సుప్రీంకోర్టు ఆదేశాలతో హైదరాబాద్లోని 100 ఎకరాల కంచ గచ్చిబౌలి భూమిని పునరుద్ధరించడానికి అటవీ శాఖ అధికారులు ప్రణాళికను సమర్పించారు. హైదరాబాద్ విశ్వవిద్యాలయ ప్రాంగణం సమీపంలోని కంచ గచ్చిబౌలిలో చెట్లు తొలగించిన 100 ఎకరాల్లోపర్యావరణ, పర్యావరణ పరిరక్షణ కోసం తాము అన్ని విధాలుగా ప్రయత్నిస్తామని తెలంగాణ అటవీశాఖ అధికారులు సుప్రీంకోర్టుకు తెలిపారు.హైదరాబాద్లోని మిగిలిన 400 ఎకరాల విస్తీర్ణంలో చెట్ల నరికివేతపై పూర్తి యథాతథ స్థితిని కొనసాగించాలని కూడా జస్టిస్ బిఆర్ గవాయి,అగస్టిన్ జార్జ్ మాసిహ్లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. చెట్ల కవర్ ప్రాంతాన్ని ఎలా విస్తరించాలో పరిశీలిస్తామని కోర్టు తెలిపింది.కంచ గచ్చిబౌలి విషయం గురించి అటవీశాఖ అధికారులను అడిగితే ఈ వ్యవహారం సుప్రీంకోర్టు విచారణలో ఉందని, దీనిపై తామేమి మాట్లాడలేమని చెబుతున్నారు.
కంచ గచ్చిబౌలి లోని వన్యప్రాణులను ఎలా రక్షించవచ్చో పరిశీలించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 100 ఎకరాల్లో అటవీ నిర్మూలన కారణంగా ప్రభావితమైన వన్యప్రాణులను పరిశీలించి, రక్షించడానికి అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలంగాణ రాష్ట్ర వన్యప్రాణి వార్డెన్ను ఆదేశించింది.దీంతో కంచ గచ్చిబౌలిలో కుక్కలు, జింకలు ఎక్కువగా ఉన్నాయి. కుక్కలు జింకలపై దాడి చేస్తున్న నేపథ్యంలో రాత్రి పగలూ తాము కంచ గచ్చిబౌలిలో పెట్రోలింగ్ చేస్తున్నామని రంగారెడ్డి జిల్లా అటవీశాఖ అధికారి వెల్లడించారు. పగలూ తెలంగాణ యాంటీ పోచింగ్ స్క్వాడ్ బృందం పెట్రోలింగ్ చేస్తుండగా, రాత్రి వేళల్లో రంగారెడ్డి జిల్లా ఫారెస్ట్ అధికారులు పెట్రోలింగ్ చేస్తున్నారు. కుక్కల బారి నుంచి తాము జింకలను కాపాడుతున్నామని యాంటీ పోచింగ్ స్క్వాడ్ అధికారి చెప్పారు.
కంచ గచ్చిబౌలి అటవీ ప్రాంతంలోని 400 ఎకరాల భూమి వివిధ జాతుల వృక్షజాలం, జంతుజాలానికి నిలయం. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఐటీ పార్కుల అభివృద్ధి కోసం భూమిని వేలం వేయాలని ప్రతిపాదించింది.దీనిపై పలు సంఘాలు ఈ నిర్ణయాన్ని నిరసించాయి.ఏప్రిల్ 3వ తేదీన సుప్రీంకోర్టు కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని స్వయంగా స్వీకరించి, ఆ ప్రాంతంలోని అన్ని చెట్ల నరికివేత కార్యకలాపాలను నిలిపివేయాలని ఆదేశించింది.అటవీ కేసుల విషయంలో అమికస్ క్యూరీ అయిన న్యాయవాది కె. పరమేశ్వర్ ఈ ప్రాంతంలోని చెట్ల నరికివేత గురించి బెంచ్కు మౌఖికంగా తెలియజేసిన తర్వాత కోర్టు ఈ మధ్యంతర ఉత్తర్వును జారీ చేసింది.
కంచ గచ్చిబౌలి భూములపై తెలంగాణ హైకోర్టులో సోమవారం జరిగిన విచారణ మూడు వారాలకు వాయిదా వేశారు. ఈ కేసును సుప్రీంకోర్టు విచారిస్తున్నందున తాము దీనిపై ఏమీ నిర్ణయం తీసుకోలేమని హైకోర్టు వాయిదా వేసింది. టీజీఐఐసీకి కేటాయించిన భూమి జీఓను రద్దు చేయాలని పిటిషనర్లు కోరడంతో ఈ కేసును హైకోర్టు వాయిదా వేసింది.