బిజెపి ఎంపీ రఘునందన్ రావుకు మళ్లీ బెదిరింపు
మావోయిస్టులమంటూ ఫోన్;
బిజెపి ఎంపీ రఘు నందన్ రావుకు మావోయిస్టుల నుంచి మళ్లీ బెదిరింపు కాల్ వచ్చింది. ఆర్థో సమస్యతో ఆస్పత్రిలో చేరిన రఘునందన్ రావును ఆదివారం మావోయిస్టులు మరో మారు బెదిరించారు.
ఈ నెల 23న మావోయిస్టులు రఘునందన్ రావును ఫోన్ లో బెదిరించారు. బెదిరింపు నేపథ్యంలో రఘునందన్ రావు మెదక్ ఎస్పీ, రాష్ట్ర డిజిపికి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
కాలికి శస్త్ర చికిత్స చేసుకున్న రఘునందన్ రావు కు మేము ఆంధ్ర ప్రదేశ్ మావోయిస్టు కమిటీ నుంచి మాట్లాడుతున్నాం. ఇప్పటికే 5 టీమ్ లు నిన్నుచంపడానికి రంగంలో దిగాయని హెచ్చరించారు.
మా ఫోన్లు ట్రేస్ చేస్తున్నట్లు సమాచారమందింది. మేం ఇంటర్ నెట్ ఫోన్లను వాడుతున్నాం. నిన్ను వదిలేది లేదు అని ఫోన్ కట్ చేశారు ప్రముఖ అడ్వకేట్, సిట్టింగ్ ఎంపీ అయిన రఘునందన్ రావుకు వారంలో రెండు పర్యాయాలు మావోయిస్టుల నుంచి బెదిరింపుకాల్ రావడం చర్చనీయాంశమైంది. అయితే రఘునందన్ రావు పోలీసులకు మరో మారు ఫిర్యాదు చేశారు.
ఆపరేషన్ కగార్ కు వ్యతిరేకంగా ప్రజా సంఘాలు ఇప్పటికే ఆందోళ చేస్తున్నాయి. వచ్చే సంవత్సరం కల్లా మావోయిస్టు రహిత దేశంగా ప్రకటిస్తామని అమిత్ షా ప్రకటించారు. అమిత్ షా ఆదివారం నిజామాబాద్ లో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆయన తెలంగాణ రాకను వ్యతిరేకిస్తూ ఈ బెదిరింపు కాల్ వచ్చినట్టు తెలుస్తోంది.