మిల్లా మ్యాగీపై కేసు నమోదు

ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదు.;

Update: 2025-05-30 11:02 GMT

హైదరాబాద్ వేదికగా జరుగుతున్న 72వ మిస్ వరల్డ్ పోటీల నుంచి మిస్ ఇంగ్లండ్ మిల్లా మ్యాగీ.. అర్థాంతరంగా తప్పుకున్నారు. పైగా ఆమె విదేశాలకు వెళ్లిన తర్వాత అందాల పోటీలపై చేసిన వ్యాఖ్యలు ప్రపంచమంతా సంచలనం రేకెత్తించాయి. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం దర్యాప్తు చేయించి.. అటువంటిదేమీ లేదని స్పష్టం చేసింది. తాజాగా ఈ విషయంలో మరో కీలక ప్రకటన చేసింది ప్రభుత్వం. ‘‘మిల్లా మ్యాగీపై తెలంగాణ ప్రభుత్వ విచారణ ముగిసింది. ఆ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోదు. మిస్ వరల్డ్ నిర్వాహకులు ఇప్పటికే లండన్‌లో కేసు వేశారు. ఆమెపై యూకే ప్రభుత్వమే లీగల్ చర్యలు తీసుకుంటుంది’’ అని సీఎస్ జయేష్ రంజన్ చెప్పారు.

అసలు మిల్లా ఏమన్నారంటే..

‘‘ధనవంతులైన పురుష స్పాన్సర్ల ముందు పరేడ్ చేసి నిల్చుని ఉండటం చాలా దారుణంగా అనిపింది. ఆ క్షణం నేనేమైనా వేశ్యనా అన్న భావన కలిగింది. మమ్మల్ని వీళ్లు ఎంటర్‌టైన్మెంట్ కోసం తెచ్చుకున్న కోతుల్లా చూస్తున్నారా? అనిపింది. ఈ ప్రోగ్రామ్ అంతా ఔట్‌డేటెడ్. అంతేకాకుండా చాలా మందిని బోరింగ్‌గా ఉన్నారంటూ తిట్టడం కూడా జరిగింది. ఇక నావల్ల కాదు అనుకున్నా. తప్పుకున్నా’’ అని తెలిపింది. ‘‘మమ్మల్ని 24 గంటలూ మేకప్ వేసుకునే ఉండమన్నారు. బ్రేక్‌ఫాస్ట్ సమయంలో కూడా బాల్ గౌన్స్ వేసుకునే ఉండాలని చెప్పారు. ఆ తర్వాత షో కోసం భారీగా ఖర్చు చేసినందుకు థాంక్యూగా మధ్యవయసు వ్యక్తులను ఎంటర్‌టౌన్ చేయమన్నారు. అది చూసిన ఒక్క క్షణం నాకేం అర్థం కాలేదు. ఇది చాలా తప్పనిపించింది. మిస్ వరల్డ్ ఆర్గనైజర్స్ మమ్మల్ని ట్రీట్ చేసిన తీరు చూసి నేనేమైనా వేశ్యనా అన్న అనుమానం వచ్చింది. ఒకసారి మాట్లాడి చూద్దాం అనుకున్నా కానీ ఎవరూ ఇంట్రస్ట్ చూపించలేదు. అందుకే బయటకు వచ్చేశా. డిఫరెంట్ ఫ్యూచర్‌ని క్రియేట్ చేయాలనుకంటున్నా. అసలు మమ్మల్ని వాళ్లు చాలా అగౌరవంగా చూశారు. అప్పుడు మిస్ వరల్డ్ నిజరూపం కనిపించింది’’ అని మిల్లా చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News