మాజీ సీఎం వర్సెస్ తాజా సీఎం మధ్య మాటల యుద్ధం
అన్నా యూనిర్శిటీ లైంగిక వేధింపుల కేసు క్రెడిట్ కీలు బొమ్మ సీఎం ఎలా తీసుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేసిన పళని స్వామి;
By : The Federal
Update: 2025-05-29 11:07 GMT
అన్నా యూనివర్శిటీ లైంగిక వేధింపుల కేసులో జ్ఞానశేఖరన్ దోషిగా తేలడంతో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, అన్నాడీఎంకే నాయకుడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి మధ్య మాటల యుద్ధం మొదలైంది. కేసు నిర్వహణ, రాష్ట్రశాంతి భద్రతల పరిస్థితిపై ఇద్దరు నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.
ఐదు నెలల్లో బాధితురాలికి న్యాయం చేసినందుకు తమిళనాడు పోలీసులను స్టాలిన్ ప్రశంసించారు. దర్యాప్తు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయవ్యవస్థకు ధన్యవాదాలు చెప్పారు. ‘‘ ఏ నేరం జరగకూడదు. కానీ అలా జరిగితే ఏ దోషి తప్పించుకోకూడదు. దర్యాప్తు వేగంగా జరగాలి. శిక్ష తప్పకుండా పడాలి’’ అని పోలీసులకు ఆదేశాలిచ్చారు.
భారతీయ న్యాయసంహిత(బీఎన్ఎస్) ఐటీ చట్టం, తమిళనాడు మహిళలపై వేధింపుల నిరోధక చట్టంలోని వివిధ సెక్షన్ల కింద బుధవారం చెన్నై మహిళా కోర్టు జ్ఞానశేఖరన్ ను దోషిగా నిర్ధారించింది.
జూన్ 2న శిక్ష ఖరారు చేయాలని నిర్ణయించింది. మద్రాస్ హైకోర్టు నియమించిన సిట్ ఈ కేసులో ఇతరుల ప్రమేయాన్ని తోసిపుచ్చింది. అయితే ప్రతిపక్ష నాయకులు తదుపరి దర్యాప్తును డిమాండ్ చేస్తూనే ఉన్నారు.
ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు..
ప్రతిపక్షాలు చౌకబారు రాజకీయాలకు పాల్పడుతున్నాయని స్టాలిన్ ఆరోపించారు. తన ప్రభుత్వం వారి ఉద్దేశాలను విచ్చిన్నం చేసిందని, న్యాయం, మహిళల భద్రతను నిలబెట్టడంలో డీఎంకే నిబద్దతను చాటుకున్నారు.
అయితే ప్రతిపక్ష నాయకుడు ఈపీఎస్, స్టాలిన్ తీవ్రంగా విమర్శలు గుప్పించారు. డీఎంకే అధినేత తన అసమర్థతను పదేపదే నిరూపించుకుంటున్నాడనని, కీలు బొమ్మ సీఎం అంటూ ఎద్దేవా చేశారు.
లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వ వ్యవహరించిన తీరును చూసి హైకోర్టు జోక్యం చేసుకుని ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటుకు ఆదేశించాల్సి వచ్చిందని ఈపీఎస్ అన్నారు.
‘‘మీ పోలీసులు న్యాయం చేసి ఉంటే, రాజకీయ జోక్యం లేకుండా ఉండాల్సిన సిట్ దర్యాప్తును ప్రభావితం చేసినట్లు మీరు అంగీకరిస్తున్నారా?’’ అని ఈపీఎస్ ప్రశ్నించారు. స్టాలిన్ పరిపాలనలో నేరాలు పెరుగుతూనే ఉన్నాయని, కానీ న్యాయస్థానం తీసుకున్న చర్యల క్రెడిట్ తీసుకుంటున్నారని ఆరోపించారు.
నిందితుడు జ్ఞానశేఖరన్ డీఎంకే సానుభూతిపరుడని ఈపీఎస్ హైలైట్ చేశారు. మొదట్లో డీఎంకే ఈ వాదనను ఖండిచిన.. తరువాత అసెంబ్లీలో సీఎం స్టాలిన్ స్వయంగా దీనిని అంగీకరించారు.
ఎఫ్ఐఆర్ లో ఉన్న ‘సర్’ ఎవరూ?
బాధితురాలి ఎఫ్ఐఆర్ లో ప్రస్తావించిన ‘సర్’ అంటే ఎవరని అన్నాడీఎంకే ప్రశ్నలు సంధించారు. డీఎంకే ప్రభుత్వం ఇందులో ఉన్న పెద్ద తలకాయలను కాపాడుతోందని ఆరోపించారు.
‘‘మీ పాలన న్యాయం, మహిళల భద్రతకు పూర్తి వ్యతిరేకం. ఈ ప్రభుత్వం త్వరలో కూలిపోతుంది. అన్నాడీఎంకే ప్రభుత్వం వచ్చాక దీనివెనక ఉన్న వారందరిని చట్టం ముందు నిలబెడుతుంది’’ అని ఈపీఎస్ హమీ ఇచ్చారు.
జ్ఞానశేఖరన్ డీఎంకే నేతలతో ఉన్న ఫొటోలు బయటకు వచ్చిన తరువాత వివాదం మరింత వివాదాస్పదం అయింది. నిందితుడు డీఎంకే విద్యార్థి విభాగం ఆఫీస్ బేరర్ అని ప్రతిపక్షాలు ఆరోపణలు చేశాయి.
తమిళనాడు న్యాయశాఖ మంత్రి ఎస్. రేగువతి, స్టాలిన్ ఈ వాదనలు తోసిపుచ్చారు. జ్ఞానశేఖరన్ తమ పార్టీ వాడు కాదని, కేవలం సానుభూతిపరుడని మాత్రమే స్పష్టం చేశారు.
టీవీకే అధినేత విజయ్ విమర్శలు..
తమిళగ వెట్రి కజగం(టీవీకే) నాయకుడు విజయ్ కూడా జ్ఞానశేఖరన్ దోషిగా తేలడాన్ని స్వాగతించినప్పటికీ డీఎంకే ప్రభుత్వం ఈ కేసును నిర్వహించిన తీరుపై స్టాలిన్ విమర్శించారు.
ఒక ప్రకటనలో విజయ్, న్యాయం జరిగేలా చూడటంలో మద్రాస్ హైకోర్టు చురకైన పాత్ర పోషించిందని ప్రశంసించారు. ఐదు నెలల్లో కేసు త్వరిత పరిష్కారం కోసం దాని పర్యవేక్షణను ప్రశంసించారు.
గవర్నర్ కు తాను దాఖలు చేసిన పిటిషన్ లతో సహ ప్రజా నిరసనలు, రాజకీయ ఒత్తిళ్లు కోర్టును సిట్ దర్యాప్తుకు ఆదేశించేలా చేశాయని పేర్కొన్నారు. సిట్ ప్రయత్నాల ఫలితంగా జనవరి 5,2025 న గుండాస్ చట్టం కింద జ్ఞానశేఖరన్ అరెస్ట్ అయ్యాడు. ఫిబ్రవరి 24న చార్జీషీట్ దాఖలు చేశారు.
పోలీసులు అప్పట్లో ఎఫ్ఐఆర్ లీక్ చేయడం, హైకోర్టు విమర్శలు, బాధితురాలిని ఇబ్బంది పెట్టిన తీరును ఆయన గుర్తు చేశారు. డీఎంకే తన పరిపాలనా వైఫల్యాలను కప్పిపుచ్చడానికి ప్రయత్నిస్తోందని విజయ్ ఆరోపించారు.
ఈ తీర్పు క్రెడిట్ తీసుకున్నందుకు స్టాలిన్ ను విజయ్ విమర్శించారు. ఇది పెద్ద అబద్ధం అని, డీఎంకే వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి న్యాయవ్యవస్థను కూడా అడ్డుపెట్టుకుంటున్నారని అన్నారు. నిందితుడికి కఠిన శిక్ష విధించాలని, ఎఫ్ఐఆర్ లో పేర్కొన్న ‘సర్’ తో సహ అందరిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈపీఎస్ ఆరోపించిన కీలు బొమ్మను వ్యాఖ్యలను సమర్థిస్తూ విజయ్ కూడా డీఎంకే పాలన అసమర్థమైనదిగా శాంతి భద్రతలను లేదా మహిళల భద్రతను నిర్ధారించడంలో విఫలమైందని విమర్శించారు. 2026 ఎన్నికల్లో డీఎంకే ను ప్రజలు గద్దె దించుతారని ఆయన జోస్యం చెప్పారు.