మహారాష్ట్ర వర్షాలతో పోటెత్తిన ఆల్మట్టి
మిగతా జలాశయాల్లో అదే పరిస్థితి;
By : B Srinivasa Chary
Update: 2025-06-29 07:50 GMT
మహరాష్ట్రలోవర్షాలు భారీగా కురవడంతో కృష్ణా బేసిన్ లోని ప్రాజెక్టుల్లో వరద పోటెత్తింది. కర్నాటకలోని ఆల్మట్టి రిజర్వాయర్ లో వరద తాకిడి ఎక్కువైంది. ఆల్మట్టి సామర్ధ్యం 519.90 మీటర్లు అయితే ప్రస్తుతం 516. 82 మీటర్లకు చేరుకుంది. ఎగువ నుంచి 1. 15 లక్షల క్యూసెక్కుల నీరు కృష్ణాబేసిన్ లోకి వస్తోంది. ప్రస్తుతం 30 గేట్లు ఎత్తివేసారు. ఫలితంగా 90 క్యూసెక్కుల నీరు క్రిందికి అంటే తెలంగాణలో వచ్చి చేరుతుంది.
నారాయణపూర్ జలాశయం నిండు కుండలా మారింది. రిజర్వాయర్ నీటి మట్టం 492. 25 మీటర్లు అయితే ప్రస్తుతం 490. 63 మీటర్లకు చేరుకుంది. ఎగువ నుంచి 84, 445 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుంది. 70 వేల క్యూసెక్కులను క్రిందకు వదులుతున్నారు. జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ జలాశయాలు వరదనీటితో పోటెత్తాయి.