మీ పంచాయితీల్లోకి మమ్మల్ని లాగొద్దు..
కవిత, కేటీఆర్కు ఎలాంటి బ్రాండ్ లేదు. పదేళ్లలో కేసీఆర్ కుటుంబం ఆస్తులు సంపాదించుకుంది.;
కవిత విషయంపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటుగా స్పందించారు. మీ పంచాయితీల్లోకి మమ్మల్ని లాగొద్దని, మీలాగా మా పార్టీ చిల్లర పార్టీ కాదంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ బతుకంతా పొత్తులతోనే ఉందని, ఎన్నో పార్టీలతో వాళ్లు పొత్తులు పెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. ‘‘2004లో కాంగ్రెస్తో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంది. 2009లో మహాకూటమి పేరుతో పలు పార్టీలతో పొత్తు పెట్టుకుంది’’ అని అన్నారు. ‘‘2014లో పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తామని అన్నది ఎవరు? బీఆర్ఎస్తో బీజేపీ ఎప్పుడైనా పొత్తు పెట్టుకుందా? మా పార్టీ ఎదుగుదలను అడ్డుకోవాలని కుట్రలు చేస్తున్నారు. చిట్చాట్లు ఎందుకు? దమ్ముంటే ప్రెస్మీట్లు పెట్టండి. తప్పుడు వార్తలు రాయిస్తున్నారంటూ గోల చేయడం కాదు. కుండ బద్ధలు కొట్టినట్లు ఉన్నవి చెప్పండి. చిట్చాట్ల పేరుతో మా పార్టీని వివాదంలోకి తాగొద్దని కవితను కోరుతున్నా. మీ పంచాయితీలు మీరే తేల్చుకోండి. మమ్మల్ని లాగొద్దు’’ అని అన్నారు.
‘‘నిజామాబాద్ ప్రజలకు కవిత ఏం చేయలేదనే MPగా ఓడించారు. కవిత, కేటీఆర్కు ఎలాంటి బ్రాండ్ లేదు. పదేళ్లలో కేసీఆర్ కుటుంబం ఆస్తులు సంపాదించుకుంది. అమరవీరుల కుటుంబాలకు బీఆర్ఎస్ పాలనలో ఏమీ దక్కలేదు. అందుకే తెలంగాణ సమాజం బీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇచ్చింది. మళ్లీ కేసీఆర్ కుటుంబం రీ బ్రాండింగ్ చేసుకుంటోంది. అన్నా చెల్లెళ్ల గురించే చర్చ జరగాలని డ్రామా. అధికారంలో ఉన్న పదేళ్లు ప్రజలకు ఏం చేశారు. KCR కుటుంబంలో పదవుల పంచాయితీతో BJPకి సంబంధం లేదు. బీజేపీలో BRS విలీనం చర్చలు జరిగాయని కవిత అన్నారు.
విలీనంపై మా పార్టీతో చర్చలు జరగలేదు. తెలంగాణలో బీజేపీ ఒంటరిగా బలపడుతోంది’’ అని తెలిపారు.