తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యవర్గంలోని అనుబంధంగా ఉన్న అయిదు కమిటీలను అఖిలభారత కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించింది. పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపి డాక్టర్ మల్లురవిని క్రమశిక్షణ కమిటీ చెయిర్మన్ గా నియమించారు. మల్లు రవి కాంగ్రెస్ పార్టీలో ఉన్న అరుదైన నాయకుడు. పార్టీ అధికారంలో ఉన్నా, లేకపోయినా విధేయతో విషయంలో మొదట చెప్పుకునే పేర్లేవయిన ఉంటే మల్లు ఒకరు. అధికారం పోగానే పేరుమోసిన కాంగ్రెస్ నాయకులు కూడా నిరాశలో పడిపోయి పార్టీ మారాలనుకోవడం, కనిపించకుండా పోవడమే జరుగుతుంది. కానీ మల్లు రవి ఒడిదుడుకులకు వెరవని నాయకుడు. ఎపుడూ పార్టీతోనే. ఆయనను క్రమశిక్షణ కమిటీ ఎంపికచేయడం జరిగింది.
ఇక, టీపీసీసీ కార్యవర్గంలో ప్రధాన పోస్టుల ఎంపిక వ్యవహారంలో ఏకాభిప్రాయం కుదరక పోవడంతో దాన్ని పెండింగులో పెట్టారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ, టీపీసీసీ సలహా కమిటీ, డీ లిమిటేషన్ కమిటీ, సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీలను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖర్చున్ ఖర్గే ఆమోదం తెలపడంతో ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటించారు.
టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ
టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీలో మీనాక్షి నటరాజన్, బి మహేష్ కుమార్ గౌడ్, ఏ రేవంత్ రెడ్డి,మల్లు భట్టి విక్రమార్క, ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి,దామోదర్ రాజనర్సింహ, చల్లా వంశీచంద్ రెడ్డి. జి రేణుకాచౌదరి, పోరిక బలరాం నాయక్, డి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డి అనసూయ సీతక్క, ముహమ్మద్ అలీ షబ్బీర్, ముహ్మద్ అజహరుద్దీన్,ఆది శ్రీనివాస్, వి శ్రీహరి ముదిరాజ్, బీర్ల ఐలయ్య, పి సుదర్శన్ రెడ్డి, కె ప్రేమ్ సాగర్ రావు, జెట్టి కుసుమ కుమార్, ఈరపత్రి అనిల్ కుమార్ లను నియమించారు.
ప్రత్యేక ఆహ్వానితులుగా మంత్రులు
టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీలో ఎక్స్ అఫీషియో సభ్యులుగా కాంగ్రెస్ అనుబంధ సంఘాల అధ్యక్షులు, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు,తెలంగాణలోని ఏఐసీసీ కార్యదర్శులు ఉంటారు.ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర మంత్రులు టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీలో పాల్గొంటారు.
టీపీసీసీ డీ లిమిటేషన్ కమిటీ
తెలంగాణ పీసీసీ డీ లిమిటేషన్ కమిటీలో ఛైర్మన్ గా చల్లా వంశీచంద్ రెడ్డిని నియమించారు. ఈ కమిటీలో సభ్యులుగా గద్వాల విజయలక్ష్మీ, ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, డాక్టర్ శ్రవణ్ కుమార్ రెడ్డి, పవన్ మల్లాది, డి వెంకటరమణలను ఏఐసీసీ నియమించింది.
టీపీసీసీ సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ
టీపీసీసీ సంవిధాన్ బచావో ప్రోగ్రామ్ కమిటీ ఛైర్మన్ గా పి వినయ్ కుమార్ ను ఏఐసీసీ ప్రకటించింది. ఈ కమిటీలో సభ్యులుగా ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యే కె శంకరయ్య, ఎన్ బాలునాయక్, మాజీ ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి, ఆత్రం సుగుణ, రాచమల్ల సిద్ధేశ్వర్, సంతోష్ కోలకొండ, డాక్టర్ పులి అనిల్ కుమార్, జూలూరి ధనలక్ష్మీ, మాజిద్ ఖాన్, డాక్టర్ జి రాములు, అర్జున్ రావు, శౌరి, కొల్లం వల్లభరెడ్డిలను నియమించారు.
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ గా డాక్టర్ మల్లు రవి ఛైర్మన్ గా, ఎ శ్యామ్ మోహన్ వైస్ ఛైర్మన్ గా ఏఐసీసీ నియమించింది.ఈ కమిటీలో ఎం నిరంజన్ రెడ్డి, బి కమలాకర్ రావు, జఫర్ జావేద్, డాక్టర్ జీవీ రామకృష్ణలను సభ్యులుగా నియమించారు.
టీపీసీసీ సలహా కమిటీ
టీపీసీసీ సలహా కమిటీలో మీనాక్షినటరాజన్, ఎ రేవంత్ రెడ్డి, బి మహేష్ కుమార్ గౌడ్, వి హనుమంతరావు, కె జానారెడ్డి, కే కేశవరావు, మధు యాష్కీ గౌడ్, జి చిన్నారెడ్డి, జె గీతారెడ్డి, ఎం అంజన్ కుమార్ యాదవ్, టి జయప్రకాష్ రెడ్డి, జఫర్ జావేద్, టీ జీవన్ రెడ్డి, సిరిసిల్ల రాజయ్య, ఎస్ రాములు నాయక్ లను ఏఐసీసీ నియమించింది.