కలెక్టర్ పమేలా సత్పతిని ప్రశంసించిన రేవంత్ రెడ్డి

నేను వస్తాను సర్కారు దవాఖానాకు బిడ్డో;

Update: 2025-06-16 14:06 GMT

‘ నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన ’ అనే పాట ప్రభుత్వాసుపత్రుల దు స్ధితిని తెలియ జేస్తుంది. తెలంగాణ గ్రామాల్లో ఇప్పటికీ ప్రతినిత్యం వినిపించే పాట అది. పాలకుల కళ్లు తెరచుకోవడం లేదు. ప్రభుత్వాసుపత్రులపై పాలకులు అదే నిర్లక్ష్యాన్ని చూపుతున్నారు. ప్రభుత్వ స్కూల్స్ లో పని చేసే ప్రభుత్వోద్యోగుల పిల్లలు ప్రయివేటు స్కూల్స్ లో చదువుకుంటుంటే ప్రభుత్వోద్యోగుల కుటుంబాలు ప్రయివేటు కార్పోరేట్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ చర్య వల్ల సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్లడం సహజమే. కలెక్టర్ జిల్లాలో మొదటి సిటిజన్. తెలంగాణలోని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ప్రతీ ఒక్కరికి ఆదర్శంగా నిలిచారు. సర్కారు దవాఖానాలో శస్త్ర చికిత్స చేయించుకుని ప్రజారోగ్య వ్యవస్థ మీద నమ్మకం కలిగించారు. ఆమె గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. సైనస్, మైగ్రేన్ తో బాధపడుతున్న కలెక్టర్ జిల్లా దవాఖానాలో ఇన్ పేషెంట్ గా చేరారు. ఆమె ముక్కులో ఎముక పెరుగుదల జరుగుతుందని ఈఎన్టి డాక్టర్లు గుర్తించారు. సర్జరీ అవసరమని చెప్పారు. ఈఎన్ టి సర్జన్ల బృందం ఆమెకు పరీక్షలు చేసి ఎండోస్కోపి, నేసల్ సర్జరీ, సెప్టోప్లాస్టిక్ శస్త్ర చికిత్సలు చేశారు. జిల్లా కలెక్టర్ సర్కారు దవాఖానాలో చికిత్స తీసుకోవడం మామూలు విషయం కాదు. ఆమె చర్య ప్రభుత్వాసుపత్రుల సామర్ధ్యాన్ని చూపించే విధంగా ఉండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని ప్రశంసించారు. కలెక్టర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

‘ నేను రాను బిడ్డో సర్కారు దవాఖాన ’ అనే పాట ప్రభుత్వాసుపత్రుల దు స్ధితిని తెలియ జేస్తుంది. తెలంగాణ గ్రామాల్లో ఇప్పటికీ ప్రతినిత్యం వినిపించే పాట అది. పాలకుల కళ్లు తెరచుకోవడం లేదు. ప్రభుత్వాసుపత్రులపై పాలకులు అదే నిర్లక్ష్యాన్ని చూపుతున్నారు. ప్రభుత్వ స్కూల్స్ లో పని చేసే ప్రభుత్వోద్యోగుల పిల్లలు ప్రయివేటు స్కూల్స్ లో చదువుకుంటుంటే ప్రభుత్వోద్యోగుల కుటుంబాలు ప్రయివేటు కార్పోరేట్ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ చర్య వల్ల సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్లడం సహజమే. కలెక్టర్ జిల్లాలో మొదటి సిటిజన్. తెలంగాణలోని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి ప్రతీ ఒక్కరికి ఆదర్శంగా నిలిచారు. సర్కారు దవాఖానాలో శస్త్ర చికిత్స చేయించుకుని ప్రజారోగ్య వ్యవస్థ మీద నమ్మకం కలిగించారు. ఆమె గత కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. సైనస్, మైగ్రేన్ తో బాధపడుతున్న కలెక్టర్ జిల్లా దవాఖానాలో ఇన్ పేషెంట్ గా చేరారు. ఆమె ముక్కులో ఎముక పెరుగుదల జరుగుతుందని ఈఎన్టి డాక్టర్లు గుర్తించారు. సర్జరీ అవసరమని చెప్పారు. ఈఎన్ టి సర్జన్ల బృందం ఆమెకు పరీక్షలు చేసి ఎండోస్కోపి, నేసల్ సర్జరీ, సెప్టోప్లాస్టిక్ శస్త్ర చికిత్సలు చేశారు. జిల్లా కలెక్టర్ సర్కారు దవాఖానాలో చికిత్స తీసుకోవడం మామూలు విషయం కాదు. ఆమె చర్య ప్రభుత్వాసుపత్రుల సామర్ధ్యాన్ని చూపించే విధంగా ఉండటంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిని ప్రశంసించారు. కలెక్టర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Similar News