ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి గుడ్ న్యూస్

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు.

Update: 2024-08-03 15:15 GMT

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. శనివారం భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ వద్ద 50 కోట్లతో 60 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణ పనులకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, సీతక్క శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల్లో సాగు చేసుకునే అర్హులకు రానున్న రెండు నెలల్లో పట్టాలు ఇస్తామన్నారు. ఆగస్టు 2024 నెలాఖరు లోపు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టబోతున్నామని వెల్లడించారు. మొదటి విడతగా అన్ని నియోజకవర్గాల్లో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపడతామన్నారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కు 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్లను నిర్మిస్తామని చెప్పారు.

మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ వెనుకబడిన భూపాలపల్లి ప్రాంతానికి ఇండస్ట్రియల్ పార్కు రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రతి సెగ్మెంట్ లో మినీ ఇండస్ట్రియల్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. వ్యవసాయం, సంక్షేమం రెండు కల్లుగా భవిస్తూ ఈ ప్రభుత్వం ముందుకు సాగుతోందని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ, రైతు భరోసా, పంటకు ఇన్సూరెన్స్, విత్తనాలకు సబ్సిడీ ఇచ్చామని తెలిపారు. ఈ ఇండస్ట్రియల్ పార్కు లో 200 పరిశ్రమలను ఏర్పాటుకు చేస్తామన్నారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ.. చాలా మంది ఐటీ పరిశ్రమలను కూడా తీసుకు రావాలని కోరుతున్నారన్నారు. ఐటీ ఇండస్ట్రీస్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. గత ప్రభుత్వం ధరణిని తీసుకొచ్చి రైతులను ఇబ్బందుల పాలు చేసిందని అన్నారు. తాము భూమాత ద్వారా సమస్యలను పరిష్కరించబోతున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ రావు అధ్యక్షత వహించగా, వరంగల్ ఎంపీ కడియం కావ్య, ఎమ్మెల్యే కే ఆర్ నాగరాజు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News