తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు మళ్లీ ప్రారంభమయ్యాయి. అక్రమ కట్టడాల మీద ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పాట్ కు చేరుకుని కమిషనర్ రంగనాథ్ దగ్గరుండి కూల్చే కార్యక్రమం చేపట్టే వారు. అయితే కొన్నాళ్లుగా హైడ్రా కూల్చివేతలు మందకొడిగా సాగుతున్నాయి. ప్రజావాణిలో ఫిర్యాదులు ఎక్కువ సంఖ్యలో రావడంతో హైడ్రా మళ్లీ యాక్టివ్ అయ్యింది.
తాజాగా మేడ్చెల్ నియోజకవర్గంలోని పోచారంలో ఏడు ఎకరాల 16 గుంటల్లో నిర్మించిన అక్రమ గోడను హైడ్రా కూల్చి వేసింది. మేడ్జెల్ పోచారం ఏక శిలానగర్ లోని 740, 741,742 సర్వే నెంబర్లలో అక్రమ కట్టడాలపై హైడ్రా ఫోకస్ పెట్టింది. హైడ్రా కూల్చివేతల నేపథ్యంలో ఏకశిలానగర్ ప్లాట్ యజమానులు సంతోషం వ్యక్తం చేశారు.తప్పుడు డాక్యుమెంట్లతో వ్యవసాయ భూములుగా నూనె వెంకట నారాయణ ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయించుకున్నారని ప్లాట్ ఓనర్స్ అంటున్నారు.
నూనె వెంకట నారాయణ క్లారిటీ
ప్రభుత్వరికార్డులు పరిశీలించకుండానే హైడ్రా అక్రమంగా కూల్చి వేసిందని నూనె వెంకట నారాయణ క్లారిటీ ఇచ్చారు. న్యాయ పోరాటం చేస్తానని ఆయన చెప్పారు. మూసీ పరివాక భూములను స్వాధీనం చేసుకునేఉద్దేశ్యంతో చేపట్టిన హైడ్రా కూల్చివేతలు అనేక వివాదాలకు కారణమౌతుంది. ఇటీవలె కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు స్వంత ప్రభుత్వంపై హైకో ర్టులో పిల్ వేసి సంచలనం సృష్టించారు. పిల్ వేసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వ ఆత్మ రక్షణతో పడి పోయింది.