12 మంది మావోయిస్టులు లొంగుబాటు..

వీరిలో ఇద్దరు డివిజన్ కమిటీ మెంబర్స్, నలుగురు ఏసీఎం క్యాడర్‌కు చెందిన వారు ఉన్నట్లు ఎస్పీ చెప్పారు.;

Update: 2025-06-19 09:30 GMT

భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ ఎదుట 12 మంది మావోయిస్టులు లొంగిపోయారు. జనజీవన స్రవంతిలో కలవడానికి తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కేంద్రం చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’ దెబ్బకు కొంతకాలంగా మావోయిస్టుల లొంగుబాటులు అధికంగానే జరుగుతున్నాయి. గత నెల రోజుల్లోనే దాదాపు 300 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఈ క్రమంలోనే తాజాగా కొత్తగూడెంలో కూడా లొంగిపోయారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎదుట వారు లొంగిపోయారు, తమ ఆయుధాలను కూడా స్వాధీనం చేశారు. వారిలో 9 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారు. వీరిలో ఇద్దరు డివిజన్ కమిటీ మెంబర్స్, నలుగురు ఏసీఎం క్యాడర్‌కు చెందిన వారు ఉన్నట్లు ఎస్పీ చెప్పారు. వారి లొంగుబాటు మావోయిస్ట్ పార్టీకి తెలంగాణలో ఎదురుదెబ్బకానుందని అధికారులు భావిస్తున్నారు.

మావోయిస్ట్‌లను మట్టుబెట్టడం కోసం కేంద్రం ‘ఆపరేషన్ కగార్’ ప్రారంభించింది. అదే సమయంలో జనజీవన స్రవంతిలో కలుద్దామని భావించి లొంగిపోయే వారికి ఆసరా కల్పించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ‘ఆపరేషన్ చేయూత’ చేపట్టింది. దీని కింద లొంగిపోయిన మావోయిస్టులకు ఆర్థిక సహాయం అందించడంతో పాటు వారు తిరిగి జనజీవనంలో కలిసేలా సహకరిస్తారు. ఈ ఒక్క ఏడాదిలోనే ఇప్పటి వరకు మొత్తం 300 మంది వరకు మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులను అధికారులు తక్షణమే రూ.25వేల ఆర్థిక సహాయం అందిస్తారు.

Tags:    

Similar News