2029 ఎన్నికలే అసలైన ఫైనల్స్

2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కేవలం సెమీ ఫైనల్స్ మాత్రమే అన్నారు. అసలైన ఫైనల్స్ 2029 ఎన్నికల్లో గెలుపే అన్నారు.

Update: 2024-09-15 11:23 GMT
Revant

రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటి అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతు 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కేవలం సెమీ ఫైనల్స్ మాత్రమే అన్నారు. అసలైన ఫైనల్స్ 2029 ఎన్నికల్లో గెలుపే అన్నారు. 2029 ఎన్నికల్లో పార్టీ రెండోసారి గెలవటమే కాకుండా అత్యధిక ఎంపీ స్ధానాల్లో గెలిచినపుడే ఫైనల్స్ లో గెలిచినట్లుగా రేవంత్ స్పష్టం చేశారు. తెలంగాణాలోని 17 సీట్లలో 15 సీట్లు గెలిపించి జాతీయస్ధాయిలో పార్టీని బలోపేతం చేస్తే రాహూల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారన్నారు. రాహూల్ ను ప్రధానమంత్రిగా చేయటమే తమందరం లక్ష్యంగా పెట్టుకోవాలని రేవంత్ టార్గెట్ కూడా ఫిక్స్ చేశారు.

పార్టీ రాబోయే ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలవాలంటే కొత్త అధ్యక్షుడు మహేష్ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఎల్లకాలం అందుబాటులో ఉంటేనే సాధ్యమవుతుందన్నారు. ప్రభుత్వం, పార్టీ జోడెడ్లబండి అన్నట్లుగా తాను రెండు బాధ్యతలను ఇంతకాలం మోసినట్లు రేవంత్ చెప్పారు. ఇకనుండి పూర్తి సమయాన్ని ప్రభుత్వం నడపటానికి కేటాయించాలనే తాను పీసీసీ అధ్యక్షుడిగా తప్పుకున్నట్లు చెప్పారు. కాబట్టి కొత్తగా బాధ్యతలు తీసుకున్న బొమ్మ మహేష్ పార్టీకి పూర్తికాలం పనిచేయాలని సూచించారు. ప్రభుత్వం, పార్టీ రెండు కలిసి నడిచినపుడే రాబోయే ఎన్నికల్లో పార్టీకి మంచి ఫలితాలు వస్తాయని గుర్తుచేశారు. సౌమ్యంగా ఉంటే ప్రతిసారి ఎన్నికల్లో సాధ్యంకాదని కాబట్టి అవసరమైనపుడు మహేష్ గట్టిగా ఉండాలని సూచించారు.

Tags:    

Similar News