కాళేశ్వరం రీడిజైన్కు కారణం చెప్పిన హరీష్ రావు..
హరీష్ రావును 40 నిమిషాల పాటు విచారించిన కాళేశ్వరం కమిషన్. పలు అంశాలపై దృష్టి సారించిన అధికారులు.;
కాళేశ్వరం కమిషన్ ముందు విచారణకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావు హాజరయ్యారు. ఆయన విచారణ దాదాపు 40 నిమిషాలు కొనసాగింది. ఇందులో పలు కోణాల్లో అధికారులు ప్రశ్నలు అడిగారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్ట్ను రీడిజైన్ ఎందుకు చేయాల్సి వచ్చింది? అన్న ప్రశ్నను కూడా అడిగారు. కాగా అధికారులు అడిగిన ప్రశ్నలకు హరీష్ రావు బదులిచ్చారు. మహారాష్ట్ర, సీడబ్ల్యూసీ అభ్యంతరాల వల్లే కాళేశ్వరం రీడిజైన్ చేసినట్లు హరీష్ రావు వివరించారు. హరీష్ రావును జస్టిస్ పీసీ ఘోష్ ప్రశ్నించారు. తమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత సమస్యగా ఉందని, అందువల్లే కాళేశ్వరం ప్రాజెక్ట్ను రీడిజైన్ చేశామని హరీష్ రావు వివరించారు. వాస్కోప్ ద్వారా సర్వే చేయించిన తర్వాతనే ప్రాజెక్ట్ స్థలం మార్చామని చెప్పారు. హరీస్ రావు. ఈ విచారణలో భాగంగానే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల గురించి కూడా కమిషన్ ప్రశ్నించింది. అన్ని ఆనకట్టల నిర్మాణానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపిందని, కేబినెట్ నుంచి ఆమోద ముద్ర పడిన తర్వాతనే పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు హరీష్ రావు. ఇంజినీర్ల సూచన మేరకే అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మార్పు జరిగిందన్నారు. స్థలాల మార్పు గతంలోనూ కొన్ని ప్రాజెక్టుల విషయంలో జరిగిందని గుర్తు చేశారు. మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి నేరుగా నీరు తరలించవద్దని విశ్రాంత ఇంజినీర్లు చెప్పారన్న హరీశ్రావు.. వారి సూచన మేరకే స్థలం మార్చినట్లు తెలిపారు. ప్రాజెక్టు రుణసేకరణ కోసమే కాళేశ్వరం కార్పొరేషన్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.