జనాభా లెక్కలపై ప్రతిపక్షాలకు అనుమానం ఎందుకు?
ఈ విడత కులగణన సైతం చేపట్టబోతున్న కేంద్ర ప్రభుత్వం;
Update: 2025-06-05 07:19 GMT
దేశంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ఎట్టకేలకు కులగణనకు అంగీకారం తెలిపింది. జనాభా గణనతో పాటు రెండు దశల్లో కులగణన కూడా చేస్తామని షెడ్యూల్ విడుదల చేసింది.
దేశంలో ప్రతి దశాబ్ధానికి జనాభా లెక్కలు తీస్తుంటారు. ఈ లెక్క ప్రకారం 2021 లోనే జనాభా గణన చేయాల్సి ఉండేది. కానీ అప్పట్లో చైనా వైరస్ కారణంగా అది వాయిదా పడింది.
అయితే ప్రభుత్వం బుధవారం చేసిన ప్రకటన, సమాధానాల కంటే ప్రశ్నలనే ఎక్కువగా లేవనెత్తుతోంది. జనాభా గణన నిర్వహించడానికి ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారమే కనీసం మూడు సంవత్సరాల సమయం పడుతుందని స్పష్టం చేసింది.
ప్రకటనలో ఏముందంటే..
దశాబ్ధ వార్షిక ప్రక్రియ, జనాభా గణన 2027 కులాల గణనతో ప్రారంభమవుతుంది. ఈ ప్రక్రియ మార్చి 1, 2027 న లఢక్ కాకుండా ఇతర ప్రాంతాలు జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లోని మంచుతో కప్పబడిన ప్రాంతాలతో ప్రారంభం కాదు.
మంచుతో ఉన్న ప్రాంతాల జనాభా గణన మాత్రం అక్టోబర్ 1, 2026 నుంచి ప్రారంభిస్తారు. 1948 జనాభా లెక్కల చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం ఈ సంవత్సరం జూన్ 16న జనాభా లెక్కల గెజిట్ నోటిఫికేషన్ తాత్కాలికంగా ప్రచురిస్తారని మాత్రం తెలిపింది.
2030 తరువాతే తుది గణాంకాలు..
సాధారణంగా తుది జనాభా లెక్కల డేటా అనేది గణన ప్రారంభమైన రెండు సంవత్సరాల లోపు ప్రచురించేవారు. ఉదాహరణకు ఏప్రిల్ 2011 లో నిర్వహించిన చివరి జనాభా లెక్కల డేటా 2013 లో ప్రచురించారు.
అయితే అప్పుడు కులాల వారీగా జనాభా లెక్కలు లేవు. అయితే 2027 నాటి జనాభా తుది లెక్కల డేటా మాత్రం మార్చి 2030 కి విడుదల కాబోదని కొన్ని వర్గాలు చెబుతున్నాయి.
‘‘మే 4న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన రాజకీయా వ్యవహారాల కమిటీ(సీసీపీఏ) తీసుకున్న నిర్ణయం ప్రకారం 1931 తరువాత మొదటిసారిగా జనాభా గణనలో కుల గణన ఉంటుంది.
ఇది ఒక చారిత్రాత్మక దశ, ప్రభుత్వం దీనిని అత్యంత చిత్తశుద్దితో పూర్తి చేయడానికే కట్టుబడి ఉంది. ఈ ప్రక్రియకు కొత్త నమూనా(ఫార్మాట్), బడ్జెట్ కేటాయింపు ఉంటుంది.
సేకరించిన డేటాకు ఎక్కువ స్థాయిలో పరిశీలన అవసరం. కుల గణనను ఎలా నిర్వహించాలో లేదా డేటాను ఏ రూపంలో నిర్వహించి పట్టిక రూపంలో ప్రదర్శించాలో బాధ్యతాయుతమైన అధికారులకు కూడా సమయం అవసరం.
దీనికంతా సమయం అవసరం అందుకే జనాభా లెక్కలను మేము మార్చి 1, 2027 ప్రారంభించబోతున్నాము. అక్టోబర్ 1, 2026 నుంచి కొన్నిప్రాంతాలను మినహయించి ఈ పక్రియ ప్రారంభ అవుతుంది. తుది డేటా ప్రచురణకు మూడు సంవత్సరాల సమయం పట్టవచ్చు’’ అని కొన్ని వర్గాలు ‘ది ఫెడరల్ ’ కు చెప్పాయి.
డీలిమిటేషన్ వల్ల ఏదైనా..
2027 జనాభా లెక్కల ప్రచురణ తరువాత అత్యంత వివాదాస్పదమైన డీలిమిటేషన్ కసరత్తు అమలు చేయడానికి, అలాగే లోక్ సభ, అసెంబ్లీ, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీలలో మహిళలలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి డేటాను సేకరించడం, ప్రచురించడం రాజకీయ ప్రాముఖ్యత ఉంది.
ప్రస్తుతం జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనలో ఉన్న ఈ చట్టాన్ని.. సక్రమంగా అమలు చేస్తే వన్ నేషన్, వన్ ఎలక్షన్ అమలు చేయాలనుకుంటున్న మోదీ ప్రణాళిక కూడా అమల్లోకి రావచ్చు.
అందువల్ల ఈ జనాభా లెక్కలు అనేవి, మిగిలిన జనాభా లెక్కల కంటే భిన్నమైనవి. ఇది భారత ప్రజలను లెక్కించడం మాత్రమే కాదు, దాని భవిష్యత్ రాజకీయ మార్గాన్ని కూడా నిర్ణయిస్తుంది.
ప్రతిపక్షాల అనుమానం..
కేంద్ర హోంశాఖ చేసిన ప్రకటనపై చాలామందికి ఆగ్రహంతో పాటు గందరగోళానికి గురిచేసింది. కాంగ్రెస్, డీఎంకే ఇప్పటికే ఈ ప్రకటనపై తమ స్పందనను తెలియజేశాయి.
ఇండి కూటమిలోని మిగిలిన పార్టీలు స్పోక్ పర్సన్ లు ‘ది ఫెడరల్ ’ తో మాట్లాడుతూ.. జనాభా లెక్కలు, కుల గణన కోసం ఇంత సుదీర్ఘమైన ప్రక్రియ ఎందుకు అని అనుమానం వ్యక్తం చేశాయి.
‘‘ ఇంత సుదీర్ఘ కాలక్రమం ఎందుకు, 2029 లోక్ సభ ఎన్నికలే బీజేపీకి లాభం చేకూర్చడానికి కుల గణన, మహిళా రిజర్వేషన్ లు ఆలస్యం చేసే లక్ష్యం’’ కనిపిస్తుంది’’ అని అన్నారు.
‘‘2021 లో జరగాల్సిన జనాభా లెక్కలు మరో 23 నెలలు ఆలస్యం చేయడానికి నిజంగా ఎటువంటి కారణం లేదు. మోదీ ప్రభుత్వం గడువులోపు ఇవి పూర్తి కాకుండా అనేక అంశాలను సృష్టించగలదు’’ అని కాంగ్రెస్ కమ్యూనికేషన్ చీఫ్ జైరాం రమేష్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్..
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ కూడా ఈ ప్రకటన పై అనుమానం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల పునర్విభజన అంశంతో కేంద్రం దీనిని కలపడానికి ప్రయత్నిస్తోందని అన్నారు.
ఈ అంశాన్ని డీఎంకే తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దక్షిణాది రాష్ట్రాల ఎన్నికల్లో సరైన విజయం లేక బీజేపీ తన బలాన్ని ఉత్తరాది రాష్ట్రాలలో పెంచుకోవడానికి డీలిమిటేషన్ తీసుకువస్తుందని, డీఎంకే ఆ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తోంది.
‘‘భారత రాజ్యాంగం 2026 తరువాత మొదటి జనాభా లెక్కల తరువాత నియోజకవర్గాల పునర్విభజన జరగాలని ఆదేశించింది. బీజేపీ ఇప్పుడు జనాభా లెక్కలను 2027 వరకూ ఆలస్యం చేసింది.
తమిళనాడు పార్లమెంటరీ స్థానాలు తగ్గించే ప్రణాళిక స్పష్టంగా కనిపిస్తోంది. నేను దీని గురించి హెచ్చరించాను. ఇది ఇప్పుడు బయటపడుతోంది. బీజేపీతో కలిసి ఉండటం ద్వారా పళని స్వామి మౌనంగా ఉండటమే కాకుండా ఈ ద్రోహంలో భాగస్వామిగా ఉన్నారు.
ఆయన ఢిల్లీ ఆధిపత్యానికి లొంగిపోయారని ఇప్పుడు స్పష్టమైంది. న్యాయమైన డీలిమిటేషన్ కోసం తమిళనాడు ప్రజలు ఐక్యంగా ఉన్నారు. కేంద్ర నుంచి మాకు స్పష్టమైన సమాధానాలు అవసరం’’ అని స్టాలిన్ ఎక్స్ లో ట్వీట్ చేశారు.
డైవర్షన్ పాలిటిక్స్..
జనాభా లెక్కల ప్రకటన అనేది డైవర్షన్ పాలిటిక్స్ అని ఎస్పీ విమర్శించింది. ‘‘బీజేపీ డైవర్షన్ పాలిటిక్స్, వాయిదా వేసే వ్యూహం తప్ప మరొకటి కాదు’’ అని సమాజ్ వాదీ పార్టీ సీనియర్ నాయకుడు ఒకరు అన్నారు.
‘‘బీజేపీది ఇందులో మాస్టర్ మైండ్. ఇండి బ్లాక్ లో ప్రతిపక్షాలు కలిసి రావడం వల్ల అది భయపడింది. మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించారు కానీ దాని అమలు విషయంలో స్పష్టత లేకుండా చేశారు.
బీజేపీ కులగణనను పూర్తిగా వ్యతిరేకించారు. కానీ మేమంతా కలిసి దాన్ని ప్రధాన నినాదంగా మార్చి లోక్ సభ ఎన్నికలకు వెళ్లడంతో దానికి రాజకీయ నష్టం జరిగింది. దేశం మొత్తం పహల్గామ్ విషయంలో ఉన్నప్పుడు అది యూటర్న్ తీసుకుని కుల గణన చేస్తామంది.
కానీ దీనిపై వివరాలు అందించలేదు. ఇప్పుడు కులగణనతో పాటు జనాభా గణన చేస్తామని ప్రకటించారు. కానీ డేటా మాత్రం 2029 లేదా 2030 లో విడుదల చేస్తామంటున్నారున కానీ అది ఎవరికి తెలియదు’’ అని ఎస్పీ నాయకుడు ‘ది ఫెడరల్ ’ తో అన్నారు.
బీజేపీకి ప్రయోజనం..?
జనాభా లెక్కల సమయంలో సేకరించిన డేటా అధికారికంగా ప్రచురించడానికి ముందే ప్రభుత్వానికి అందుబాటులో ఉంటుంది. కాబట్టి 2029 లోక్ సభ ఎన్నికలకు ముందే బీజేపీ తన రాజకీయ ప్రత్యర్థులందరిపై అన్యాయమైన ఆధిక్యం చూపిస్తుందని నాయకులు భావిస్తున్నారు.
‘‘వాస్తవం ఏంటంటే బీజేపీ తన కోటా కూలిపోతుందని తెలుసు. దీనికి స్పష్టమైన సూచన 2024 ఎన్నికల ఫలితం. వారు బీహార్ లో కూడా ఓడిపోతారని మాకు స్పష్టంగా తెలుసు. కాబట్టి జనాభా లెక్కలు, కుల డేటాను సేకరించాలనే నిర్ణయం కేవలం రాజకీయ కుట్ర మాత్రమే’’ అని ఆర్జేడీకి చెందిన ఒక ఎంపీ అన్నారు.
‘‘మేము వింటున్న 2030 సమయానికే ప్రభుత్వం కట్టుబడి ఉంటే, బీజేపీ దాని మిత్రపక్షాలు కులాల డేటాను తమ వ్యక్తిగత ఎన్నికల లాభం కోసం ఉపయోగించుకునేలా వారు ఇలా చేస్తున్నారని నేను పందెం(బెట్) వేయగలను.
వారు(బీజేపీ) 2029 ఎన్నికల ముందు ప్రజాదరణ పొందిన పథకాలను ప్రకటించడానికి, సోషల్ ఇంజనీరింగ్, ఎన్నికల్లో అభ్యర్థుల కోసం దీనిని ఉపయోగిస్తారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు, కులగణన లెక్కల ప్రయోజనాలను అమలు చేయడానికి మరో పదవీకాలం అడగటం ద్వారా ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తారు’’ అని ఆర్జేడీ ఎంపీ అన్నారు.
జూలై 25 ఆగష్టు 12 వరకూ జరగనున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ ను కేంద్రం బుధవారం ప్రకటించింది. దీనితో ప్రతిపక్ష నాయకులు ఈ అంశాన్ని ఉభయ సభల్లో లేవనెత్తాలని ప్రణాళిక రచిస్తున్నారు. దీనిపై స్పష్టమైన సమాధానాలు కేంద్రం నుంచి డిమండ్ చేసే అవకాశం ఉంది.