హైద్రాబాద్ లో ఇద్దరు వెహికిల్ దొంగలు అరెస్ట్

పార్కింగ్ చేసిన వెహికిల్స్ వారి టార్గెట్;

Update: 2025-06-21 09:01 GMT

పార్కింగ్ స్థలంలో టూ వీలర్ పెట్టి వెళ్లిన వ్యక్తులకు తిరిగి వచ్చి చూస్తే తమ వెహికిల్ కనపడదు. తాళం వేసి వెళ్లి న యజమానులు రోడ్డు మీదే తమ వాహనాలను పోగొట్టుకున్నారు. ఈ తరహా దొంగతనాలు హైద్రాబాద్ లో ఎక్కువయ్యాయి. కేసులు నమోదు చేసుకున్నహైద్రాబాద్ పోలీసులు ఇద్దరు దొంగలను శనివారం అరెస్ట్ చేశారు.

పార్కింగ్ చేసి ఉన్న వాహనాలను ఎత్తుకెళ్తున్న ఇద్దరు దొంగలను బంజారాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. కృష్ణా నగర్ కు చెందిన 32 ఏళ్ల నిమ్మత శ్రీకాంత్ , ఉప్పల్ కు చెందిన22 ఏళ్ల ఇ. నవీన్ లు వృత్తిరీత్యా సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ వేషాలు వేసే వారు. ప్రవృత్తి రీత్యా దొంగతనాలు చేసేవారు. ఈజీగా డబ్బు సంపాదించాలని వాళ్లు దొంగతనాలకు పాల్పడేదారు.

ఇళ్లలో, కార్యాలయాల్లో వాళ్లు దొంగతనాలు చేయరు. రిస్క్ లేని దొంగతనాలను ఎంచుకున్నారు. రద్దీ ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన వాహనాలేవారి టార్గెట్. వాహన యజమానులు తమ వెహికిల్స్ ను రోడ్ల మీద పార్కింగ్ చేసి వెళ్లిపోతుంటారు. పార్కింగ్ డబ్బులకు కక్కుర్తిపడ్డ యజమానులు రోడ్ల మీద పార్కింగ్ చేయడాన్ని ఈ దొంగలు అవకాశంగా తీసుకున్నారు. తిరిగి వచ్చి చూసే వరకు తమ వాహనాలు చోరీ అయిన కేసులు హైద్రాబాద్ లోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎక్కువయ్యాయి.

సిసి టీవీలను రోడ్ల మీద అమర్చి నిఘా పెట్టారు పోలీసులు. సినిమాషూటింగ్ లు లేనప్పుడు వాళ్లు ఈ ఇద్దరు దొంగతనాలకు పాల్పడేవారు. అరెస్ట్ చేసిన ఇద్దరు దొంగల నుండి మూడు టూ వీలర్ వెహికిల్స్ ను బంజారాహిల్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు, జూబ్లిహిల్స్, గోపాలపురం, బోరడండ, మేడ్చేల్, పేట బషీర్ బాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఒక్కో వెహికిల్ దొంగిలించారు. ఇద్దరు దొంగలపై 10కేసులు నమోదయ్యాయి. నిమ్మల శ్రీకాంత్ పై అనేక కేసులు నమోదయ్యాయని పోలీసులు తెలిపారు. కోర్టులో విచారణ జరుగుతుందన్నారు.మరో నిందితుడైన షేక్ కలీమ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. తాము దొంగతనం చేసిన వెహికిల్స్ ను షేక్ కలీం కొనేవాడు. ఇతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags:    

Similar News