తెలంగాణలో విషాదం.. పిడుగులు పడి ఆరుగురు దుర్మరణం
రెండు వేర్వేరు చోట్ల పిడుగులు పడి ఆరుగురు రైతులు దుర్మరణం చెందారు.;
ఆదిలాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పిడుగుపడి ఆరుగురు రైతులు చనిపోయారు. రెండు రోజులుగా ఉరుములు మెరుపులతొ కూడిన భారీ వర్షాలకు జిల్లా అతలాకుతలమైంది. జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల పిడుగులు పడి ఆరుగురు రైతులు దుర్మరణం చెందారు. వీరంతా పొలం పనుల్లో నిమగ్నమైనప్పుడు పిడుగులు పడినట్టు సమాచారం. ఒక్కసారిగా వర్షం కురవడంతో 14 మంది రైతులు గాది గూడ మండలం పిప్పిరి గ్రామంలో ఒక గుడిసెలో తలదాచుకున్నారు. అదే సమయంలో ఆ గుడిసెపై పిడుగు పడి పెందూరు మద్రారావు (45), సంజన (22), భీంభాయి (40), రాంబాబు ( 45) అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మందికిగాయాలు కావడంతో సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా బేలా మండలంలో మరో పిడుగు పడి ఇద్దరు మహిళలు చనిపోయారు. నందిని (35), సునీత (35) అక్కడికక్కడే చనిపోయారు. ఉట్నూరు మండలంలో మరో పిడుగుపడి కుమ్మరి తాండకు చెందిన భోకన్ ధన్ రాజ్ (27), నిర్మల (36) టోకెన్ కృష్ణ బాయి (30) తీవ్రంగా గాయపడ్డారు. తాంసీ మండలంలో రామాలయంపై పిడుగుపడి గోపురం దెబ్బతింది. అకాల వర్షాలతో రైతులు అల్లాడుతున్నారు