‘కవిత ఎపిసోడ్ అంతా కల్వకుంట్ల కథా చిత్రమే’
కవిత,కెటిఅర్, సంతోష్ ,హరిష్ రావు లు చార్ పత్తా అయితే కెసిఅర్ జోకర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.;
తెలంగాణ రాజకీయాల్లో కవిత ఎపిసోడ్ అత్యంత రసవత్తరంగా మారింది. ప్రతి పార్టీ నేత కూడా దీనిపైనే తమదైన రీతిలో స్పందిస్తున్నాడు. తాజాగా ఈ వ్యవహారంపై బీజేపీ ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. తెలంగాణలో కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ జరుగుతుందన్నారు. ఇదంతా కూడా కల్వకుంట్ల కథా చిత్రమేనని, అంతా కలిసి నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘‘బీఆర్ఎస్లో చార్పత్తా ఆట జరుగుతోంది. కల్వకుంట్ల సినిమాకు ప్రొడక్షన్ చేస్తున్నది కాంగ్రెస్. బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పుడూ కలవవు. కవిత అరెస్ట్ జరగకుండా ఉండటం కోసం మా పార్టీతో కలవడానికి ప్రయత్నించారు. అవినీతి బీఆర్ఎస్తో బీజేపీ కలవదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మాత్రమే కలిశాయి’’ అని వ్యాఖ్యానించారు. కవిత,కెటిఅర్, సంతోష్ ,హరిష్ రావు లు చార్ పత్తా అయితే కెసిఅర్ జోకర్ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా బిఅర్ఎస్, బిజెపి కలవడం నిజమెనన్న రాజాసింగ్ వ్యాఖ్యాలపై రాజాసింగ్ నే అడగమని అన్నారు.