డబుల్ ఇంజిన్ సర్కార్ తో తెలంగాణ అభివృద్ది సాధ్యం

పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం;

Update: 2025-06-29 10:21 GMT

డబుల్ ఇంజిన్ సర్కార్ తో మాత్రమే తెలంగాణలో అభివృద్ది సాధ్యమన్నారు. బిఆర్ఎస్ , కాంగ్రెస్ దొందు దొందేనన్నారు. పదేళ్ల బిఆర్ ప్రభుత్వం దోచుకుందని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కెసీఆర్ బాటలోనే వెళుతుందన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. 

2026 కల్లా మావోయిస్ట్  రహిత దేశంగా ప్రకటిస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు. పుల్వమాదాడికి పాల్పడ్డ పాకిస్తాన్ కు గట్టి బుద్ది చెప్పామన్నారు. మావోయిస్టులు లొంగిపోవాలని అమిత్ షా పిలుపునిచ్చారు. 

తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం

తెలంగాణతో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటుకు కీలక పాత్ర పోషించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను అమిత్ షా ప్రశంసించారు. తెలంగాణ బిజెపి ఎంపీలు పార్ల మెంటులో ప్రస్తావించి జాతీయ పసుపు బోర్డు కార్యాలయ ఏర్పాటుకు విశేష కృషి చేశారన్నారు. 40 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న బోర్డు కార్యాలయం ఏర్పాటు నేటితో నెరవేరిందన్నారు. నిజామాబాద్ పసుపు అంతర్జాతీయంగా ప్రసిద్ది చెందిందన్నారు. తెలంగాణలో పదేళ్లు బిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ది చేయలేకపోయింది. అధికారంలోవచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుకోవడం లేదన్నారు. బిజెపి మాత్రమే ప్రత్యామ్నాయం అని, వచ్చే ఎన్నికల్లో బిజెపి తెలంగాణలో అధికారాన్ని కైవసం చేసుకుంటుందన్నారు.

 నిజామాబాద్ లో  పసుపు బోర్డు  కార్యాలయాన్ని కేంద్రహోంమంత్రి అమిత్ షా ప్రారంభించారు. ఈ సందర్బంగా పసుపుబోర్డు లోగోను కేంద్రమంత్రి ఆవిష్కరించారు. అక్కడ్నుంచి కంఠేశ్వర్ బైపాస్ వద్ద ఏర్పాటు చేసిన మాజీ మంత్రి డి. శ్రీనివాస్ విగ్రహాన్ని కేంద్రమంత్రి ఆవిష్కరించారు. పాలి టెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ నుద్దేశించి అమిత్ షా ప్రసంగించారు.

ఎన్నికల హామి నెరవేరింది

పసుపు బోర్డు వల్ల పసుపు రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరిందన్నారు. పసుపు రైతులకు ఇప్పటి వరకు మద్దతు ధర లేదని , పసుపు బోర్డు కార్యాలయం వల్ల రైతులకు కనీస మద్దత్తు ధర లభించనుందని చెప్పారు. అమిత్ షా నిజామాబాద్ పర్యటనలో కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, బిజెపి ఎంపీలు ,ఎమ్మెల్యేలు పలువురు పాల్గొన్నారు. బిజెపి శ్రేణులు ఈ సమావేశానికి భారీగా తరలివచ్చారు.

2003 అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ పాల మూరు ప్రజా గర్జనలో జాతీయ పసుపు బోర్డు కార్యాలయం నిజామాబాద్ వస్తున్నట్టు ప్రకటించారు. నిజామాబాద్ ఎంపీ ధర్మ పురి అరవింద్ మరో గెలవడానికి పసుపు రైతులు కారణమయ్యారు. ఇచ్చిన హామీని బిజెపి ప్రభుత్వం నిలబెట్టకుంది.

Tags:    

Similar News