ముగిసిన ప్రభాకర్ రావు విచారణ

8 గంటల పాటు ప్రశ్నలు సంధించిన సిట్. మళ్ళీ విచారణ అప్పుడే..;

Update: 2025-06-09 15:03 GMT

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిట్ సోమవారం విచారించింది. దాదాపు ఎనిమిది గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. డీసీపీ విజయ్, ఏసీపీ వెంకటగిరి ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ కేసులో తిరుపతన్న, రాధాకిషన్ రావు, ప్రణీత్‌రావు, భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించారు అధికారులు. వాటితో పాటుగా ఈ కేసులో ఇప్పటి వరకు సేకరించిన ఆధారాలను ఆయన ముందు ఉంచి కూడా ప్రశ్నించారు. సోమవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమైన విచారణ రాత్రి 8 గంటల సమయంలో ముగిసింది. అనతరం ఈ నెల 11న మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని అధికారులు ప్రభాకర్ రావుకు సూచించినట్లు సమాచారం.

Tags:    

Similar News