‘ఈటల అన్నీ అబద్ధాలే చెప్పారు’
కాళేశ్వరం కమిషన్ ముందుకు నేనూ వెళ్తా. నన్ను బాధ్యుడిని చేసిన ఈటల చెప్పిన అవాస్తవాలను బట్టబయలు చేస్తా.;
పీసీ ఘోష్ నేతృత్వంలోని కాళేశ్వరం కమిషన్ విచారణకు ఈటల రాజేందర్ హాజరయ్యారు. అనంతరం ఆయన బయటకు వచ్చిన చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు కౌంటర్ ఇచ్చారు. కమిషన్కు ఈటల అన్నీ అబద్ధాలే చెప్పారని అన్నారు. కాళేశ్వరంపై ఈటల ఇచ్చిన వాంగ్మూలమంతా కూడా అబ్ధాల పుట్టలా ఉందని ఎద్దేవా చేశారు. కేబినెట్ సబ్ కమిటీ కాళేశ్వరం డిజైన్ మార్పు కోసం వేసింది కాదని స్పష్టం చేశారు.
‘‘ఇతర ప్రాజెక్ట్ లమీద ఎస్టిమేషన్స్ కోసం మాత్రమే క్యాబినెట్ కమిటీ. కేబినెట్ అప్రూవల్ కు కాళేశ్వరం ఎప్పుడు రాలేదు. నన్ను బాద్యడిని చేసేలా ఈటెల వాగ్మూలం ఉందని బావించాల్సి వస్తుంది. ప్రజలనం తప్పం దోవ పట్టించేలా ఉంది. కమీషన్ ముందు అబద్దాలు చెప్పాల్సిన అవసరం ఆయనకు ఎందుకు వచ్చింది. నా సుధీర్ఘ రాజకీయ జీవితంలో విలువలకు కట్టుబడి పనిచేశాను. నాకు చాలా బాదేసింది. అన్నీ జీవోలు, మీము ఇచ్చిన రిపోర్టులు నాదగ్గర ఉన్నాయి. సబ్ కమిటీ రిపోర్ట్ ను కమీషన్ కు సుమోటోగా అందిస్తాను. కాళేశ్వరం నిర్మాణానికి నాకు సంభందం లేదు. మీము ఇచ్చిన రిపోర్టులు మాత్రమే కాబినెట్ దకష్టికి వచ్చాయి. అవసరమైతే జీవోలతో సహా , రిపోర్టంలతో సహా ఎవరితో నైనా చర్చకు సిద్దం. NdSa సైతం కాళేశ్వరం నిరుపయోగం అని చెప్పింది. కళేశ్వరం కమీషన్ విచారణ తర్వాత విచారణ సంస్థలు చర్యలు తీసుకుంటాయి’’ అని తెలిపారు.
ఈటల ఏమన్నారంటే..
‘‘ప్రాజెక్ట్ నిర్మాణం కోసం హరీష్, తుమ్మల నన్ను కలిపి మంత్రివర్గ ఉపసంఘం వేసారు. టెక్నికల్ టీమ్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించాలని చెప్పారు. రూ.63 వేల కోట్లు ఖర్చు అవుతుంది అన్నారు. అది రూ.82 వేల కోట్లకు వెళ్లింది. తరువాత ఎంత పెరిగిందో నాకు అవగాహన లేదు. ఇరిగేషన్ డిపార్ట్ లోనే అకౌంట్ ఆడిట్ డిపార్ట్మెంట్ లు పనులు, నాణ్యత చెల్లిపులు వారే చేసుకున్నారు తప్ప ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధం లేదు. మా బ్రతుకు ట్రసపరెంట్ గా ఉన్నాయి. కమీషన్ రిపోర్ట్ త్వరగా బయటపెట్టి నిజమైన దోషులను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నా. రాజకీయ పబ్బం గడిపితే ఊరుకోము. రిపోర్ట్ బయట పెట్టు. శిక్షించక పోతే నీ కు శిక్ష తప్పదు’’ అని అన్నారు.