Revanth Reddy | రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి సర్కార్ రెడీ

రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి స్థలాల గుర్తింపు ప్రక్రియకు సంబంధించి వారం రోజుల్లో రిపోర్ట్ అందించాలన్నారు సీఎం రేవంత్.;

Update: 2025-02-14 09:24 GMT

తెలంగాణలోని యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూళ్లు నిర్మించాలని రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం నిశ్చయించుకుంది. ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడమే ఈ స్కూళ్ల ప్రధాన లక్ష్యం. ఈ స్కూళ్లను ప్రతి నియోజకవర్గంలో నిర్మించడానికి భూసేకరణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కాగా ఈ స్కూళ్ల నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి.. విద్యాశాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇందులో పలు కీలక విషయాలపై చర్చించారు. స్కూళ్ల నిర్మాణానికి అయ్యే ఖర్చు, భూసేకరణ వంటి అంశాలను అడిగి తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి. వంద నియోజవర్గాల్లో నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు ఉండాలని సీఎం వివరించారు. నియోజకవర్గాల్లో స్థలాల కేటాయింపుల్లో పూర్తయిన వాటికి అనుమతులకు సంబంధించిన పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించిన సీఎం.

ప్రతిపాదిత స్థలాలు రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుకు అనువుగా ఉన్నాయో లేదో పరిశీలించాలని సూచించారు. అనువైన స్థలం లేని చోట ప్రత్యామ్నాయ స్థలాన్ని సేకరించాలని తెలిపారు. కలెక్టర్లు ఫీల్డ్ విజిట్ చేసి వీలైనంత త్వరగా స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మాణానికి స్థలాల గుర్తింపు ప్రక్రియకు సంబంధించి వారం రోజుల్లో రిపోర్ట్ అందించాలన్నారు. ఇప్పటికే స్థల సేకరణ జరిగిన నియోజకవర్గాల్లో యుద్ధ ప్రాతిపదికన పనులు మొదలు పెట్టేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. రెండేళ్లలో 105 నియోజకవర్గాల్లో అన్ని రకాల మౌలిక వసతులతో వందశాతం పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం.

వీరనారి చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో ఆ స్థాయి ప్రమాణాలతో సరైన మౌలిక వసతులు కల్పించాలన్నారు రేవంత్. ప్లే గ్రౌండ్, అకాడమిక్ బ్లాక్, ఇతర సౌకర్యాలను భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ప్రణాళికలు సిద్ధం చేయాలని, యూనివర్సిటీ అభివృద్ధికి అవసరమైన నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు రేవంత్.

Tags:    

Similar News