‘‘ప్రధాని మోదీ అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి’’
అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో జరిగిన సంభాషణకు బయటపెట్టాలన్న కాంగ్రెస్ నేత జైరాం రమేష్..;
ప్రధాని మోదీ(PM Modi) తన మూడు దేశాల పర్యటన నుంచి తిరిగి వచ్చిన వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఫోన్లో మాట్లాడిన విషయాలను వివరించాలని కాంగ్రెస్(Congress) సీనియర్ నేత జైరామ్ రమేష్(Jairam Ramesh) డిమాండ్ చేశారు.
కార్గిల్ యుద్ధం జరిగిన మూడు రోజుల తర్వాత అప్పటి విదేశాంగ మంత్రి కె సుబ్రహ్మణ్యం కార్గిల్ సమీక్ష కమిటీ ఏర్పాటు చేసినట్టుగానే "పహల్గామ్ సమీక్ష కమిటీ"ని ఏర్పాటు చేయాలని కోరారు. ఇస్లామాబాద్ అభ్యర్థన మేరకే భారత్ పాకిస్థాన్పై దాడులను నిలిపివేసిందని, ఇందులో అమెరికా మధ్యవర్తిత్వం లేదని మోదీ స్పష్టమైన ప్రకటన చేసిన నేపథ్యంలో జైరామ్ రమేష్ పీటీఐతో మాట్లాడారు.
‘‘తాను జోక్యం చేసుకోబట్టే భారత్ - పాక్ దేశాల కాల్పుల విరమణకు అంగీకరించారని ట్రంప్ ఇప్పటికే 14 సార్లు చెప్పుకొచ్చారు. ఈ విషయంపై స్పందించడానికి ప్రధాని మోదీకి 37 రోజులు పట్టింది’’ అని రమేష్ పునరుద్ఘాటించారు.
ప్రధాని వెంటనే అఖిలపక్ష సమావేశం, పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని జైరాం డిమాండ్పై మోదీ ఎలా స్పందిస్తారో చూడాలి.