రేవంత్ ఆరోపణలు దురదృష్టకరం: హరీష్

కేసీఆర్‌ను రేవంత్ ఛాలెంజ్ చేయడంపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం.

Update: 2025-12-22 09:51 GMT

కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ రాష్ట్రం ఎనలేని ప్రగతిని చూసిందని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. అవన్నీ రికార్డ్‌లు కూడా ఉన్నాయని, అయినా పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక అరాచకత్వం జరిగిందని సీఎం రేవంత్ ఆరోపించడం దురదృష్టకరమని హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడుతూ, కేసీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో తెలంగాణ జీఎస్‌డీపీ, తలసరి ఆదాయంలో దేశానికే తలమానికంగా నిలిచిందని హరీశ్‌రావు తెలిపారు. ‘‘మూడింతల జీఎస్‌డీపీ, తలసరి ఆదాయం పెరిగింది. అయినా ఆర్థిక అరాచకత్వం జరిగిందని రేవంత్‌ ఆరోపించడం దురదృష్టకరం. రాజకీయాల కోసం రాష్ట్రం పరువును తీయొద్దు’’ అని ఆయన అన్నారు. నిజాయితీ, త్యాగాల పునాదులపై ఎదిగిన నాయకత్వం బీఆర్‌ఎస్‌దే అని, ఎమ్మెల్యే, మంత్రి పదవులను గడ్డిపోచకుండా వదిలిన చరిత్ర తమ పార్టీ నేతలదని హరీశ్‌رావు గుర్తుచేశారు.

సీఎం రేవంత్‌రెడ్డిపై హరీశ్‌రావు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘రేవంత్‌రెడ్డి రేపు ఏ పార్టీలో ఉంటాడో కూడా చెప్పలేని పరిస్థితి. ఆయనకు ఒక స్టాండ్, సిద్ధాంతం, పద్ధతి లేవు. కేసీఆర్‌ స్టేట్స్‌మన్‌లా మాట్లాడితే, రేవంత్ స్ట్రీట్ రౌడీలా మాట్లాడుతున్నారు’’ అని విమర్శించారు. వెన్నుపోటు రాజకీయాలకు రేవంత్‌ మారు పేరని ఆయన పేర్కొన్నారు.

నీటి వాటాల అంశంలోనూ హరీశ్‌రావు ప్రశ్నలు సంధించారు. ‘‘45 టీఎంసీలకు నీటి వాటా కోసం ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్వయంగా తన సంతకంతో కేంద్రానికి లేఖ రాశారు. కేసీఆర్ ప్రజల పక్షాన ప్రశ్నిస్తే సీఎం, నీటి మంత్రి ఎందుకు అసహనం చూపుతున్నారు?’’ అని నిలదీశారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సగం మాత్రమే జ్ఞానం ఉందంటూ మాజీ మంత్రి ఎద్దేవా చేశారు.

రూ.50 కోట్లకు రేవంత్ పీసీసీ పదవిని కొనుగోలు చేశారనే విషయాన్ని గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డే చెప్పారని హరీశ్‌رావు గుర్తుచేశారు. ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తూ రూ.50 లక్షలతో పట్టపగలు దొరికిన ఘటనను కూడా ఆయన ప్రస్తావించారు. కేసీఆర్‌కు ఆయన కుటుంబం నుంచే ప్రమాదం పొంచి ఉందన్న సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలను హరీశ్‌رావు తీవ్రంగా ఖండించారు. ‘‘పార్టీ అంటే నాకు కన్నతల్లిలాంటిది. మా నాయకుడు ఆదేశిస్తే పదవులను గడ్డిపోచకుండా వదిలేశాం. రేవంత్‌రెడ్డి పార్టీ మార్చే ఊసరవెల్లి. ఫోర్ట్‌ సిటీ ఎందుకని కేసీఆర్ అడిగిన ప్రశ్నకు రేవంత్ సమాధానం ఇవ్వలేదు. ఆయన మాటలన్నీ సొల్లు మాటలే’’ అని హరీశ్‌రావు చెప్పారు.

Tags:    

Similar News