బిఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి హైకోర్టులో చుక్కెదురు

గ్రైనేట్ వ్యాపారిని బెదిరించిన కేసు;

Update: 2025-06-16 10:49 GMT


హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ఉన్నత న్యాయస్థానంలో చుక్కెదురైంది. గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో ఆయనపై నమోదైన కేసును కొట్టివేయాలని కౌశిక్ రెడ్డి హైకోర్టును అభ్యర్థించారు. తన భర్తను బెదిరించిన కేసులో గ్రానైట్ వ్యాపారి మనోజ్ భార్య ఉమాదేవి హన్మకొండ సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భర్తను 50 లక్షల రూపాయలు ఇవ్వాలని బిఆర్ఎస్ ఎమ్మెల్యే డిమాండ్ చేసినట్టు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. కమలాపురం వంగపల్లిలో గ్రానైట్ వ్యాపారి మనోజ్ ఒక క్వారీని మెయిన్ టైన్ చేస్తున్నారు. ఈ కేసుపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. కౌశిక్ రెడ్డి అభ్యర్థనను హైకోర్టు కొట్టివేయడంతో బెదిరింపుల కేసుకు సంబంధించి పోలీసుల దర్యాప్తు యధావిధిగా కొనసాగనుంది.


Similar News