పాతబస్తీలో మరో అగ్ని ప్రమాదం
9 మందిని కాపాడిన రెస్క్యూ టీం;
పాతబస్తీ గుల్జార్ హౌజ్ ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన 17 మంది మృతి చెందిన ఘటన మరువక ముందే గుల్జర్ హౌజ్ కు కూత వేటు దూరంలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. మొగల్ పురా గోదాంలో జరిగిన అగ్ని ప్రమాదం పాత బస్తీలో కలకలం రేపింది.
కార్టూన్ గోదాం ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ లో మంటలు చెలరేగాయి. రెస్క్యూ సిబ్బంది ప్రాణాపాయంలో చిక్కుక్కున్న 9 మందిని రక్షించారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఎంత ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వంటి వివరాలు తెలియాల్సి ఉంది.
మొత్తం మూడంతస్థుల భవనం ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ లో ప్రమాదం సంభవించింది. గ్రౌండ్ ఫ్లోర్ లో కార్డ్ బోర్డ్ లు, పేపర్లు స్టోర్ చేయడం వల్ల అగ్ని ప్రమాదం సంఢవించినట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలయరాలేదు. షార్ట్ సర్క్యూట్ కారణంగా నిప్పు రవ్వలు గ్రౌండ్ ఫ్లోర్ లో పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది.
గుల్జార్ హౌజ్ తర్వాత పాతబస్తీ చత్రినాఖ పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్ని ప్రమాదం సంభవించింది. మూడు అంతస్థుల భవనంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో అప్రమత్తమైన కుటుంబాలు భవనాన్ని ఖాళీ చేశాయి. పాత బస్తీలో వరుసగా అగ్ని ప్రమాదాలు సంభవించడంతో ప్రజల కలవరం చెందుతున్నారు.
కాగా గుల్జర్ హౌజ్ ప్రమాద ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీ వేసింది. ఈ కమిటీ ప్రమాద ఘటనపై సమగ్ర విచారణ చేసింది.