మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ పై చీటింగ్ కేసు

మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది.

Update: 2024-08-13 10:15 GMT

మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది. సెన్సార్ బోర్డులో సభ్యత్వం ఇప్పిస్తామని చెప్పి పలువురిని మోసం చేసిన కేసులో ఆయనపై ఎఫ్ఎఆర్ రిజిస్టర్ అయింది. ప్రవీణ్ అనే వ్యక్తితో కలిసి రూ.10 లక్షల మేర నగదు వసూలు చేసి మొండిచేయి చూపగా.. బాధితులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కపిలవాయి దిలీప్ కుమార్ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో వెంటనే ఆయనకు నోటీసులు జారీ చేయాలంటూ న్యాయస్థానం ఆదేశించింది. ఈ మేరకు మంగళవారం ఆయన నోటీసు తీసుకునేందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. 

Tags:    

Similar News