ప్రభుత్వ భూమిని కాపాడండి
హైకోర్టులో అధికార పార్టీ ఎమ్మెల్యేల పిల్;
ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూమి 27.18 ఎకరాలను పరిరక్షించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నలుగురు తెలంగాణ హైకోర్టును (Telangana High Court)ఆశ్రయించారు.యెన్నం శ్రీనివాస్రెడ్డి, రాజేశ్రెడ్డి, అనిరుద్రెడ్డి, మురళినాయక్లు పిల్ దాఖలు చేశారు.శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందంటూ ఈ ఎమ్మెల్యేలు ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.ఖాజాగూడలోని సర్వే నెం.119, 122లో ఉన్న 27.18 ఎకరాల భూమిని కొంతమంది వ్యక్తులు ఆక్రమించారని పిటీషనర్ల తరపున న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు వివరించారు. 2023లో రంగారెడ్డి కలెక్టర్ నోఅబ్జెక్షన్ సర్టిఫీకెట్ జారీ చేయడంతో జీహెచ్ఎంసీ భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందని తెలిపారు.ఖాజాగూడ చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉన్నాయని,ప్రస్తుతం ఆ స్థలంలో 8 టవర్లలో ఒక్కో దాంట్లో 47 అంతస్థులు నిర్మిస్తున్నారని న్యాయవాది న్యాయస్థానానికి వివరించారు. వాదనలు విన్న హైకోర్టు ప్రభుత్వానికి రెవెన్యూ కార్యదర్శికి, రంగారెడ్డి కలెక్ఠర్ , జీహెచ్ ఎంసీ, హెచ్ ఎండీఏలతో పాటుగా హైడ్రాకు నోటీసులు జారీచేసింది. మళ్లీ విచారణను కోర్టు రెండు వారాలకు వాయిదా వేసింది.