ఆర్సీబీ తొక్కిసలాట వెర్రి అభిమానులకు ఓ షాక్!
భారత్ లో క్రికెట్ మతం అయితే, దాని దేవత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్;
By : KS Dakshina Murthy
Update: 2025-06-05 10:59 GMT
క్రికెట్ అనేది భారత్ లో ఒక మతం అయితే, ఆర్సీబీ వాళ్లకు దేవత వంటిది. అలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న జట్టు 17 సంవత్సరాల సుదీర్ఘ విరామం తరువాత తొలిసారి ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది.
దేశంలో ఎక్కడ ఆర్సీబీ మ్యాచ్ ఆడిన దాని అభిమానుల హంగామా మనం మాటల్లో చెప్పలేము. అలాంటి తమ జట్టు టైటిల్ గెలిచి బెంగళూర్ లో అడుగుపెట్టగానే దాని అభిమానులు లక్షలాదిగా గుమిగూడారు.
ఈ భారీ జనసందోహం వలన తొక్కిసలాట జరిగి కనీసం 11 మంది మరణించారు. 50 మందికి పైగా ప్రజలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనికి కారణం తమ అభిమాన జట్టును చూడటానికి రావడమే.
అహ్మదాబాద్ లో మంగళవారం ఫైనల్ జరిగింది. నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు విజయం సాధించింది. బెంగళూర్ లో నిన్న ఎలాంటి మ్యాచ్ జరగలేదు.
మ్యాచ్ ను చూసేందుకు వెళ్తున్న సమయంలో ఈ తొక్కిసలాట జరిగి ఉంటే అర్థం చేసుకోవచ్చు. కానీ అన్ని ఇబ్బందులను అధిగమించి ఐపీఎల్ కప్ ను, విరాట్ కోహ్లీని, మిగిలిన జట్టును చూడటానికి స్టేడియంలోకి వెళ్లడం తర్కానికి నిలబడుతుందని చెప్పలేము.
ఆర్సీబీకీ కోహ్లీనే ఓ బ్రాండ్ అంబాసిడర్, మస్కట్. ఆ జట్టు 17 సంవత్సరాల తరువాత టైటిల్ ను ఒడిసిపట్టింది. ఆర్సీబీకి బెంగళూర్ లో ఉన్న మద్దతును పక్కన పెడితే దేశ వ్యాప్తంగా విపరీతమైన అభిమానగణం ఉంది. మ్యాచ్ జరిగినప్పుడు ఈ పిచ్చి స్టేడియంలో కనిపిస్తూనే ఉంటుంది.
ఈ పరిస్థితిని బల్బు కనిపించగానే పరిగెత్తే కీటకం లాగా అనిపిస్తుంది. ఈ పక్రియలో అనేక కీటకాలు మరణిస్తూ ఉంటాయి. అలా ఎందుకు జరుగుతుందో శాస్త్రవేత్తలు కూడా కనిపెట్టలేకపోయారు.
ఎందుకీ తొందర..
అక్కడ ఉన్న ఓ జర్నలిస్ట్ చెప్పిన సమాచారం ప్రకారం..బెంగళూర్ లో ఉన్న చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం 35 వేలు అయితే.. దానికి పది రెట్ల మంది లోపలికి రావడానికి సిద్దంగా ఉన్నారు.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఒక పోస్ట్ ప్రకారం.. ఆర్సీబీ ఇంతమంది అభిమానులు ఉండటానికి గల కారణాన్ని ప్రశ్నించింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ అనేది మద్యం తయారీదారు యాజమాన్యంలోని ప్రయివేట్ జట్టు అని ఆ పోస్ట్ పేర్కొంది.
కర్ణాటక నుంచి కొద్దిమంది ఆటగాళ్లు మాత్రమే ఆర్సీబీతో ఉన్నారని, మిగిలిన వాళ్లంతా దేశంతో పాటు, విదేశాల నుంచి వచ్చిన ఆటగాళ్లే ఉన్నారని సదరు పోస్టు పేర్కొంది.
వాణిజ్య సంస్థ అయిన ఆర్సీబీ, కర్ణాటకకు గానీ లేదా బెంగళూర్ కు గాని జవాబుదారీగా ఉండదు. అయినప్పటికీ అభిమానులు మాత్రం అద్బుతంగా ఆదరిస్తున్నారు. కోహ్లీ, రజత్ పాటిదార్ వంటి అగ్రశేణి ఆటగాళ్లు జట్టు ఆదేశాలపై పదే పదే అపనమ్మకం ప్రకటించారు.
ప్రశంసలు ఎందుకు?
కర్ణాటకకు అన్ని ఫార్మాట్లో ఆటగాళ్లను పంపిన సుదీర్ఘ చరిత్ర ఉంది. ఇది పూర్తి వివరణ కాదు. అనేక రాష్ట్రాలు కూడా అదే పనిని చేశాయి. ఫైనల్స్ కు ముందు రోజు రాష్ట్ర బీజేపీ శాసనసభ్యుడు సీటీ రవి, కన్నడిగులకు లేదా స్థానిక సంస్కృతికి కూడా ప్రాతినిధ్యం వహించని జట్టుకు ఇంత భారీ స్థాయిలో ప్రశంసలు, మద్దతు ఎందుకు పొందుతుందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఆటగాళ్లను బహిరంగంగా వేలంలో ఎంపిక చేస్తారని రవి చెప్పినట్లుగా ది హిందూ పేర్కొంది. ‘‘ఆటగాళ్లు ఎవరి దగ్గరైతే ఎక్కువ డబ్బు చెల్లిస్తారో వారికే సొంతమవుతారు. మీకు జాతీయవాద, ప్రాంతీయ భావాలు ఎలా ఉంటాయి’’? అని ఆయన అన్నారు.
మతం, తొక్కిసలాటలు..
ఇవి హేతుబద్దమైన, తార్కికవాదనలు. ఇవి పూర్తి పరిశీలనకు అర్హత సాధిస్తాయి. ఇలాంటి హేతుబద్ద ప్రశ్నలు ఎవరికి వారే వేసుకుంటే తొక్కిసలాటే జరిగి ఉండేది. ఇక్కడనే కాదు దేశంలో ఎక్కడైనా ఇలాంటి తొక్కిసలాటలు ఉండవు.
కానీ మనం దేశంలో క్రికెట్ అనేది మతం కావడంతో ఒక అతీంద్రీయ అనుభవం కోసం అభిమానులు ప్రాణాలను పణంగా పెట్టడానికి కూడా జనాలను ఆకర్షిస్తుంది. దీనిని ఎవరూ తర్కం ద్వారా వివరించలేరు.
భారత్ లో తొక్కిసలాటలు అసాధారణం కాదు. ఎక్కువగా మతపరమైన కార్యకలాపాలకు సంబంధించిన కార్యక్రమాలలో ఇవి చోటు చేసుకుంటాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయంలో ఈ సంవత్సరం జనవరిలో జరిగిన దుర్ఘటనలో ఆరుగురు భక్తులు మరణించారు.
2024 లో జరిగిన సత్సంగ్ కారణంగా హాత్రాస్ లో 124 మంది మరణించారు. ఇటీవల కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటలో అనేమంది యాత్రికులు మరణించారు.
గతంలో మక్కాలో కూడా తొక్కిసలాటలు జరిగాయి. ఇది హజ్ యాత్ర అనేది ప్రపంచ ముస్లింలకు పవిత్ర క్షేత్రం. 2015 లో ఇక్కడ జరిగిన తొక్కిసలాటలో దాదాపు 1500 మంది మరణించారు.
క్రికెట్ మతం..
ప్రాథమికంగా మతాన్ని క్రీడలతో పోల్చడం కొంతబాగుండకపోవచ్చు. కానీ భారత్ లో మాత్రం ఏ మతానికి లేనంత భక్తిపూర్వక అభిమానులు క్రికెట్ కు ఉన్నారు. మన దేశంలో లక్షలాది మంది కాకపోయిన వేలాది మంది గుమిగూడే ప్రదేశాలకు వెళ్లడమే చాలా ప్రమాదకరమైనది.
కానీ చాలామంది మాత్రం అక్కడికి వెళ్లడానికే సిద్దంగా ఉంటారు. బెంగళూర్ లోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న కార్యక్రమాన్ని చూడటానికి తమ ఇంటి నుంచి బయల్దేరుతున్న అభిమానులకు తాము ప్రమాదకరమైన ప్రయాణం చేస్తున్నామని కూడా అనుకోకపోవచ్చు.
కానీ బాధాకరంగా ఇక్కడ దాదాపు డజన్ మంది తమ ప్రాణాలను పణంగా పెట్టారు. బెంగళూర్ లో లాగా వేలాది మంది గుమిగూడినప్పుడు వారిని నియంత్రించడం పోలీసు దళానికి సామర్థ్యానికి మించిన పని. ప్రభుత్వాలు సవాలుతో కూడిన పరిస్థితులను నిర్వహించడంలో సమర్థవంతమైన విధానాలు అమలు చేయడం లేదు.
అసమర్థ పరిపాలన..
ఆర్సీబీ తొక్కిసలాట 1994 లో విధాన సౌధలో జరిగిన సంఘటనలో పోలి ఉంది. ఆ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జనతాదళ్ పార్టీ శాసనసభా పార్టీ సమావేశంలో విధాన సభలోకి ఒక గుంపు దూసుకొచ్చింది. దానిని ఆపడం పోలీసుల వల్ల కాలేదు. అయితే అదృష్టవశాత్తూ ఆ రోజు ఎవరూ చనిపోలేదు.
సంక్షోభ సమయంలో నగరాన్ని నిర్వహించడంలో మిగతా వ్యవస్థలు అచేతనంగా ఉన్న సమయంలో కేవలం పోలీసులు మాత్రమే దాన్ని సరిగ్గా నిర్వహించేవారు. ప్రభుత్వంలో పోలీసు బలగాలతో సహ ప్రతి చోటా బంధుప్రీతీ, అవినీతి, పక్షపాతం కీలకపాత్ర పోషిస్తున్న చోట బుధవారం జరిగినట్లుగా అర్థాంతర చర్యలు తీసుకుంటారని చెప్పవచ్చు.
భద్రతను ప్లాన్ చేయడానికి, ప్రజలను కంట్రోల్ చేయాలనే అంశంపై చర్చించడానికి వారికి రోజంతా సమయం ఉంది. కానీ బెంగళూర్ ను ముంచెత్తిన క్రికెట్ అభిమానుల ముందు వారి శక్తి బారికేడల్లో కొట్టుకుపోయింది. ఫలితంగా స్టేడియం వెలుపల అరాచకం ఏర్పడి విషాదకరమైన పరిణామాలకు దారితీసింది.