‘నిందలు, దందాలు, చందాలే కాంగ్రెస్ పాలన’
బనక చర్ల తో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు మాట్లాడటం లేదు.;
తెలంగాణ రైతాంగానికి, రైతాంగ ప్రయోజనాలకు ఎప్పటికయినా కేసీఆరే శ్రీరామ రక్ష అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. తమ పాలనతో రాష్ట్రం, రైతాంగం పచ్చగా ఉన్నాయని, కానీ ఇప్పుడు రైతుల కష్టాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతోందని అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిందలు, దందాలు, చందాల పాలన నడుస్తోందని కాంగ్రెస ప్రభుత్వానికి చురకలంటించారు. ‘‘దేశంలో ఏ మంత్రి పని చేయని విధంగా అద్భుతంగా తక్కువ కాలంలోనే ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత హరీష్ రావుది. విద్యాసాగర్ రావు గారు తెలంగాణ కు జరిగిన అన్యాయం గురించి ప్రతి క్షణం ప్రతి చోట చెప్పారు. నీళ్ళు నిధులు నియామకాలు టాగ్ లైన్ ఎప్పుడో పోయ్యింది. నిందలు, దందాలు, చందాలు ఇప్పుడు నడుస్తున్న పాలన. రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు అదే విధంగా ఉంది. సుంకిశాల, slbc టన్నెల్ కూలిన కేంద్ర బృందం ఇప్పటివరకు రాలేదు. Slbc టన్నెల్ కూలి పేద కూలీలు చనిపోయిన ప్రభుత్వం పట్టించుకోలేదు’’ అని వ్యాఖ్యానించారు.
‘‘చిన్న పిల్లర్ మెడిగడ్డ లో కూలితే దాన్ని రాద్దాంతం చేస్తోంది. కూలిన రెండు రోజుల్లోనే ndsa వచ్చింది పనికిమాలిన రిపోర్ట్ ఇచ్చింది. కాంగ్రెస్, బీజేపీ కుమక్కు రాజకీయాలు చేస్తున్నారు. కమిషన్ పేరిట రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. అందరికీ అర్దం అయ్యేలా వివరాలు చెప్పాలని మీకున్న అనుభవం ఎవరికి లేదని నేనే కోరితే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని హరీష్ రావు గారికి చెప్పాను. బనక చర్ల తో రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు మాట్లాడటం లేదు. అందుకే ఈ వాస్తవాలు జనానికి తెలియాలి. ఏదేమైనా ఎన్నడైనా తెలంగాణ కు కేసిఆరే శ్రీ రామ రక్ష’’ అని పునరుద్ఘాటించారు.
‘‘తెలంగాణ ఉద్యమానికి నీళ్లు, నిధులు, నియామకాలు అనేవి ప్రధాన శీర్షికలు. ఆ దిశగానే కేసీఆర్ పాలన కొనసాగించారు. అందుకే పదేళ్ల పాటు బీఆర్ఎస్ పాలన ఆ మూడు రంగాల్లో సంపూర్ణ న్యాయం చేసింది. కృష్ణా, గోదావరిలో ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టాం. కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ను కాలంతో పోటీపడి కట్టాం. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసింది. సీతారామ ప్రాజెక్ట్నూ 90శాతం కంప్లీట్ చేసింది.రైతాంగ ప్రయోజనాల కోసం కేసీఆర్ ప్రభుత్వం నిరంతరం పరితపించింది. రైతాంగ అభివృద్ధి కోసం అన్ని విధాలా కృషి చేసింది. కానీ ఈరోజు పరిస్థితులు అలా లేవు. నీళ్లు, నిధులు, నియామకాలు అన్న శీర్షిక కనుమరుగైంది. నిందలు, దందాలు, చందాలు అన్నదే నడుస్తోంది. బీఆర్ఎస్ మీద నిందలు, బిల్డర్లు కాంట్రాక్టర్లతో దందాలు, రాహుల్ గాంధీకి చందాలు.. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని ఇది’’ అని మండిపడ్డారు కేటీఆర్.