మొంథా తుపాన్ : తెలంగాణలో నేడు భారీ వర్షాలు
మొంథా తుపాన్ ఎఫెక్ట్ తెలంగాణలో ఉందని, పలు జిల్లాల్లో మంగళవారం వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
మొంథా తుపాన్ ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ హైదరాబాద్ కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ఎ ధర్మరాజు ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసే అవకాశముందని ఆయన వెల్లడించారు. తుపాన్ ప్రభావం వల్ల గంటకు 41 నుంచాి 61 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని ఆయన తెలిపారు. మెదక్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని ధర్మరాజు వివరించారు.
ఎల్లో అలెర్ట్ జారీ
CYCLONE MONTHA - SEVERE RAIN ALERT - FINAL UPDATE - OCT 28-29 ⚠️⚠️🌀
— Telangana Weatherman (@balaji25_t) October 28, 2025
OCTOBER 28 - Refer pic 1
VERY HEAVY DOWNPOURS ahead in South, Central Telangana especially in RED marked districts, few places to get 90-150mm rains, STAY ALERT ⚠️
MODERATE - HEAVY RAINS ahead in BLUE… pic.twitter.com/Cck0fGWBUe
అప్రమత్తంగా ఉండండి : తెలంగాణ వెదర్ మ్యాన్
దక్షిణ, మధ్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. కొన్ని చోట్ల 90 నుంచి 150 మిల్లీమీటర్ల మేర వర్షాలు కురుస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. మరికొన్ని జిల్లాల్లో 40 నుంచి 70 మిల్లీమీటర్ల మేర వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ వెల్లడించారు. అక్టోబర్ 29 వతేదీన కూడా తెలంగాణలో పలు జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో మంగళవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు మోస్తరు వర్షాలు కురుస్తాయని వెదర్ మ్యాన్ వివరించారు.