షేక్ అవుతున్న స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్, నిప్టీ భారీగా..

ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఆశించిన స్థాయిలో సీట్లు సాధించకపోవడం, రూపాయి విలువ క్షీణించడంతో మంగళవారం స్టాక్ మార్కెట్లు భారీగా నష్టాలు చవిచూశాయి.

Update: 2024-06-04 07:14 GMT

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా పతనం అవుతున్నాయి. ఫిబ్రవరి 2022 తరువాత ఒకరోజులో స్టాక్ మార్కెట్లు భారీగా పతనమవడం ఇదే తొలిసారి. నిఫ్టీ 929.80 పాయింట్లు లేదా 4 శాతం క్షీణించి 22,334.10 వద్ద, సెన్సెక్స్ 3570 పాయింట్లు లేదా 4.47 శాతం పడిపోయి 72,952 వద్ద ట్రేడ్ అవుతున్నాయి.

మార్కెట్ పనితీరుకు కీలక సూచిక అయిన సెన్సెక్స్, కౌంటింగ్ ప్రారంభమైన మొదటి 90 నిమిషాల్లోనే 2,700 పాయింట్ల మేరకు పతనమైంది, ఫలితంగా ₹14,000 కోట్ల పెట్టుబడిదారుల సంపద తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఆకస్మిక భారీ పతనం ఎన్నికల ఫలితాలకు సంబంధించి మార్కెట్ ఆందోళన, అనిశ్చితిని ప్రతిబింబిస్తుంది.
భారీగా నష్టపోయిన ఆదాని షేర్లు..
కౌంటింగ్ జరుగుతున్న కొలది అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు కూడా 5 శాతానికి పైగా క్షీణించాయి. ఈ అనూహ్య తిరోగమనం చాలా మంది పెట్టుబడిదారులను ఆకర్షించింది, వారి పోర్ట్‌ఫోలియోలను సర్దుబాటు చేయడానికి తమ శక్తి మేరకు ప్రయత్నిస్తున్నారు.
ఉదయం 10 గంటల సమయానికి, నిఫ్టీ 2.31 శాతం క్షీణించి, 536.25 పాయింట్లను కోల్పోయింది. ఇండెక్స్ 22,400 మార్క్ పైన నిలదొక్కుకోవడానికి చాలా కష్టపడింది, కానీ ఒత్తిడికి లొంగిపోయింది, కౌంటింగ్ భారీగా పతనమవడం ప్రారంభించింది.
మార్కెట్ అస్థిరతకు రూపాయి ప్రభావం..
మార్కెట్ అస్థిరత ప్రభావంతో రూపాయి కూడా ట్రేడింగ్ ప్రారంభంలో US డాలర్‌తో పోలిస్తే 24 పైసలు పడిపోయి 83.38 వద్దకు చేరుకుంది. ఈ క్షీణత భారత ఆర్థిక వ్యవస్థపై పెరుగుతున్న ఒత్తిడి నిదర్శనంగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
ఎన్నికలకు ముందు రోజులలో క్రమంగా పెరిగిన సెన్సెక్స్, ఒక్కసారిగా 2,100 పాయింట్లు నష్టపోయి, నిఫ్టీని 22,700 మార్క్ దిగువకు లాగింది. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న కొద్ది పెట్టుబడి దారులు క్రమంగా తమకు సురక్షిత గమ్యస్థానం స్థానం మరో మార్కెట్ పై కి దృష్టి పెట్టడం కూడా సెన్సెక్స్ కుప్పకూలడానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
బీజేపీ పనితీరుపై అనిశ్చితి
సోమవారం (జూన్ 3), కౌంటింగ్ ప్రారంభానికి ముందు రోజు, సెన్సెక్స్ 2,500 పాయింట్లు లేదా 3.3 శాతం పెరిగి రికార్డు గరిష్ట స్థాయి 76,468.8 వద్ద ముగిసింది. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసింది. నిఫ్టీ కూడా 2.7 శాతంపైగా లాభపడి 23,148.05 వద్ద ముగిసింది.
అయితే, జూన్ 3కి ముందు ఐదు ట్రేడింగ్ సెషన్లలో, ఎన్నికలలో బిజెపి పనితీరు చుట్టూ ఉన్న అనిశ్చితి, విదేశీ పెట్టుబడిదారులు బేరిష్ పొజిషన్లను నిర్మించడం వల్ల నిఫ్టీ దాదాపు 2 శాతం క్షీణించింది. బలమైన Q1 GDP వార్షికంగా 7.8 శాతం వృద్ధి చెందడం, భారతదేశ రేటింగ్ ఔట్‌లుక్‌ను S&P పైకి సవరించడం మార్కెట్‌కు ప్రాథమిక మద్దతును అందించింది.
Tags:    

Similar News