హ్యాట్రిక్ ఎంఎల్ఏ గోపినాధ్ మృతి

మూడురోజుల క్రితం గోపినాధ్(BRS MLA Gopi) ఇంట్లో ఉన్నపుడు సడెన్ గా హార్ట్ ఎటాక్ వచ్చింది;

Update: 2025-06-08 02:17 GMT
MLA Maganti Gopinath

ప్రధానప్రతిపక్షం బీఆర్ఎస్ ఎంఎల్ఏ మాగంటి గోపినాధ్ మరణించారు. నాలుగురోజులుగా తీవ్ర అనారోగ్యంతో ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎంఎల్ఏ ఆదివారం ఉదయం 5.45 గంటలకు చనిపోయారు. మూడురోజుల క్రితం గోపినాధ్(BRS MLA Gopi) ఇంట్లో ఉన్నపుడు సడెన్ గా హార్ట్ ఎటాక్ వచ్చింది. వెంటనే కుటుంబసభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటినుండి ఆయన వెంటిలేటర్ పైనే ఉన్నారు. కొంతకాలంగా ఎంఎల్ఏ కిడ్నీ సమస్యలతో బాగా ఇబ్బంది పడుతున్నారు.

తెలుగుదేశంపార్టీ(TDP)తో రాజకీయ ప్రస్ధానం మొదలుపెట్టిన గోపినాధ్ మొదట 2014లో జుబ్లీహిల్స్ ఎంఎల్ఏగా ఎన్నికయ్యారు. అప్పట్లో ఎంఐఎం అభ్యర్ధి వివేక్ యాదవ్ ను ఓడించారు. తర్వాత మారిన రాజకీయ పరిణామాల కారణంగా టీడీపీ నుండి బీఆర్ఎస్(BRS) లోకి ఫిరాయించారు. తర్వాత 2018లో బీఆర్ఎస్ తరపున పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్ధి పీ విష్ణువర్ధనరెడ్డిని ఓడించారు. 2023 ఎన్నికల్లో మూడోసారి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్ధి మహమద్ అజహరుద్దీన్ ను ఓడించి హ్యాట్రిక్ ఎంఎల్ఏ అనిపించుకున్నారు. చంద్రబాబునాయుడు(Chandrababu), కేసీఆర్(KCR), కేటీఆర్(KTR), రేవంత్ రెడ్డి(Revanth)కి కూడా గోపీ అత్యంత సన్నిహితుడున్న విషయం అందరికీ తెలిసిందే. సినీనిర్మాతగా కూడా ఉన్న ఎంఎల్ఏ మరణంపట్ల రాజకీయాలకు అతీతంగా అన్నీపార్టీల వాళ్ళు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తంచేస్తున్నారు.

Tags:    

Similar News