గద్దర్ అవార్డుల పండుగలో తెలంగాణ కళాకారులకు అన్యాయం: కంచె ఐలయ్య

ప్రభుత్వం గద్దర్ స్పూర్తిని మరచిపోయిందని ప్రొఫెసర్ కంచె ఐలయ్య అంటున్నారు.;

Update: 2025-06-16 06:52 GMT

పదేళ్ల బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వాగ్గేయ కారుడు గద్దర్ ను పట్టించుకోలేదనే ఆరోపణలు మూట కట్టుకుంది.బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు గద్దర్ కు అపాయింట్ మెంట్ ఇవ్వడానికి కెసీఆర్ ఇష్టపడలేదు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు గద్దర్ ను కలవలేదు. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రగతిభవన్ ముందు గంటల తరబడి గద్దర్ పడిగాపులు కాచారు. ప్రగతి భవన్ గేటు వద్ద గంటల తరబడి ఎండలో కూర్చోబెట్టిన కెసీఆర్ పై గద్దర్ అభిమానులు అప్పట్లో విరుచుకుపడ్డారు. ఇది గతం. తాజాగా గద్దర్ అవార్డుల ఫంక్షన్ వివాదాస్పదమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దర్ స్పూర్తిని మరచిపోయిందని ప్రొఫెసర్ కంచె ఐలయ్య అంటున్నారు.

పదేళ్లపాటు కెసీఆర్ ను గట్టిగా వ్యతిరేకించిన రిటైర్డ్ ప్రోఫెసర్ కంచె ఐలయ్య ఆ తర్వాత కాంగ్రెస్ కు దగ్గరయ్యారు. రాహుల్ గాంధీతో సన్నిహితంగా ఉండే కంచె ఐలయ్య తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేయడం ప్రాధాన్యత సంతరరించుకుంది. గద్దర్ కు అత్యంత సన్నిహితుడైన కంచె ఐలయ్య కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శుల చేయడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

నిన్న గద్దర్ సినిమా అవార్డుల పండుగను తెలంగాణ వాదులు వ్యతిరేకిస్తున్నారు. గద్దర్ అవార్డుల పండగ సినిమా నటుల , రాజకీయ నేతల వ్యవహారంగా మారిపోయిందని కంచె ఐలయ్య అంటున్నారు. . తెలంగాణ ప్రభుత్వం కవులు, కళాకారులను గేయ రచయితలను విస్మరించిందనేది కంచె ఐలయ్య తాజా ఆరోపణ. తెలంగాణ సంస్కృతి లో భాగమైన వీరిని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా పక్కన పెట్టేసిందని కంచె ఐలయ్య ఆరోపించారు. గద్దర్ తెలంగాణ సంస్కృతికి ప్రతి బింబం. అయినా తెలంగాణ కవులు, రచయితలు, గాయకులకు గద్దర్ అవార్డుల ఫంక్షన్ లో స్థానం లేకుండా పోయిందని కంచె ఐలయ్య ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ ఫ్యూడల్ భావజాలంపై దశాబ్దాల పాటు పోరాటం చేసిన గద్దర్ అవార్డుల ఫంక్షన్ లో తెలంగాణ కళాకారులకు అవమానం జరిగిందని ఐలయ్య అన్నారు. గద్దర్ బ్రతికున్నన్ని రోజులు కాంగ్రెస్ వెంటే నడిచారని ఐలయ్య అన్నారు. గద్దర్ కు అత్యంత సన్నిహితుడైన తనకు ఇన్విటేషన్ రాలేదని కంచె ఐలయ్య అన్నారు. తనతో పాటు గద్దర్ వెంట నడిచిన అనేక మంది కవులు, కళాకారులు తమకు ఇన్విటేషన్ రాలేదని తనతో అన్నారని ఐలయ్య గుర్తు చేశారు.

గద్దర్ అవార్డు పండుగ అంటే తెలంగాణ సమాజానికి అంచనాలు ఎక్కువగా ఉండేది. అప్పటి వరకు కమర్శియల్ భావజాలంతో ఉన్న నిర్మాతలు పూలే భావజాలంతో ముందుకు పోతారని అందరూ అనుకున్నారు. కానీ అవేవి జరగకుండానే జ్యురీ అవార్డులను ప్రకటించింది. ఏ ఒక్క జానపద కళాకారుడికి అవార్డుల్లో స్థానం కల్పించలేదని ఐలయ్య ఆవేదన వ్యక్తం చేశారు.‘‘ గద్దర్ భావజాలం ఉన్న వ్యక్తులు జ్యూరీలో స్థానం లేకుండా పోయింది. కాబట్టే తెలంగాణ సంస్కృతిని ప్రతి బించే కళాకారులకు అన్యాయం జరిగింది ’’ అని ప్రొఫెసర్ ఐలయ్య అన్నారు.

Similar News