’ప్రమాద బాధితుల సమాచారం లభించడం లేదు’
బ్లాస్టులో గాయపడిన వారిని పరామర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు;
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి కెమికల్ ఫ్యాక్టరీ (Sigachi Chemical factory) జరిగిన అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వారి వివరాలను ప్రభుత్వ బహిర్గంత చేయాలని మాజీ బిఆర్ ఎస్ మంత్రి టి హరీష్ రావు కోరారు. ఈరోజు ఆయన పరిశ్రమ లో జరిగిన బ్లాస్ట్ లో గాయపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.
మొత్తం 150 మంది ఆ సమయంలో పని చేస్తున్నారని చెబుతూ 26 మంది ఆసుపత్రుల్లో ఉన్నారని 20, 30 మంది బయటికి పరుగెత్తుకు వచ్చారని చెప్పారు. మిగతా 50, 60 మంది పరిస్థితి ఎలా ఉందో వెంటనే తెలుసుకోవాలి అని అన్నారు.
ఐదురుగు వెంటిలేటర్, నలుగురు తీవ్ర గాయాలతో ఉన్నారు. మంచి వైద్యం అందించాల్సిన అవసరం ఉంది చెబుతూ. వారిని వెంటనే హైయర్ ఫెసిలిటీ సెంటర్ కు పంపాలని అన్నారు.
‘సిగ్నల్ ఫ్రీ, ట్రాఫిక్ ఫ్రీ ఏర్పాటు చేసి, వెంటిలేటర్ అంబులెన్స్ లో మంచి ఆసుపత్రులకు తరలించాలని కోరాను.
కుటుంబ సభ్యులు ఆవేదన పడుతున్నారు. మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తాను. అనేక మంది వివిధ ఆసుపత్రుల్లో ఉన్నారు. మరోవైపు కుటుంబ సభ్యులు గేటు దగ్గరకు వెళ్లి ఆందోళన చెందుతున్నారు.
ప్రమాదంలో చిక్కుపోయిన వారి వివరాలు బహిర్గతం చేయాలి. ఆందోళనకు గురి చేయొద్దనే బాధ్యతతో నేను మాట్లాడుతున్నాను. ప్రభుత్వం పూర్తిగా బాధ్యతారాహిత్యంగా ఉంది. సమన్వయం చేసే వారు లేరు, వివరాలు చెప్పే వారు లేరు ఇది చాలా బాధాకరం. ప్రభుత్వం వెంటనే స్పందించాలి. 5 గంటలు గడిచినా పెద్దగా చేసింది లేదు,’ అని హరీష్ రావు అన్నారు.