స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పు రిజర్వ్..

ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న సర్కార్ ఇన్ని రోజులు ఎందుకు ఆగింది?;

Update: 2025-06-23 10:17 GMT

తెలంగాణ స్థానిక సంస్థ ఎన్నికల అంశంపై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ప్రస్తుతం వీటిచుట్టూ తిరుగుతున్నాయి. బీసీ రిజర్వేషన్ల అమలు తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. కాంగ్రెస్ మాత్రం పార్టీ పరంగా మాత్రమే బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది. ఇంతలోనే ఈ అంశంపై హైకోర్టులో పలు పిటిషన్‌లు దాఖలయ్యాయి. వీటిని స్వీకరించిన న్యాయస్థానం విారణ చేపట్టింది. ఇందులో భాగంగా అసలుస్థానిక సంస్థల ఎన్నికలను ఎన్ని రోజుల్లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుందో చెప్పాలని న్యాయస్థానం కోరింది. అదే విధంగా ఫిబ్రవరిలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్న సర్కార్ ఇన్ని రోజులు ఎందుకు ఆగింది? అని కూడా కోర్టు ప్రశ్నించింది. అనంతరం ఈ అంశంపై తీర్పును రిజర్వ్ చేసింది.

న్యాయస్థానంలో వాదనల సందర్భంగా పదవీకాలం ముగిసిన ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలన్న నిబంధనను పిటిషనర్లు గుర్తు చేశారు. ఎన్నికలైనా పెట్టండి లేదా పాత సర్పంచ్ లనే కొనసాగించండి అని పిటిషనర్లు వాదనలు వినిపించారు. మరికొంత సమయం కావాలని ప్రభుత్వం కోరింది. ఎన్నికలు నిర్వహించడానికి మరో 60 రోజుల సమయం కావాలని ఎలక్షన్ కమిషన్ కోరింది. ఈ నేపథ్యంలో హైకోర్టు స్థానిక సంస్థల ఎన్నికలపై తీర్పును రిజర్వ్ చేసింది. కాగా 2024 ఫిబ్రవరి 1 న తెలంగాణ సర్పంచ్ ల పదవీకాలం ముగిసింది.

Tags:    

Similar News