ఏపీ ఎన్నికల్లో మిషన్ ఇంద్రధనస్సు
మ్యానిఫెస్టో రూపకల్పనలో కాంగ్రెస్ బిజీ;
కాంగ్రెస్.. కర్నాటకలో గెలిచిన పార్టీ. తెలంగాణలో అధికారాన్ని తెచ్చుకున్న పార్టీ. ఆంధ్రాలో అడుగంటిన పారీ. ఇప్పుడీ పార్టీకి కొత్త జవసత్వాలు ఇవ్వడానికి మహామహులు కుస్తీ పడుతున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మొదలు ఆంధ్రనాట పార్టీ జెండాను మోస్తున్న రుద్రరాజు ఒకనాటి వ్యూహకర్త జేడీ శీలం వరకు ఎందరెందరో ఊపిరి పోయాలని చూస్తున్నారు. ‘ఏపీలో పార్టీ పునర్జీవనానికి అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంటాం. పాత గాయాలను మాన్పేలా ప్రయత్నిస్తాం. ఇందిరమ్మ రాజ్యాన్ని తెస్తాం.’ అంటున్నారు జేడీ శీలం. ఈ జేడీ శీలం ఎవరో కాదు, శ్రీపెరంబదూర్లో ఎటీటీఈ ఘాతుకానికి బలైన రాజీవ్ గాంధీకి అనుంగు అనుచరుడు, మాజీ ఐఏఎస్ అధికారి, ఓనాటి పార్లమెంట్ సభ్యులు. ఆరణాల ఆంధ్రుడు. ఈయనను ఫెడరల్ ప్రతినిధి ప్రశ్నించినప్పుడు చెప్పిన మాట కాస్తంత ఆశ్చర్యం కలిగిస్తున్నా కాంగ్రెస్ పార్టీ పతాకం ఆంధ్రాలోని అన్ని జిల్లాల్లో ఎగిరేలా ఆశలు కనిపిస్తున్నాయి. ఆంధ్రాలోనూ వేళ్లూనుకోడానికి కాంగ్రెస్ పార్టీ ఇంద్ర ధనస్సు మాదిరిగా ఏడు పథకాలను ప్రకటించేందుకు కుస్తీ పడుతున్నది.