యాంకర్ స్వేచ్చ ఆత్మ హత్యకు వేధింపులే కారణమా?
పోలీసులను ఆశ్రయించి తల్లిదండ్రులు;
యాంకర్ స్వేచ్చ ఆత్మ హత్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పలు టీవీ చానెల్స్ లో యాంకర్ గా పని చేసిన స్వేచ్చ భర్తతో విడిగా ఉంటుంది. పూర్ణచందర్ రావు అనే వ్యక్తితో స్వేచ్చ సహజీవనం చేస్తోందని ప్రచారం జరుగుతోంది. అయితే పూర్ణ చందర్ రావు ఒక రాజకీయ పార్టీకి చెందిన నేత. ప్రస్తుతం స్వేచ్చ పని చేస్తున్న టీవీ చానల్ కూడా అదే పార్టీకి చెందింది. అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్న పూర్ణచందర్ రావు కొంత కాలంగా సహజీవనం చేస్తున్నాడు. భర్తతో విడిగా ఉంటున్న స్వేచ్చ పూర్ణచందర్ రావు ను పెళ్లి చేసుకోవాలని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
పెళ్లికి నిరాకరించిన పూర్ణచందర్ రావుతో ఇటీవలె విభేధాలు ప్రారంభమయ్యాయి. ఈ విభేధాలు పీక్ లోకి వెళ్లిపోవడంతో స్వేచ్చ తిరిగి తల్లిదండ్రుల వద్దకు చేరింది. పూర్ణచందర్ రావు తనను మోసం చేసినట్టు తల్లిదండ్రులకు చెప్పుకుంది. తన ఫేస్ బుక్ అకౌంట్ పేరులో భర్త పేరుకు బదులు పూర్ణచందర్ రావు పేరు ఉంది. స్వేచ్చ పూర్ణచందర్ పేరు మీద ఫేస్ బుక్ లో పూర్ణచందర్ రావుతో అన్యోన్యంగా దిగిన ఫోటోలు ఉన్నాయి.
స్వేచ్చ పిరికిపంద కాదు: తల్లిదండ్రులు
శుక్రవారం జవహార్ నగర్ ఇంట్లో స్వేచ్చ ఆత్మ హత్య చేసుకుంది. చిక్కడపల్లి పోలీసులు సుసైడ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ సుసైడ్ పై అనేక అనుమానాలున్నాయని స్వేచ్చ తల్లి శ్రీదేవి చెప్పారు. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన బిడ్డ ఆత్మ హత్య చేసుకునే అంత పిరికిపంద కాదని శ్రీదేవి అంటోంది. స్వేచ్చ తో సహజీవనం చేస్తున్న పూర్ణ చందర్ రావుపై అనుమానాలున్నాయని శ్రీదేవి పోలీసులకు సమాచారమిచ్చారు.
తన కూతురును పెళ్లి చేసుకుంటానని నమ్మించి పూర్ణచందర్ రావు మోసం చేసినట్టు స్వేచ్చ తండ్రి శంకర్ అంటున్నారు. తొలుత తన కూతురును పెళ్లి చేసుకోవడానికి అంగీకరించిన పూర్ణచందర్ రావు తర్వాత ప్లేటు ఫిరాయించి పెళ్లి చేసుకోనని మొండి కేశాడని శంకర్ తెలిపారు. ఇద్దరి మధ్య విభేధాలు తారస్థాయికి చేరడంతో ఈ నెల 26న జరిగిన పంచాయతీకి తాను వెళ్లినట్టు శంకర్ చెప్పుకొచ్చారు. తన కూతురిని వేధింపులకు గురిచేసి హత్య చేసిన పూర్ణ చందర్ రావును అరెస్ట్ చేయాలని శంకర్ డిమాండ్ చేశారు.
తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు చిక్కడపల్లి పోలీసులు అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేశారు. జవహార్ నగర్ ఇంట్లో స్వేచ్చ శుక్రవారం ఆత్మహత్య చేసుకోలేదని ఇది ముమ్మాటికి హత్యే నని స్వేచ్చ తల్లిదండ్రులు అంటున్నారు.
స్వేచ్చకు తొమ్మిదో తరగతి చదివే కూతురు ఉంది. జర్నలిజం పట్ల ఉన్న ఆసక్తితో ఆమె ఎలక్ట్రానిక్ మీడియాలో యాంకర్ గా ప్రవేశించారు. పోయట్రీ, ట్రావెలింగ్ రంగాలపై స్వేచ్చకు అభిరుచి ఉందని తల్లి దండ్రులు చెబుతున్నారు.