కేటీఆర్‌కు మరోసారి ఏసీబీ నోటీసులు

మరిన్ని అంశాలపై ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు.;

Update: 2025-06-13 11:34 GMT

కేటీఆర్ మెడకు ఫార్ములా ఈ-కార్ రేస్ ఉచ్చు ఇంకా బిగుస్తూనే ఉంది. ఈ కేసుకు సంబంధించి విచారణకు రావాలంటూ ఏసీబీ అధికారులు మరోసారి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేశారు. జూన్ 16 ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆదేశించింది. ఈ కేసులో ఏ1గా ఉన్న కేటీఆర్, ఏ2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా ఉన్న హెచ్ఎండీఏ మాజీ చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డిని ఇప్పటికే ఏసీబీ విడివిడిగా విచారించింది. ఇప్పుడు మరోసారి విచారణకు రావాలని, మరిన్ని అంశాలపై ప్రశ్నించాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇది వరకే రెండోసారి విచారణకు రావాలని ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయితే తాను విదేశీ పర్యటనకు వెళ్లేది ఉందని, దాని నుంచి తిరిగి వచ్చిన తర్వాత విచారణకు హాజరవుతానని కేటీఆర్ తెలిపారు. కానీ పర్యటన ముగిసిన తర్వాత కూడా కేటీఆర్.. ఏమాత్రం ఉలుకుపలుకు లేకుండా ఉన్నారు. దీంతో మరోసారి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. 

Tags:    

Similar News