బీసీ కెరటం ఆర్ కృష్ణయ్యను కవిత ఎందుకు కలిసినట్టు?

తెలంగాణలో ఎవరితో ఎవరు కలుస్తున్నారు...;

Update: 2025-06-23 13:17 GMT

బిసి ఉద్యమ నాయకుడి నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన  బీసీ కెరటం  ఆర్ కృష్ణయ్య బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మద్దత్తు ఇవ్వడంలో రాజకీయ కారణాలే కనబడుతున్నాయి.

బిసి ఉద్యమ నాయకుడు రాజకీయాల్లో అరంగ్రేటం చేసింది టిడిపిలోనే. ఎల్బినగర్ టిడిపి ఎమ్మెల్యేగా మొదటి సారి చట్ట సభలో ప్రవేశించారు. టిడిపీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన కృష్ణయ్య ఆ తర్వాత వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోగానే తన రాజ్య సభ పదవికి రాజీనామా చేసి బిజెపిలో చేరారు. కృష్ణయ్య వైసీపీ రాజ్య సభ పదవికి రాజీనామా చేయడం వల్ల టిడిపి లాభపడింది.

బిఆర్ఎస్ బిజెపి ఒక్కటయ్యేనా

గత అసెంబ్లీ ఎన్నికల ముందు బిజెపి, బిఆర్ఎస్ ఒక్కటేనని ప్రచారం జరిగింది. కాంగ్రెస్ ను నిలువరించడానికి బిజెపి బిఆర్ఎస్ కలిసి పని చేశాయి. చివరికి బిజెపి వ్యతిరేక కూటమిలో బిఆర్ఎస్ అధినేత చేరకపోవడానికి కారణం కూడా అదే. కాంగ్రెస్ నేతృత్వంలోని ఈ కూటమి నుంచి కెసీఆర్ కు కనీసం ఆహ్వానం కూడా అందలేదు. ఎందుకంటే కెసీఆర్ పచ్చి అవకాశ వాది అని కాంగ్రెస్ కూటమి నేతల భావన. ప్రత్యేక తెలంగాణ ఇస్తే అప్పటి టిఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేస్తానని కెసీఆర్ మాట ఇచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. తెలంగాణ బిల్లుకు కాంగ్రెస్ మద్దత్తు ఇవ్వకపోతే ప్రత్యేక తెలంగాణ వచ్చేది కాదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి టిఆర్ఎస్ మాత్రమే కారణం .

ఎపీలో  కోలుకోలేదు

ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత రెండు రాష్ట్రాల్లో ప్రతి పక్షంలో కూర్చోవల్సి వచ్చింది.తెలంగాణ దెబ్బకు నేటి వరకు ఎపిలో కాంగ్రెస్ కోలుకోలేదు. తెలంగాణలో కాంగ్రెస్ కు  వ్యతిరేకంగా బిజెపి జాతీయస్థాయిలో పోరాడుతుంటే తెలంగాణలో మాత్రం కెసీఆర్ నేతృత్వంలోని టిఆర్ఎస్ పోరాడింది. ఎందుకంటే కెసీఆర్ కు అధికారం కోల్పోవడం ఏ మాత్రం ఇష్టం లేదు.

బాప్ నెంబరీ బేటీ దస్ నెంబరీ

బాప్ నెంబరీ బేటీ దస్ నెంబరీ అనేది తెలంగాణ రాజకీయాల్లో వినబడుతున్న మాట.

ప్రస్తుతం కవిత తెలంగాణ జాగృతి సంస్థను ఒంటి చేత్తో నడుపుతున్నారు. ఆమెకు తండ్రి కెసీఆర్, అన్న కెటీఆర్ మద్దత్తు కరువయ్యింది. ఆమె ఇటీవలె అమెరికా నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టులో దిగినప్పుడు ఒక్క బిఆర్ఎస్ కార్యకర్త కూడా ఆమె పక్కన లేడు. బిఆర్ఎస్ ఎమ్మెల్సీ వస్తున్నప్పుడు కార్యకర్తలు, నాయకులు పార్టీ జెండాలతో స్వాగతం పలకాలి. అధికారంలో ఉన్నపదేళ్లు ఆమె తెలంగాలో చక్రం తిప్పారు. ఆమె నిజామాబాద్ ఎంపీగా ఓడిన వెంటే తండ్రి కెసీఆర్ ఎమ్మెల్సీఅవకాశ మిచ్చారు. ప్రస్తుతం ఆమెకు తండ్రి పెట్టిన రాజకీయభిక్షలో కొనసాగుతున్నారు. 

లిక్కర్ స్కాం కారణం

తెలంగాణలో బిఆర్ఎస్ అధికారం కోల్పోవడానికి లిక్కర్ స్కాం కూడా ఓ కారణమైంది. లిక్కర్ స్కాంలో ఇరుక్కొన్ని నాలుగు నెలలు తీహార్ జైల్లో ఆమె ఉన్నారు. ఈ నాలుగు నెలల్లో ఒక్కసారి కూడా తండ్రి కెసీఆర్ పరామర్శించలేదు. కవితను పరామర్శిస్తే పార్టీకి డ్యామేజి జరిగే ప్రమాదం ఉంది. పైగా తన బద్ద శత్రువు కెటీఆర్ బిఆర్ఎస్ రథ సారథిగా కొనసాగుతున్నారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కారు పార్టీకి స్టీరింగ్ తిప్పుతుంది కూడా ఆయనే. కెటిాఆర్ ను కాదని కెసీఆర్ ఆ పని చేయలేడు. 

ఆస్తులు, అధికారం కోసం..

ఆస్తులు, అధికారం కోసం కవిత మళ్లీ ఉద్యమ బాట పట్టారనే తెలంగాణలో ప్రచారం ఉంది.

మహిళా బిల్లు పార్ల మెంట్ లో పాస్ కావడం వెనక తెలంగాణ జాగృతి కృషి ఉంది అని చెప్పుకుంటున్న కల్వకుంట్ల కవిత తాజాగా బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఉద్యమిస్తున్నారు. వరంగల్ లో జరిగిన రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో కవిత తెలంగాణ జాగృతి యాక్షన్ ప్లాన్ ప్రకటించారు. వచ్చే నెల రైల్ రోకో ద్వారా కేంద్రంపై వత్తిడి తెచ్చి బిసీ బిల్లు పాస్ చేయించుకోవాలని ఆమె తన శ్రేణులకు పిలుపునిచ్చారు. బిసీ బిల్లును కేవలం అసెంబ్లీలో పాస్ చేయించి కేంద్రం విచక్షణకే వదిలేయడం కరెక్టు కాదని కవిత వాదన. కేంద్రం మీద వత్తిడి తెచ్చి పార్లమెంటు ఉభయ సభల్లో బిసీ బిల్లు పాస్ అయ్యేందుకు కృషి చేయాలని ఆమె కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నారు. మహిళా బిల్లు కోసం బిజెపిని బోనులో నిలబెట్టడానికి అప్పట్లో దేశ వ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీల మద్దత్తు కూడ గట్టారు. ఈ రాజకీయ పార్టీలలో కాంగ్రెస్ కూడా ఉంది. లిక్కర్ స్కాంలో తన పేరు బిజెపి ఇరికించిందన్న కారణంతోనే ఆమె బిజెపికి దూరమయ్యారనేది అందరికీ అర్థమైన విషయం. బిఆర్ఎస్ ను ఎదుర్కోలేక బిజెపి తనను కేసులో ఇరికించిందని చెబుతూ వచ్చారు. ఈ కేసులో ఆమె తీహార్ సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు కోర్టు కేసులకు హాజరైన సమయంలో బిజెపిని నిందించారు. జైలు గోడల మధ్య కూడా జై తెలంగాణ అనే నినాదం వినిపించేది. తెలంగాణకు లిక్కర్ స్కాంకు ఏం సబంధం. బిఆర్ఎస్ ను రాజకీయంగా ఎదుర్కోలేక బిజెపి పెట్టిన కేసుగా ఆమె అభిర్ణించారు.

చప్పబడి సంధి కోసం వెంపర్లాట

బిఆర్ఎస్ ఎమ్మెల్సీగా ఉంటూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటీఆర్, తండ్రి కెసీఆర్ కు ఆమె ప్రశ్నలు సంధించి మళ్లీ చప్పబడ్డారు. బిఆర్ఎస్ రజతోత్సవ సభలో కవితను డయాస్ ఎక్కనీయకుండా చేయడంలో కెటీఆర్ సక్సెస్ అయ్యారు. మనసులో పెట్టుకున్న కవిత తండ్రికి లేఖ రాసారని బిఆర్ఎస్ శ్రేణులు చెబుతున్నాయి.

రెస్పాన్స్ లేకపోవడంతో కవిత బీసీ కార్డు పట్టుకుని  తిరుగుతున్నారు. కుటుంబ సభ్యుల మద్దత్తు లేకపోవడంతో బిసి నేత కృష్ణయ్య పంచన చేరారు.

లిక్కర్ స్కాంలో ఇరుక్కున్న కవితకు బిజెపి సపోర్ట్ కంపల్సరీ. కాబట్టి బిజెపి ఎంపీ అయిన ఆర్ కృష్ణయ్య ఇంటికి వెళ్లి కలిశారు.ఒకప్పుడు కవితను కలవాలంటే అపాయింట్ మెంట్ కావాలి. ప్రస్తుతం ఆమె బిజెపి నేతల అపాయింట్ల కోసం వేచి చూస్తున్నారు. తాను చేపట్టే బీసీ ఉద్యమానికి మద్దత్తు ఇవ్వాలని బిజెపి నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. బిసీ బిల్లు ముసుగులో కవిత బిజెపి నేతలను కలవడంలో రాజకీయ కారణాలు తప్ప మరే కారణం లేదని తెలుస్తోంది.

Tags:    

Similar News