Vijay Devarakonda | ‘గేమింగ్ యాప్ వేరు.. బెట్టింగ్ యాప్ వేరు’

ఈడీ విచారణ అనంతరం పలు అంశాలు పంచుకున్న విజయ్ దేవరకొండ.;

Update: 2025-08-06 11:19 GMT

రౌడీ హారో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda)ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్(ED) బుధవారం విచారించింది. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన కేసులో భాగంగా విజయ్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం ఈడీ విచారణకు విజయ్ హాజరయ్యారు. అధికారులు అడిగిన ప్రశ్నలు సమాధానం ఇచ్చారు. సదరు యాప్ సంస్థతో తాను చేసుకున్న కాంట్రాక్ట్‌తో పాటు, తీసుకున్న పారితోషికం వంటి అన్ని వివరాలను అధికారులకు అందజేశారు. ఈడీ విచారణ అనంతరం విజయ్ దేవరకొండ పలు కీలక విషయాలను పంచుకున్నారు. బెట్టింగ్ యాప్స్ కేసులో తన పేరు రావడంతోనే విచారణకు హాజరయ్యానని తెలిపారు. ఈ సందర్భంగానే బెట్టింగ్స్ యాప్స్ వేరు, గేమింగ్ యాప్స్ వేరు ఉంటాయని అన్నారు. తాను A23 అనే యాప్‌ను ప్రమోట్ చేశానని, దానికి సంబంధించి ప్రశ్నించడం కోసమే అధికారులు పిలిచారని క్లారిటీ ఇచ్చారు. కాగా తాను బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేయలేదని కూడా తెలిపారు.

లీగల్ యాప్‌నే ప్రమోట్ చేశా..

‘‘బెట్టింగ్ యాప్స్, గేమింగ్ యాప్స్‌కు ఏమాత్రం సంబంధం ఉండదు. అనేక రాష్ట్రాల్లో గేమింగ్ యాప్స్‌ చట్టబద్దమైనవే. వీటికి జీఎస్టీ, ట్యాక్స్ సహా అన్ని అనుమతులు ఉంటాయి. రిజిస్ట్రేషన్ కూడా ఉంటుంది. ఐపీఎల్, కబాడీ, వాలీబాల్‌కి స్పాన్సర్ చేస్తున్నారు. అదే విధంగా యాప్స్‌కు ప్రమోషన్, స్పాన్సరింగ్ ఉంటుంది. వీటితో పాటు నా బ్యాంక్ లావాదేవీలకు సంబంధించి వివరాలను కూడా అధికారులకు అందించాను. నేను ప్రమోట్ చేసిన A23 అనే యాప్ తెలంగాణలో ఓపెన్ కాదు. నేను లీగల్‌గా ఉన్న గేమింగ్ యాప్‌ను మాత్రమే ప్రమోట్ చేశాను’’ అని విజయ్ వివరించారు.

Full View

అసలు కేసు ఏంటంటే..

బెట్టింగ్ వ్యవసం వల్ల అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్న యువత సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ యాప్స్‌పై ఉక్కుపోదం మోపాలని తెలంగాణ పోలీసులు నిశ్చయించుకున్నారు. ఇందులో బాగంగానే వీటిని ప్రమోట్ చేస్తున్న సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు, నటీనటులపై కేసులు నమోదు చేశారు. ఇందులో అనేక మంది బడాబడా హీరోలు కూడా ఉన్నారు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ఈ కేసులోకి ఈడీ కూడా ఎంటర్ అయింది. బెట్టింగ్ పేరిట భారీ మనీలాండరింగ్ ఏమైనా జరుగుతుందా అన్న కోణంలో ఈడీ విచాణను ముందుకు సాగిస్తోంది. ఈ క్రమంలోనే సెలబ్రిటీలను ఒకరి తర్వాత ఒకరుగా విచారిస్తోంది. వారి నుంచి కాంట్రాక్ట్‌లు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ వంటి సమాచారాన్ని సేకరిస్తోంది.

Tags:    

Similar News