కొడుకుని జంతుప్రపంచానికి చేరువ చేసిన హైదరాబాద్ ఐఎఫ్ఎస్ అధికారి

అడవుల మీద ప్రేమ డాక్టర్ హీరేమఠ్ ని ఐఎఫ్ ఎస్ వైపు నడిపించింది.;

Update: 2025-06-14 03:55 GMT
హైదరాబాద్ జూపార్కు క్యూరేటర్ వసంతకు జంతువుల దత్తత పత్రాన్ని అందజేస్తున్న యువన్ హీరేమఠ్, పక్కన తన తండ్రి జూ డైరెక్టర్ సునీల్ దంపతులు

తెలంగాణ జూ పార్క్‌ల డైరెక్టర్ డాక్టర్ సునీల్ ఎస్.హీరేమఠ్ 2011వ బ్యాచ్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి.కర్ణాటక రాష్ట్రానికి చెందిన సునీల్ కు చిన్ననాటి నుంచి అడవులు, పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణులంటే ఎంతో ఇష్టం. ఇదే ఆయన్ని అగ్రికల్చర్ నుంచి అడవుల వైపు నడిపించింది.అగ్రికల్చర్ ప్లాంట్ ఫిజియాలజీలో పీహెచ్‌డీ చదివి పిహెచ్ డి చేశారు. అయితే అభిరుచి ఆయన్ని ఇండియన్ ఫారెస్ట్ సర్వీసు వైపు నడిపించింది.. 2011లో తనకు ఇష్టమైన ఐఎఫ్ఎస్ అధికారిగా ఎంపికయ్యారు. తెలంగాణ క్యాడర్ అధికారి అయ్యారు. రాష్ట్రానికి అటవీశాఖ అధికారిగా వచ్చారు.




 జంతువులంటే తనకున్న ఇష్టంతో హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్కు క్యూరేటర్ గా సునీల్ ఎస్ హీరేమఠ్ పనిచేశారు. ఆయన పనిచేస్తున్న కాలమంతా జంతు సంక్షేమం, ప్రజల్లో జంతువుల పట్ల బాధ్యత కలిగించడం, జంతు పరిరక్షణలో వాళ్లని భాగస్వాములను చేయడం, జూ జంతువులను దత్తత తీసుకునేలా చైతన్యం తీసుకురావడంలో ఆయన కార్యక్రమం అయింది. ఇందులో విజయవంతమయ్యారు. ఆయన క్యురేటర్ గా ఉన్నపుడు హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ చాలా ప్రశస్తి పొందింది. సందర్శకుల సంఖ్య కూడా పెరగింది. ఆ తర్వాత పదోన్నతిపై తెలంగాణ జూపార్కుల డైరెక్టరుగా ఈయన ప్రస్తుతం పనిచేస్తున్నారు.


గత ఏడాది జంతువుల దత్తత చెక్ అందిస్తున్న యువన్ 

 ఇపుడాయన తెలంగాణలో జూపార్కుల అభివృద్ధికి బాటలు వేస్తున్నారు. తెలంగాణలోని హైదరాబాద్, వరంగల్, మహబూబ్ నగర్ జూపార్కుల అభివృద్ధితో పాటు హైదరాబాద్ లో కొత్తగా మరో జూపార్కు ఏర్పాటు కోసం పనిచేస్తున్నారు. ఈయన హయాంలో హైదరాబాద్ జూపార్కుకు 2015 నుంచి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (ISO- 9001) నుంచి అయిదు సార్లు గుర్తింపు లభించింది.




 జంతువులే ఆ బాలుడి లోకం

డాక్టర్ సునీల్ ఎస్ హీరేమఠ్అధికార నివాసం హైదరాబాద్ నెహ్రూ జూపార్కు ఆవరణలోనే ఉంటుంది.వన్యప్రాణులంటే ప్రేమ చూపించే డాక్టర్ సునీల్ జూపార్కు క్యూరేటరుగా, జూపార్కుల డైరెక్టరుగా సుదీర్ఘకాలంగా పనిచేస్తూ జూ సమీపంలోని అధికార నివాసంలో ఉంటూ ఉండటంతో ఆయన కుటుంబం కూడా జంతుప్రపంచానికి చేరువఅయింది. సునీల్ హిరేమత్ దంపతులకు యువన్ హీరేమఠ్ అనే 8 ఏళ్ల కుమారుడున్నాడు. దీనితో పిల్లవాడికి చిన్న నాటి నుంచే వన్యప్రాణి స్పృ హ కల్పిస్తున్నాడు.



నిత్యం జంతువుల బొమ్మలతో ఆడుకోవడమే కాదు, జూపార్కులో జంతువుల మధ్య తిరుగాడే అవకాశం యువన్ కు కల్పించారు. ఇపుడ యవన్ కు జంతువులే లోకంగా మారింది. తల్లిదండ్రులతో కలిసి నిత్యం జూపార్కులో సంచరించడం, జంతువులు, వన్యప్రాణుల విశేషాలు కళ్లారా చూస్తూఉండటం, అడవుల్లో ట్రెక్కింగ్ కు వెళ్లడం, జంతువులను చూసేందుకు సఫారీ రైడ్ కు వెళ్లడం నిత్యకృత్యంగా మారింది. దీనివల్లనే జంతువులు, వన్యప్రాణులంటే తన కుమారుడు యువన్ కు ఎంతో ఇష్టమని చెబుతారు తండ్రి సునీల్.




 తండ్రీ బాటలో తనయుడు...

యువన్ హిరేమత్ జన్మదినం కూడా జంతు ప్రదర్శన శాలలోనే జరుగడం విశేషం. బర్త్ డే సందర్భంగా హైదరాబాద్ జంతుప్రదర్శన శాలలో రెండేళ్లుగా యవన్ పేరు మీద కూడా జంతువులను దత్తత తీసుకున్నారు. గురువారం తన పుట్టిన రోజు సందర్భంగా యువన్ హీరేమత్ తన తండ్రి సునీల్, తల్లితో కలిసి జూపార్కును సందర్శించి దత్తత విరాళం అందజేశారు. యువన్ పేరు మీద జంతువులను దత్తత తీసుకుంటూ విరాళం ఇది రెండో సారి. ఇది జంతుప్రేమికులకు ప్రేరణగా నిలుస్తుంది.



 గత ఏడాది ఏడేళ్ల వయసులో ఏడు జంతువుల దత్తత

యువన్ హీరేమఠ్ తన ఏడేళ్ల వయసులో 2024 జన్మదినోత్సవం సందర్భంగా జూన్ నెలలలో ఏడు జంతువులను దత్తత తీసుకొని రూ.75వేల చెక్కును తన తల్లితో కలిసి తండ్రికి అందజేశారు. గత ఏడాది యువన్ ఖడ్గమృగం, కొండముచ్చు, పులి, నక్క, నిప్పుకోడి, అడవి కుక్క, ఆస్ట్రిచ్ పక్షిని నెలరోజుల పాటు దత్తత తీసుకొని దానికయ్యే పోషణ డబ్బును విరాళంగా యువన్ అందజేశారు.



 ఎనిమిదేళ్ల వయసులో 8 జంతువుల దత్తత

ఈ ఏడాది జూన్ 12వతేదీన తన జన్మదినం సందర్భంగా యువన్ హీరేమఠ్ హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో ఎనిమిది జంతువులను దత్తత తీసుకున్నాడు.యువన్ దత్తత తీసుకున్న జంతువుల్లో హిప్పోపొటామస్, జాగ్వార్, ఎలుగుబంటి, కాపుచిన్ కోతి, పెలికాన్, ఘరియల్, ఓటర్, గుడ్లగూబ ఉన్నాయి. ఒక నెల పాటు 8 జంతువుల పోషణ నిమిత్తం యువన్ వన్యప్రాణుల దత్తత పథకం కింద రూ.70 వేల చెక్కును తన తల్లిదండ్రులతో కలిసి జూపార్క్ క్యూరేటర్ జె.వసంతకు దత్తత వోచర్‌ను అందజేశాడు. జూపార్కు క్యూరేటర్ వసంత చిన్నారి బాలుడు యువన్ ను అభినందించారు. చిన్నవయసులోనే తన తల్లిదండ్రులతో కలిసి జంతు సంక్షేమం పట్ల యువన్ నిబద్ధతను క్యూరేటర్ ప్రశంసించారు.



 జూపార్కు జంతువులతో యువన్ కు అనుబంధం

యువన్ హీరేమత్ తన తల్లిదండ్రులతో కలిసి జూపార్కు ఆవరణలోని ప్రభుత్వ క్వార్టరులోనే నివాసముంటున్నారు. దీంతో ఆయన తరచూ జంతువులను చూస్తుంటారు. చిరాగ్ ఇంటర్నేషనల్ స్కూలులో 3వ తరగతి చదువుతున్న యువన్ కు జంతువుల పట్ల అపారమైన అవగాహన ఉందని జూపార్కు పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హనీఫ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. ఖాళీ సమయాల్లో యువన్ జంతువులను చూస్తూ పెరగడంతో వీటిపై అవగాహన ఏర్పడిందన్నారు.యువన్ ఒక్కో జంతువు గురించి పూర్తి వివరాలు చెప్పడమే కాకుండా జూ పార్కులోని జంతువులతో అనుబంధం ఏర్పడిందని హనీఫ్ వివరించారు.


Tags:    

Similar News