ప్రత్యేక అజెండాపై కవిత క్లారిటీ..

పెద్దాయన కేసీఆర్ దయవల్ల నే సింగరేణి వారసత్వ ఉద్యోగాల్లో యువతకు ప్రాధాన్యత దక్కింది.;

Update: 2025-05-30 08:01 GMT

కొన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీపై కవిత చేస్తున్న వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆమె ఏదో పర్సనల్ అజెండాతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారన్నచర్చ జోరుగా జరుగుతోంది. కాగా శుక్రవారం ఆమె ఈ అంశంపై క్లారిటీ ఇచ్చారు. తనకు ఎటువంటి ప్రత్యేక అజెండా లేదని చెప్పారు. ‘‘నాకు ప్రత్యేక ఎజెండా లేదు. పెద్దాయనను ఎవరేమన్నా ఊరుకోను. ఎన్నో ఆవేదనలు భరించలేక, పార్టీని కాపాడుకోవాలనే లేఖ రాసిన, భాగ్య రెడ్డి వర్మ, పీవీ నరసింహ రావు వర్ధంతి కార్యక్రమాలను జాగృతి ఆద్వర్యం లో చేశాం. అప్పట్లో తెలంగాణ బొగ్గు గని సంఘం లో కొత్త నాయకత్వాన్ని వ్యతిరేకించారు’’ అని చెప్పారు.

‘‘యువతరానికి సింగరేణి జాగృతి లో అవకాశం కల్పించాం. పెద్దాయన కేసీఆర్ దయవల్ల నే సింగరేణి వారసత్వ ఉద్యోగాల్లో యువతకు ప్రాధాన్యత దక్కింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయం లో కేసీఆర్ కు నోటీస్ ఇస్తే ఎందుకు బీ ఆర్ఎస్ ముఖ్య నేతలు ఎందుకు స్పందించలేదు. లేఖలో ప్రస్తావించిన అంశాలు ప్రజలు అనుకునేవే. బిఆర్ ఎస్ బిజెపి వైపు చూడొద్దు. బీజేపీ తో పొత్తు పెట్టుకున్న పార్టీలు బాగుపడలేదు. కేసీయార్ కు కుటుంబం కంటే ప్రజలంటేనే మక్కువ. బీజేపీ లో పార్టీ నీ నేను జైల్లో ఉన్నప్పుడు బిజెపి లో కలుపుతామనీ చెప్పారు. అస్సలే విలీనం ఒప్పుకోను. లెటర్ రాయడం లో నా తప్పేం లేదు. నేను కలవాలని చెప్పాలని ప్రయత్నం చేశాను. తండ్రిని కలిసే అవకాశం వచ్చింది కానీ కలవలేక పోయాను. లెటర్ బయటికి తెచ్చిన వారిని పట్టుకోండి’’ అని పేర్కొన్నారు.

Tags:    

Similar News