తెలంగాణ విత్తన బిల్లు సాధ్యమయ్యేనానా ?

హర్యానా అనుభవం కొత్త పాఠాలు నేర్పింది;

Update: 2025-06-19 14:10 GMT

తెలంగాణ దేశంలోనే విత్తన బ్యాంకుగా ప్రసిద్ది చెందింది. తెలంగాణలో 1. 25 కోట్ల ఎకరాలు సాగుకు అనుకూలంగా ఉన్నాయి. సంవత్సరానికి 20 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయి. ఈ డిమాండ్ ను దృష్టిలో పెట్టుకునే నకిలీ రాయుళ్లు తమ విత్తనాలను రైతులకు అమ్మేసి పంట నష్టాలకు కారణమవుతున్నారు. నకిలీ విత్తనాలు విక్రయిస్తే పీడీ యాక్ట్ ప్రయోగించాలి. కానీ ఈ యాక్ట్ నిరుపయోగంగా మిగిలిపోయింది. గత పదేళ్లలలో కేవలం 991 నకిలీ విత్తనాల కేసులు నమోదయ్యాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

తెలంగాణలో వ్యవసాయ శాఖ , రైతు కమిషన్ ఇటీవలె హర్యానా విజిట్ చేసింది. హర్యానాలో విత్తన సవరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందింది. గత మార్చిలో ఈ బిల్లు పాస్ అయిన నేపథ్యంలో తెలంగాణ వ్యవసాయ శాఖ అధికారుల సందర్శన ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం తెలంగాణలో డ్రాప్టింగ్ బిల్లు రూపకల్పన జరుగుతోంది. తెలంగాణ కూడా స్వంత బిల్లును రూపొందించడంలో ఉత్సుకత చూపిస్తోంది. హర్యానా అ నుభవాలతో తెలంగాణ కొత్త పాఠాలు నేర్చుకుంటోంది. అనేక సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్దమైంది.

హర్యానా బిల్లు ప్రామాణికం

హర్యానా బిల్లు ప్రకారం నకిలీ విత్తనాలు విక్రయిస్తే మూడేళ్ల జైలు శిక్ష, ఐదు క్షల జరిమానా ఉంది. నాసిరకం విత్తనాలను విక్రయించకూడదన్న ఉద్దేశ్యంతో హర్యానా ఈ బిల్లును ఇంట్రడ్యూస్ చేసింది. రాష్ట్ర పతి ఆమోదం కోసం ముసాయిదా బిల్లు ను పంపారు.

కేంద్రం నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేకపోవడంతో తెలంగాణలో విత్తన బిల్లు ఇప్పట్లో సాధ్యం కాకపోవచ్చు. హర్యానా ఎదుర్కొంటున్న న్యాయ వివాదాలు తెలంగాణ విత్తన బిల్లుకు ముసురుకుంటున్నాయి.

తెలంగాణలో నకిలీ విత్తనాల దందా

తెలంగాణలో నకిలీ విత్తనాల దందా జోరుగా కొనసాగుతోంది. వర్షాకాలం రావడంతో ఈ దందా మూడు పువ్వులు, ఆరు కాయలుగా కొనసాగుతోంది. ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఈ దందా ఎక్కువగా ఉంటుంది. ఖరీఫ్ కాలం రావడంతోనే నకిలీ విత్తనాల దందా ఊపందుకుంది.

రైతులను నిలువునా ముంచే నకిలీ విత్తనాల ముఠాను ఆగడాలు అరికట్టకపోతే పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా నకిలీ విత్తనాలు తెలంగాణలో డంప్ అయ్యే అవకాశం ఉంది. పొరుగు రాష్ట్రాలైన చత్తీస్ ఘడ్, కర్నాటక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల నుంచి బారీగా నకిలీ విత్తనాలు దిగుమతి అవుతున్నాయి. పోలీసులు, వ్యవసాయ శాఖాధికారులు చేస్తున్నప్పటికీ నకిలీ విత్తనాల విక్రయాలు ఆగడం లేదు.

జిన్నింగ్ మిల్లులో సేకరించి న పత్తిగింజలను క్వాలిటీ చెక్ చేస్తారు. ఎందుకూ పనికి రాని విత్తనాలను బ్రాండెడ్ విత్తనా ప్యాకెట్ల లో విక్రయించడం నకిలీ విత్తనాల వ్యాపారులు చేస్తుంటారు. నకిలీ విత్తనాలు ట్రాన్స్ పోర్ట్ కూడా భిన్నం. ఇతర సరుకులు వెళ్లే వాహనాల్లో నకిలీ విత్తనాలను తరలించడం ఓ పద్దతి. ఎవరికీ అనుమానం రాకుండా ప్రస్తుతం మామిడి పండ్లు తతరలించే వ్యానుల్లో నకిలీ విత్తనాలు తరలిస్తున్నారు.

తెలంగాణ సీడ్ బిల్లు

తెలంగాణ ప్రభుత్వం సమగ్ర సీడ్ యాక్ట్ ను రూపొందించింది. ప్రస్తుతం డ్రాప్ట్ బిల్లును రూపొందించే పనిలో ఉంది. ఐదుగురు సభ్యులతో కూడిన సమగ్ర కమిటీ ఇప్పటికే ఏర్పాటయ్యింది. డ్రాప్ట్ బిల్లును వెంటనే సమర్పించాలని వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులకు ఆదేశించారు.తెలంగాణలో వ్యవసాయ విత్తన బిల్లుకు సంబంధించి ఇప్పటి వరకు ప్రత్యేక బిల్లు లేదు. అయితే రైతుల జీవితాల్లో ఆశలు నింపడానికి కొన్ని చర్యలు చేపట్టింది. విత్తనాల నాణ్యత, సరఫరాను మెరుగుపర్చడం ఈ విత్తన బిల్లు ముఖ్యోద్దేశ్యం.

రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి వ్యవసాయ శాఖాధికారులతో పలు దఫాలు చర్చలు జరుపుతున్నారు.

కొనసాగుతున్న దాడులు

ఇటీవలి కాలంలో తెలంగాణలోని వికారాబాద్, గద్వాల్, రాచకొండ, వరంగల్ , రామగుండం తదితర జిల్లాల్లో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్న కేంద్రాలపై దాడులు చేసి నకిలీ విత్తనాలు పట్టుకున్నారు. లేబుల్ చేయని కంటైనర్లలో విత్తనాలను పంపిణీ చేస్తున్న వారు పట్టుబడ్డారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నకిలీ విత్తనాలను విక్రయిస్తూ పట్టుబడ్డారు. ఊరు పేరు లేని విత్తనాలు విక్రయించేస్తున్నారు. అనేక సంత్సరాలుగా సమగ్ర విత్తన చట్టం లేకపోవడం వల్లే నకిలీ విత్తనాలు లక్షల ఎకరాల్లో సాగవుతుంది. పర్యవ్యసానంగా రైతులు భారీ నష్టాన్ని చవి చూస్తున్నారు.

రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయి: కన్నెగంటి

1995 నుంచి 2025 వరకు పత్తి రైతుల ఆత్మ హత్యలు పెరిగాయి అని రైతు స్వరాజ్యం నేత కన్నెగంటి రవి అన్నారు. . తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత కూడా రైతుల ఆత్మ హత్యలు పెరిగాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. . రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో కూడా రైతు ఆత్మహత్యలు పెరిగాయి. నకిలీ విత్తనాల వల్ల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నకిలీ విత్తనాల నుంచి రైతులకు విముక్తి కల్పించాలని ఆయన అన్నారు. విత్తన బిల్లు తీసుకువస్తే తగిన పరిష్కారం కనబడుతుంది. పాలకులకు చిత్త శుద్ది ఉంటే ఈ బిల్లు సాద్యం అవుతుంది అని కన్నెగంటి రవి అన్నారు.

Similar News