అగ్నిప్రమాదంపై గవర్నర్ దిగ్భ్రాంతి
చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించి ఆదుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని(Revanth) గవర్నర్ ఆదేశించారు;
By : The Federal
Update: 2025-05-18 11:06 GMT
ఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌజ్ ఏరియాలో జరిగిన అగ్నిప్రమాధంపై తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu dev Varma) తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. అగ్నిప్రమాదంలో మృతులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ప్రమాదంలో గాయపడినవారు వెంటనే కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రమాధంలో చనిపోయిన వారి కుటుంబాలను ఆదుకోవాలని, గాయపడిన వారికి అత్యుత్తమ వైద్యం అందించి ఆదుకోవాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని(Revanth) గవర్నర్ ఆదేశించారు. జరిగిన ప్రమాదంలో 17 మంది చనిపోవటం తనను తీవ్రంగా కలచివేసిందని గవర్నర్ చెప్పారు.