10 GMT

రామేశ్వరం కేఫ్‌ పేలుళ్ల కేసులో ఇద్దరు ప్రధాన నిందితులను ట్రాన్సిట్‌ రిమాండ్‌పై కోల్‌కతా నుంచి బెంగళూరుకు తీసుకొచ్చారు.

ఇద్దరిని సాధారణ వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లి, ఆ తర్వాత జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కోర్టులో హాజరుపరచనున్నారు.

కోల్‌కతాలోని ఒక కోర్టు శుక్రవారం ఇద్దరు నిందితులకు 3 రోజుల ట్రాన్సిట్ రిమాండ్‌ను మంజూరు చేస్తూ.. వారిని కర్ణాటక రాజధానికి తీసుకెళ్లడానికి NIAకి అనుమతినిచ్చింది.

రామేశ్వరం కేఫ్‌లో జరిగిన పేలుడులో 10 మంది గాయపడిన విషయం తెలిసిందే. ఈ కేసులో కోల్‌కతాకు చెందిన ముస్సావిర్ హుస్సేన్ షాజిబ్, అద్బుల్ మతీన్ అహ్మద్ తాహాలను NIA అరెస్టు చేసింది.

NIA ప్రకారం..షాజిబ్ కేఫ్‌లో పేలుడుకు ఉపయోగించే ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (IED)ని ఉంచాడు. తాహా ప్రధాన సూత్రధారిగా నిర్ధారించారు. ఈ ఇద్దరు నిందితుల అరెస్టుకు సంబంధించి సమాచారం అందించిన వారికి ఎన్‌ఐఏ మార్చిలో ఒక్కొక్కరికి రూ.10 లక్షల రివార్డును ప్రకటించింది. బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌లోని ఐటీపీఎల్ రోడ్‌లో ఉన్న కేఫ్‌లో మార్చి 1న పేలుడు సంభవించగా..3న విచారణ చేపట్టింది.  

Tags:    

Similar News