క్వాంటం సిటీ గా హైదరాబాద్

క్వాంటం సిటీగా హైదరాబాద్ ను తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని మంత్రి తెలిపారు

Update: 2025-12-04 11:55 GMT
Telangana IT and Industries Minister D Sridhar Babu

హైదరాబాద్ ను ప్రపంచ పఠంలో ధీటుగా నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) గట్టిగానే కృషిచేస్తున్నాడు. ఇందులో భాగంగానే (Telangana Rising)తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2047 నిర్వహిస్తున్నాడు. ఇదే విషయాన్ని పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు చెప్పారు. క్వాంటం సిటీగా హైదరాబాద్ ను తీర్చిదిద్దేలా తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని మంత్రి తెలిపారు.(Quantum Technology)క్వాంటం టెక్నాలజీలో(Telangana)తెలంగాణను గ్లోబల్ లీడర్ గా మార్చేలా నిపుణులు, పరిశ్రమల భాగస్వామ్యంతో దేశంలోనే తొలిసారిగా లాంగ్ టర్మ్ క్వాంటం స్ట్రాటజీని రూపొందించామన్నారు.

గచ్చిబౌలిలోని ఐఐఐటీ హైదరాబాదులో నీతి ఆయోగ్ ‘‘రోడ్ మ్యాప్ ఫర్ క్వాంటం & తెలంగాణ క్వాంటం స్ట్రాటజీ"ని గురువారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ విద్యుత్, ఇంటర్నెట్ ఆవిష్కరణలు ప్రపంచగతిని మార్చేసిన విషయాన్ని గుర్తుచేశారు. అదేతరహాలో రాబోయే రోజుల్లో క్వాంటం టెక్నాలజీ కూడా అనేక విప్లవాత్మకమైన మార్పులకు వేదిక కాబోతోందన్నారు. ఏఐ, క్వాంటం టెక్నాలజీ తదితర కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్ లో తెలంగాణను గ్లోబల్ లీడర్ గా మార్చేలా పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నామన్నారు.

లాంగ్ టర్మ్ క్వాంటం స్ట్రాటజీలో భాగంగా రీసెర్చ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సైబర్ సెక్యూరిటీ, లైఫ్ సైన్సెస్ యాక్సిలరేషన్, టాలెంట్ పైప్‌లైన్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. క్వాంటం సెన్సింగ్, సెక్యూరిటీ, కమ్యూనికేషన్, క్వాంటం కంప్యూటింగ్ లో ఆర్అండ్ డీ, ఇన్నోవేషన్స్ ను ప్రోత్సహించేలా రూపొందించిన ఈ పాలసీ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఒక రోల్ మోడల్ గా నిలుస్తుందన్నారు. ఇది కేవలం తమ ప్రభుత్వం రూపొందించిన ఒక పాలసీ మాత్రమే కాదని, క్వాంటం టెక్నాలజీలో దేశానికి దిశా నిర్దేశం చేసే డైరెక్షన్ గా అభివర్ణించారు. ఈ టెక్నాలజీ లో దేశానికి ఒక బెంచ్ మార్క్ సెట్ చేసేలా ప్రత్యేకంగా సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్స్ కు కూడా శ్రీకారం చుట్టామన్నారు.

వచ్చే ఆర్థికసంవత్సరం నుంచి స్టార్టప్స్, కొత్త ఆలోచనలకు భరోసానిచ్చేలా ఫండ్స్ ఆఫ్ ఫండ్స్ ను ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. ఇండస్ట్రీ డే పేరిట వారంలో ఒకరోజు అధికారులు, ప్రతి నెలలో ఒకరోజు సంబంధిత మంత్రి పారిశ్రామికవేత్తలతో ప్రత్యేకంగా సమావేశమవబోతున్నట్లు చెప్పారు. పరిశ్రమలు ఎదుర్కొంటున్న సవాళ్లు, పరిష్కార మార్గాలు, రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై సలహాలు, సూచనలు స్వీకరిస్తారన్నారు. కార్యక్రమంలో నీతి ఆయోగ్ సీఈవో బీవీఆర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News