క్రీమీ లేయర్ ను నిర్ణయించే కొలమానం డాటా లేదు; కులగణన చేయాలి: మేధావులు, కార్యకర్తలు
గవాయి ఈ వ్యాఖ్యలు అమరావతి లో రాజ్యాంగం పైన జరిగిన కార్యక్రమం లో చేశారు
రెండవ దళిత చీఫ్ జస్టిస్ గా వున్న జస్టిస్ బి.ఆర్. గవాయి ఇటీవల ఎస్సి/ఎస్టీ లలో కూడా క్రీమీ లేయర్ వుంది దాని తొలగింపు జరగాలి అనటం దేశం లో ఒక చర్చకు దారితీసింది. అయితే ఈ వ్యాఖ్యలు రిజర్వేషన్ ఫలాలు అందుకున్న కొద్ది మందిని వాటి నుండి దూరం చేసే ప్రయత్నం కాబట్టి అప్రమత్తంగా ఈ చర్చ జరగాల్సిన అవసరం ఉంది అనే అభిప్రాయం మేధావులు వ్యక్త పరుస్తున్నారు.
ఆయన ఈ వ్యాఖ్యలు ఆంధ్ర ప్రదేశ్ లో ని అమరావతి లో ‘భారత దేశం 75 సంవత్సరాల సజీవ రాజ్యాంగం’ అనే అంశం పైన జరిగిన సదస్సు లో చేశారు. అయితే ఈ వ్యాఖ్యలను రిజర్వేషన్ వ్యతిరేకులు ఎక్కువ గా ముందుకు తెస్తున్నారు వర్గీకరణ వచ్చినప్పుడు కూడా దాని అవసరం గురించి కంటే క్రీమీ లేయర్ గురించే చర్చ చేశారు. క్రీమీ లేయర్ వుంటే అది ఎలా ఉండాలి ఏ రంగంలో వుండాలి అనేది చూడాలి కానీ మొత్తం కులం అంతా అభివృద్ది అయినట్టు చర్చ చేశారు అంటారు, అలహాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ గోపాగాని చంద్రయ్య.
“ఈ మాటలు గవాయి మాట్లాడటం వలన ఎక్కువ ప్రాధాన్యత వచ్చింది. 75 సంవత్సరాలకు డక్కలి కులం నుండి ఒకరు టీచర్ అయితే అతని పిల్లలకు మెడికల్ లో పీజీ సీట్ సంపాదించే పరిస్థితి వస్తుంది. ఒక దినసరి కూలి పిల్లలు ఆ సీట్ కు పోటీపడే పరిస్థితి లేదు. ఒక ఐఎఎస్, ఐపీఎస్, ప్రొఫెసర్ ల పిల్లలకు ఎటువంటి స్కాలర్షిప్ లాంటివి రావు. రిజర్వేషన్ ల తాత్వికత ను అర్థం చేసుకోవాల్సిన అవసరం వుంది. 75 సంవత్సరాల తరువాత 15 శాతం గా వున్న ఎస్సి లకు 5 శాతం ప్రాతినిధ్యం లేదు. 50 శాతం వున్న బీసీ లకు 5 శాతం లేదు చాలా రంగాలలో. ముస్లింల లోనూ పసమందా ల సమస్య ముందుకు వచ్చింది. ఎస్సి ల లో ఒక మధ్య తరగతి ఎదగాలి. వాళ్ళు లేకుండా కాన్షీరామ్ బామ్ సెఫ్ (All India Backward and Minority Communities Employees Federation) ను ఊహించగలమా. చర్చ ప్రైవేట్ రంగం లో రిజర్వేషన్ గురించి, నింపని ఖాళీల గురించి జరగాలి,” అని అన్నారు.
అయితే వర్గీకరణ ఎంత న్యాయమూ పంపిణీ కూడా అంతే న్యాయమని అంతర్గతంగా కూడా గవాయి అన్నట్లు ఒక ఐఎఎస్ పిల్లలు కూలి పిల్లలు ఒకటీ కాదు కాబట్టి వర్గీకరణ వుండాలి అన్నారు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ( MRPS) వ్యవస్థాపక సభ్యుడు, కృపాకర్ మాదిగ. “50 ఏళ్లుగా అభివృద్ది అయిన వాళ్ళు సామాన్యులు అంగీకరించినా చదువు కుని వర్గీకరణ ను సమర్థించిన వాళ్ళు అంతర్గత న్యాయాన్ని అంగీకరించటం లేదు వ్యతిరేకించటం ఆమోదయోగ్యం కాదు. యింకా రిజర్వేషన్ ఫలాలు పొందలేని వాళ్ళు వాటిని అనుభవించే పరిస్థితి రావాలి. ప్రభుత్వం లో ఉన్నత స్థానాలలో వున్న వాళ్ళే యిప్పుడు రాజకీయ పార్టీ ల పంచన చేరి మళ్ళీ రాజకీయ రంగం లోకి వస్తున్నారు. రాజకీయ పార్టీలు వాళ్ళకే సీట్ లు యిస్తున్నాయి. రాజ్యాంగం సంపద పంపిణీ జరగాలి అని చెప్పింది,” అని అభిప్రాయ పడ్డారు.
అయితే క్రీమీ లేయర్ అనేది రాజ్యాంగం లోనూ ఏ డిక్షనరీ లో నూ లేదని చెప్పారు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ అయిన ఈ. వేంకటేశు. “యిది న్యాయ వ్యవస్థ తీసుకు వచ్చిన ఒక ఆలోచన. వెనుకబాటుతనానికి, ఎంత అభివృద్ది అయ్యి ముందుకు వచ్చారు అనే దానికి డాటా లేదు. కుల గణన చేయలేదు. ప్రభుత్వ ఉద్యోగం లేదా హోదా వుంటే క్రీమీ లేయర్ అందామా. మరి ప్రభుత్వ ఉద్యోగాలలో లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి. మన దేశం లో ebc పేరుతో అర్హత లేని వాళ్ళు రిజర్వేషన్ అనుభవిస్తున్నారు. జస్టిస్ కృష్ణ అయ్యర్ జడ్జ్ గా కేరళ లో జస్టిస్ చిన్నప్ప రెడ్డి కర్ణాటక హై కోర్టు లో యిచ్చిన తీర్పుల మీద ఆధారపడి సుప్రీం కోర్టు ఇంద్ర సాహ్నీ కేసులో తీర్పు యిచ్చింది. యిప్పుడు వున్న వ్యవస్థ లో క్రీమీ లేయర్ మీద ఆధారపడి కాకుండా వెనుకబాటుతనం లేదా లేమి అనేది కొలమానం కావాలి. ప్రయివేటీకరణ, ప్రపంచీకరణ కు ముందు జరిగిన చర్చ జరగాలి,” అన్నారు.
ఆధారపడదగిన సమాచారం లేకుండా క్రీమీ లేయర్ అనే పదం మీద చర్చ తప్పు. ఆర్థిక సమానత్వం సామాజిక సమానత్వం రెండు వేరు వేరు విషయాలు. సామాజిక గుర్తింపు, వనరుల పంపిణీ అనేది ఆర్థిక అంశాల మీద కంటే సామాజిక అంశాల మీద ఆధారపడాలి అన్నారు కోలకతా లో ని Centre For Studies In Social Sciences లో సోషియాలజీ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా వున్న డా. సతీష్ చెన్నూరు. బాలగోపాల్ రిజర్వేషన్ అంశాన్ని సామాజికంగా పరిష్కారం చూపాలి అన్నారు. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము, బీహార్ మాజీ సిఎం జీతాన్ రామ్ మాంఝీ లు పూజ చేసిన గుడులను శుద్ది చేశారు. వాళ్ళ స్థాయి మారినా వాళ్ళ సామాజిక పరిస్థితి మారలేదు. గాంధీ ని వ్యాపార వర్గానికి ప్రతినిధి అనని సమాజం అంబేద్కర్ ను ఎందుకు దళిత ప్రతినిధి గా చూస్తున్నారు. 1991 తరువాత దళితుల పైన దాడులు పెరిగాయి. మార్పు గ్రూప్-4 ఉద్యోగాలలో జరిగినట్టు గ్రూప్-1 పోస్టుల లో ప్రాతినిధ్యం లో మార్పు పెద్దగా లేదు,” అని అన్నారు సతీష్.
రిజర్వేషన్ అమలు మొదలయ్యాక ఆ పోస్ట్లు అలాగే ఎవరు దొరకక మిగిలిపోయేవి యిప్పుడు అందుకునే పరిస్థితి వున్న వాళ్లను మినహాయిస్తే ముందు వున్న పరిస్థితి వస్తుంది కదా అనగా యివి అన్నీ తెచ్చి పెట్టుకున్న వాదనలు అన్నారు కృపాకర్. “సామాన్యులు అంగీకరించినా చదువుకొని ఉద్యోగాలలో వున్న వాళ్ళు సమానమైన ప్రాతినిధ్యం ని అంగీకరించటం లేదు. మనకంటే వెనుక బడిన వాళ్ళకు అవకాశం యివ్వాలి అనేది ఆలోచన గా వుండాలి.”
అయితే రాజకీయ రంగంలో డబ్బు ప్రమేయం తగ్గించే దానిలో భాగంగా దళితులలో డబ్బు పెట్టి పోటీచేస్తున్న వాళ్ళకు ముందు క్రీమీ లేయర్ ఎందుకు అమలు చేయకూడదు. క్రీమీ లేయర్ కాకుండా వెనుకబాటుతనం లెక్క కట్టి అవకాశాలు యివ్వాలి అని వేంకటేశు తన ఆలోచనగా యిదే పరిష్కారమని అన్నారు.