మంత్రికి మావోయిస్టుల వార్నింగ్
ఆదివాసుల హక్కులను కాలరాస్తున్నారు;
మంత్రి సీతక్కకు మావోయిస్టులు వార్నింగ్ ఇచ్చారు. ఈ మేరకు లేఖ కూడా పంపించారు. ప్రస్తుతం ఆమె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేబినెట్ లో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది స్త్రీ, శిశు సంక్షేమ శాఖమంత్రి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆదివాసీల హక్కులను కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తున్నప్పటికీ మంత్రి సీతక్క స్పందించడం లేదని మావోయిస్టులు ఆరోపించారు. ఆదివాసీలను పోలీసులు, అటవీ శాఖాధికారులు వేధిస్తున్నప్పటికీ సీతక్క స్పందించడం లేదని మావోయిస్టుల ఆరోపణ. ములుగు జిల్లాలోని ఆదివాసులను వేధిస్తున్నప్పటికీ సీతక్క పట్టించుకోవడం లేదని మావోయిస్టులు అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన పెసా, 1/70 చట్టాలను సీతక్క మరచిపోయారా అని మావోయిస్టులు ప్రశ్నించారు. జీవో నెంబర్ 49తో కొమురం భీం జిల్లాలోని 339 ఆదివాసీ గ్రామాలను ప్రభుత్వ ఖాళీ చేయించే పనిలో ఉందన్నారు.
ప్రస్తుతం సీతక్క రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ములుగు ఎమ్మెల్యే తెలంగాణ కాంగ్రెస్ లో ఆమె ఫైర్ బ్రాండ్ గా నిలిచారు. ఆదివాసి, కోయ జాతికి చెందిన సీతక్క మాజీ నక్సలైట్ . విద్యార్థి దశ నుండేపోరాట బాటపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నక్సలైట్ల ఉద్యమంలోచురుకైన పాత్ర పోషించారు. తర్వాత జన జీవన స్రవంతిలో కలిసిపోయారు.
న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా అందుకున్న ఆమె చంద్రబాబు ప్రోత్సాహంతో తెలుగుదేశం పార్టీలో చేరారు. 2004లో ములుగు ఎమ్మెల్యేగా మొదటి సారి పోటీ చేసి ఓడిపోయారు. 2009 లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిపై టిడిపి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఉద్యమంలో టిడిపి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆమె కాంగ్రెస్ లో చేరారు.
నా మూలాలు మర్చిపోలేదు: సీతక్క
ఆదివాసీల హక్కులకోసం తాను నిరంతరం పోరాడుతున్నట్లు మంత్రి సీతక్క చెప్పారు.మావోయిస్టుల బెదిరింపు లేఖపై మంత్రి స్పందించారు. తన మూలాలు ఎన్నడూ మర్చిపోలేాదన్నారు. ఆదివాసీల జోలికి వెళ్లకూడదని తాను అటవీ శాఖాధికారులను హెచ్చరించానన్నారు. తాను కొండా సురేఖ కల్సి అధికారులకు ఆదేశాలు జారి చేశామన్నారు. రాజకీయ నాయకుల ప్రోద్బలంతో కొందరు అటవీ అధికారులు ఆదివాసీల జోలికి వెతున్నారన్నారు. .